Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

సుదీర్ఘ పోరాట వారసత్వం… రాజకీయ జీవితం

ఐలమ్మ వారసుడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ రామచంద్రం అస్తమయం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ మనవడు, పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేసిన, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన పాలకుర్తిలోని తన ఇంట్లోనే కన్నుమూశారు. రామచంద్రం భార్య భారతి తేదీ:16-03-2022లో మరణించగా, ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలలో చిన్న కొడుకు గోపీ ఇంటర్ చదువుతున్న దశలోనే అకాల మరణం చెందారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో, చిన్న కుమార్తె ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.

చిట్యాల రామచంద్రం 1953లో పాలకుర్తిలో ఐలమ్మ ఐదుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు చిట్యాల (కట్టెల) సోమయ్యకు మూడో సంతానంగా జన్మించారు. పాలకుర్తి హై స్కూల్ లోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాయినమ్మ, తండ్రిల పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రామచంద్రం, వారితోపాటు సిపిఐ లోనే కొనసాగారు. 1975లో సిపిఐతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. యువజన విభాగంలో పని చేస్తూ, మూడేండ్ల తర్వాత సిపిఎంకు మారారు. అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జీడి సోమనర్సయ్య శిష్యరికంలో ఎదుగుతూ వచ్చిన రామచంద్రం అప్పటిదాకా సుదీర్ఘంగా పాలకుర్తి సర్పంచ్ గా పని చేసిన వీరమనేని కిషన్ రావుని ఓడించి తేదీ: 01-06-1981లో పాలకుర్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తేదీ 14-08-2001 వరకు దాదాపు 20 ఏండ్లపాటు అప్రతిహతంగా సర్పంచ్ గా కొనసాగారు. ఇప్పటి వరకు పాలకుర్తికి అత్యధిక కాలం పని చేసిన సర్పంచ్ రామచంద్రమే.

రైతు కూలీ ఉద్యమాలలో..
సిపిఐ యువజన విభాగంలో పని చేస్తూన్న సమయంలో అవిరినేని సోమేశ్వరరావుతో పాటు సమరయోధులు జీడి సోమయ్య, జీడి సోమనర్సయ్య తదితరులతో కలిసి రైతులు, రైతు కూలీల, కార్మిక ఉద్యమాలు చేశారు. పార్టీలో ఆయన అవిరినేని సోమేశ్వరరావు, గూడూరు చంద్రయ్య, బండి మదారు, గూన సోమయ్య, జీడి సత్యనారాయణ, సంకటబోయిన ఉప్పలయ్య, అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య, అనుముల జనార్దన్ రెడ్డి, జీడి సోమనాథం, జీడి మల్లయ్య వంటి అనేక మంది కలిసి పలు ఉద్యమాలు చేశారు.

1969 ఉద్యమంలో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1969లో కీలకంగా పని చేశారు. ఆ సమయంలో తన సహాధ్యాయులు ఎండి అఫ్జల్ ఖాన్, పాలకుర్తి మాజీ వార్డు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి సోమమల్లయ్య, తనతోపాటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏండ్ల పాటు పాలకుర్తి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఎ.సోమేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో…
ఆతర్వాత తెలంగాణ మలి ఉద్యమ సమయంలోనూ కీలకంగా పని చేశారు. అప్పటికే విశాలాంధ్ర నినాదంతో ఉన్న కమ్యూనిస్టు పార్టీని కాదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేశారు. అదే సమయంలో పార్టీ ఆయనను పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో బహిష్కరించింది.

తర్వాత వివిధ పార్టీలతో…
అయితే ఆతర్వాత ఆయన మారుతున్న రాజకీయాలకనుగుణంగా తన రాజకీయ ప్రయాణాన్ని మార్చుకుంటూ వెళ్ళారు. కొంత కాలం టిడిపితోనూ, మరికొంత కాలం బిఆర్ఎస్ తోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోనూ కొనసాగారు. ఆయా పార్టీల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు.

