Friday, July 17, 2026
26.4 C
Hyderabad

‘కొండ’ను ఢీ’ కొంటున్నారా!?|KONDA MURALI|BASVARAJ SARAIAH

సారయ్య ఫిర్యాదు సారమేంటి?
బస్వరాజు రాజకీయ బలమేంటి?
ASSEMBLY|అసెంబ్లీ జరుగుతండగానే తెగువేంటి?
సారయ్య సాహసం వెనుక ఉన్నదెవరు?
ఆ ‘ఆదృశ్య ‘హస్తం’ ఎవరిది?
అధిష్టాన పెద్దల ప్రాపకమా?
WARANGAL EAST|‘తూర్పు’లో తన పూర్వ వైభవ పాకులాటా?

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తప్పుడు అట్రాసిటీ కేసుల్లో రాజకీయ ప్రమేయం, కొందరు పోలీసుల దాష్టీకంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం సంచలనమైంది. అయితే, సాదాసీదా నేత సారయ్య ఈ సాహసం వెనుక ఎవరున్నారు? ఆ ’ఆదృశ్య ‘హస్తం’ ఎవరిది? అధిష్టానం పెద్దల ఆశీస్సులేమైనా ఉన్నాయా? లేక ‘తూర్పు’లో తన పూర్వ వైభవం కోసం పాకులాడుతున్నారా? రాజకీయ ‘ఎత్తు’ పల్లాల్లో సారయ్య తన ‘తూర్పు’ సీటును కోల్పోయారు. ఇప్పుడు దాన్ని తిగిరి పొందే ‘ఎత్తు’గడల్లో ఉన్నారా? అందుకే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులను అంటే ‘కొండ’లను ఢీ కొంటున్నారా?

వరంగల్, జనవరి 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాల్లో సామాజిక, రాజకీయ, అధికార సమీకరణలు మారుతున్నాయి. పోలీసు, రాజకీయ సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోలీసు పోస్టింగుల్లో రాజకీయ ప్రమేయంలాగే, పోలీసింగ్ లోనూ రాజకీయ క్రీ(నీ)డ అనివార్యమైంది. గత ప్రభుత్వం నుండే ఇది తీవ్రమైంది. రాజకీయ నేతల సిఫారుసులతో పోస్టింగుకొచ్చిన పోలీసులు, వారికనుకూలంగా పని చేయడం ‘మామూలైంది’. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీకి చేసిన ఫిర్యాదులోనూ అదే చేశారు. ‘గతంలో వరంగల్‌ తూర్పులో పనిచేసిన ఒక ఏసీపీ, మట్వాడా స్టేషన్ లో పనిచేసిన ఒక సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే తరహాలో ఇదే నియోజకవర్గంలోని ఏజే మిల్స్ కాలనీ, ఇంతేజార్‌గంజ్, మట్వాడా అనే మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన అట్రాసిటీ కేసులు కూడా ఇదే కోవలోకి వస్తాయ’ని సారయ్య డీజీపీకిచ్చిన వినతి పత్రంలో ఆరోపించారు. పైగా ఒక ఉన్నత పోలీసు అధికారితో తిరిగి విచారణ జరిపించాలని అభ్యర్థించారు. కొండా దంపతుల రాజకీయ ఆధిపత్యం కోసం, వారి ప్రోద్బలంతో అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారనేది సారయ్య ఫిర్యాదు సారాంశం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అదీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం ద్వారా, జిల్లా స్థాయి శాఖాపరమైన సమస్యను, రాష్ట్ర స్థాయిలో చర్చగా మార్చారు.

అయితే సాదాసీదా నాయకుడైన సారయ్య ఫిర్యాదుతో ‘కొండ’ను ఢీ కొంటున్నారా? రాజకీయంగా అమీతుమీకి సిద్ధపడ్డారా? అసలు కారణాలేంటి? దీనికి వెనుక శక్తులెవరు? ఈ చర్యల పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
ఫిర్యాదు సారయ్య వ్యక్తిగతమైనా, ఒక్క నియోజకవర్గానికే పరిమితమైన గొడవగా మాత్రమే చూడలేం. కాంగ్రెస్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న నాయకత్వ పోటీ. పాత, కొత్తల మధ్య కొట్లాట. పోలీసు, రాజకీయ జోక్యాలతో అడుగంటుతున్న ప్రజాస్వామిక విలువలు, సామాన్య ప్రజల సమస్యలుగా పరిగణించాల్సి ఉంటుంది.