యతిరాజారావును ఎదిరించి…సహకారం తీసుకుని..
రామచంద్రం రాజకీయ జీవితం పదవిలో ఉన్నప్పటికీ పోరాటాలతోనే గడిచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉండటం, అప్పట్లో యతాజారావు ఎమ్మెల్యేగా ఉండటంతో, రాజకీయంగా ఆయన్ని ఎదిరిస్తూనే, పోరాడుతూనే, మరోవైపు గ్రామ అభివ్రుద్ధి కోసం ఆయన సహకారం తీసుకుంటూ తెలివిగా రాజకీయాలు చేశారు.

గ్రామాభివృద్ధిలో కీలకం…
రామచంద్రం తన సర్పంచ్ పదవీ కాలంలో పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేశారు. భవిష్యత్తులో ఎదిగే గ్రామం, పెరిగే జనాభాకనుగుణంగా ఎంతో ముందు చూపుతో పని చేశారు. గ్రామంలో విశాలమైన రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు, అప్పట్లోనే 100 ఫీట్ల వెడల్పైన రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత రామచంద్రంకే దక్కుతుంది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా…
గ్రామ సర్పంచ్ గా ఆయన 20 ఏండ్ల ప్రస్థానంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డులు పొందింది. సిపిఎం సర్పంచ్ గా ఉన్నప్పటికీ, అప్పటి ప్రధాన పార్టీలకు దీటుగా పని చేసిన ఆయన గ్రామానికి ఈ అవార్డులు రావడం విశేషం.

అనేకసార్లు జైలుకు…
యువ నాయకునిగా పని చేస్తూన్న సమయంలోనే రామచంద్రం, ఉప సర్పంచ్ అవిరినేని సోమేశ్వరరావు వంటి వారితో కలిసి చేసిన ఉద్యమాల్లో భాగంగా అనేక సార్లు జైలుకు పోయారు. రైతులు, కూలీల కోసం పోరాడే క్రమంలో ఆయనపై రాజకీయక కేసులు కూడా అయ్యాయి. అయితే వాటిని ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఐలమ్మ విగ్రాహాల ఏర్పాటుతో…
సాయుధ పోరాట యోధురాలు చాకలి అయిలమ్మ మనవడిగా ఆమె విగ్రహాన్ని మొదట పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటవడం, వాటిలో చాలావాటిని రామచంద్రం చేతే ఆవిష్కరించడం జరిగాయి. ఈ విధంగా రామచంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చారు. ఐలమ్మ వారసులు మరికొందరున్నప్పటికీ, ఆమె మనవడంటే రామచంద్రమే అనే స్థాయి ప్రచారాన్ని, ప్రాచర్యాన్ని పొందారు.

కీర్తి ప్రతిష్టలు
ఇదే తరుణంలో ఐలమ్మ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని, ఐలమ్మ వారసురాల్లో ఒకరికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే, వారి వారసుల మధ్య విభేదాల కారణంగా ఆ పదవి కేటాయింపు వాయిదా పడింది. అంతకుముందు అప్పటి సీఎం కెసిఆర్ సైతం రామచంద్రం కుటుంబాన్ని పిలిపించుకుని అభినందించి, సత్కరించి, తగిన గుర్తింపునిస్తామని ప్రకటించారు.

పలువురి సంతాపం
చిట్యాల రామచంద్రం మరణం పట్ల అనేక మంది తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, పార్టీ ఇన్ చార్జీ ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, ఆయన సహాధ్యాయి ఎడవెల్లి సోమమల్లయ్య, సహచరులు అవిరినేని సోమేశ్వరరావు, బండి మదారు, జీడి సత్యనారాయణ, ఎండి అబ్బాస్ అలీ, ఎండి యాకూబ్, ఎడవెల్లి దండయ్య, గాదెపాక యాకయ్య, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, సాయిసందీప్ తేజ మార్గం, డాక్టర్ జివై సోమయ్య, కడుదుల కరుణాకర్ రెడ్డి, చిట్యాల సమ్మయ్య, గుమ్మడిరాజుల సాంబయ్య, రాపర్తి కొమురయ్య, కమ్మగాని సుక్క సారయ్య, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు ఉన్నారు.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News