సారయ్య వ్యక్తిగతంగానూ, పార్టీగతంగానూ వ్యూహాత్మకంగానే ఈ ఎత్తుగడ వేసినట్లుగా అర్థమవుతోంది. నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకోవడం, పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం ఆయనకు అనివార్యం. ఆయన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తోనే మొదలు పెట్టారు. వరంగల్ నుండే 2009 వరకు వరసగా మూడుసార్లు గెలిచారు. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి రజక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2010-14 మధ్య బీసీ సంక్షేమ మంత్రిగా పని చేశారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. 2016 ఫిబ్రవరి 23న బీఆర్ఎస్ లో చేరారు. 2020 నవంబర్ 18న ఎమ్మెల్సీ అయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల్లో కొండా సురేఖ కాంగ్రెస్ లో చేరి, తూర్పు నుండే 2023లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారు. అయితే, 2024 జులై 5న సారయ్య తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

సారయ్యకు ఇదే వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్యక్షేత్రం కావడంతో తన ఉనికి కోసం, పూర్వ వైభవం కోసం పని చేయాల్సిన అనివార్యతలో పడ్డారు. తనపై, తన వర్గంపై పెరుగుతున్న కేసులు రాజకీయంగా తనను అణిచివేయాలనే ప్రయత్నమేనని సారయ్య భావిస్తున్నారని ఆయన చర్యలు సూచిస్తున్నాయి. అలాగే కొండా దంపతుల రాజకీయ ఆధిపత్యానికి బ్రేకులు వేయడం. స్థానికంగా పోలీసు వ్యవస్థ కొండా చెప్పినట్లే చేస్తోందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, వారిపై తన నైతిక ఆధిక్యతను చాటుకోవడం. తన వర్గానికి తానున్నాననే భరోసానివ్వడం, నియోజకవర్గంలోని పరిస్థితులను పట్టించుకోకపోతే ఆ సమస్యలు పెద్దవవుతాయనే సంకేతాలివ్వడం వంటి ప్రయోజనాల ఎత్తుగడలు సారయ్య ఫిర్యాదులో కనిపిస్తున్నాయి.

ఈ వివాదాల వల్ల రాజకీయంగా, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ బలహీనపడి, విపక్షాలకు ఆయుధంగా మారి అవి బలపడవచ్చు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు, ఆరోపణలు పెరిగితే క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అట్రాసిటీ కేసుల తప్పుడు నమోదు, దర్యాప్తు, వాటి విశ్వసనీయతపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇది పార్టీలో రెండు వర్గాల వైషమ్యాలకు దారితీస్తుంది. కాబట్టి, బస్వరాజు సారయ్య ఫిర్యాదులో నిజాలుంటే, వాటిపై నిష్పక్షపాత విచారణ జరగాలి. అదే విధంగా, రాజకీయ ఆధిపత్యం కోసం పరిపాలనా యంత్రాంగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు రుజువైతే, బాధ్యత వహించాల్సింది కూడా రాజకీయ నాయకులే. ఇదే సమయంలో సారయ్య కూడా సంయమనం పాటించాల్సింది. నియోజకవర్గం, పార్టీ, ప్రభుత్వ అంతర్గత వివాదాలను అంతర్గతంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. రచ్చకెక్కడం రాజకీయ ప్రయోజనాలకు బాగుంటుందేమోకానీ, ప్రజాప్రయోజనాలను దెబ్బ తీస్తుంది.
ఇక బస్వరాజు సారయ్య నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం వ్యక్తిగత నిరసన మాత్రమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పాలన, పోలీసుల పనితీరు వైఫల్యాలకు హెచ్చరిక.

ఇది ఎక్కడికి దారి తీస్తుందన్నది ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పార్టీ చూపే పరిపక్వతపై, ఇరువర్గాల సంయమనంపై ఆధారపడి ఉంటుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News