Monday, July 13, 2026
29.3 C
Hyderabad

మీ‘మాంసం’!?|BJP|KONDA VISHWESHWAR REDDY

మాంసాహారులకు బీజేపీలో స్థానం లేదా!?
అలా అయితే PARTY| పార్టీ ఎలా బలపడుతుంది?
పైన MODI| మోడీ, ఇక్కడ నేను గెలిస్తే ఏం లాభం?
రాజకీయ పార్టీగా బీజేపీది బలమైన స్థానం
స్వార్థానికి వాడుకునే వాళ్లతోనే బలహీనం
దేశభక్తి, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్‌లో చేరండి.
KONDA| కొండా మాటలు కమలానికి బీటలు!
సొంత పార్టీపై బీజేపీ ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు

ఆయనది సుసంపన్నమైన కుటుంబ నేపథ్యం, ఆయనది రాజీ లేని రాజకీయ వారసత్వం. ఆయనకు విద్యాధికం. ఆయనకు ఎక్కడా కనిపించని అహంకారం. ఆయనది తెలుగు సరిగా రాని నుడికారం. వీటన్నింటికీ మించి ఆయనది ముప్పిరిగొన్న ముక్కుసూటి తనం. ఆయన మనసులో ఏది ఉంటే అదే మాటగా బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆయన ముక్కుసూటిదనపు మాటే ఆయన్ని ఇరకాటంలో పెడుతుంది. అందుకే ఆయనంటే అనేక మందికి ఎంతో ఇష్టం. పాపం కొందరికి ఆయన మాటంటే ఇబ్బందికరం. అయినా ఆయన మాట్లాడటం మాత్రం ఆపరు. ఉన్నదున్నట్లుగా.. కుల్లం కుల్ల మాట్లాడటం ఆయనకు అలవాటైపోయింది. ఆయన మాటలు కూడా చాలా మందికి అలవాటైపోయాయి. ఇంతకీ ఎవరీయన అనుకుంటున్నారా? ఆయనే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మేనమామ కొండా వెంకట రంగారెడ్డి మనుమడు. ఆ రంగారెడ్డి పేరునే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. మహారాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన కొండా మాధవరెడ్డి వీరి తండ్రి. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూతురు, ఆ హాస్పిటల్స్ ఈడీ సంగీతారెడ్డి వీరి సతీమణి. న్యూ జెర్సీలో చదువుకుని, అధ్యాపకుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికైన ఎంపీలలో ధనికుడు. తెలంగాణలో ఈయనే ప్రథముడు.

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా చెప్పే అలవాటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మనసు ఎందుకు ఏ విధంగా గాయపడిందో తెలియదు కానీ, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ బీజేపీ, నేతలపై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

హైదరాబాద్‌, జూలై 7 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సాధారణంగా సౌమ్యంగా, పరిధి దాటని పద్ధతిలో మాత్రమే ఉండే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన పరిధి దాటి మాట్లాడారు. బహుషా ఆయన మనసే నొచ్చుకుందో లేక కడుపులోంచి తన్నుకొచ్చిన ఆవేదనో కానీ, సొంత పార్టీ బీజేపీపైనా, నాయకత్వంపైనా కామెంట్లు చేశారు.
వికారాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో వారినుద్దేశించి మాట్లాడుతూ, ‘మీకు నిజమైన దేశభక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్‌లో చేరండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు, బీజేపీ వంటి రాజకీయ పార్టీలో ఉండేందుకు మీరు అర్హులే కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ రాజకీయ పార్టీయే కాదు, దేశ భక్తి పేరుతో దాన్ని వ్యక్తిగత స్వార్థానికి వాడుకునే వాళ్ల చేతిలో పార్టీ బలహీనపడుతోందని’ విమర్శించారు.

అలాగే ‘మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారా? అలా అయితే పార్టీ ఎలా బలపడుతుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇది ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు ఉండాల’న్నారు. అంతేకాదు, ‘పైన మోడీ ఉన్నారు, ఇక్కడ నేనే గెలుస్తానని చెప్పుకోవడం కాదు. అధ్యక్ష పదవుల కోసం పోట్లాడే బదులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’ అని కార్యకర్తలను ఉద్దేశించి పరోక్షంగా పలువురు నేతలపై చురకలంటించారు.

ఇటీవల కాలంలో బీజేపీలో తీవ్ర అంతర్గత సంఘర్షణలు, భావజాల విభేదాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు మరోసారి పార్టీలో బిన్నాభిప్రాయాలను స్పష్టం చేస్తున్నాయి. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గతంగా, బహిరంగం గా కూడా రచ్చకు దారితీయవచ్చు. ఇప్పటికే బీజేపీలో అధ్యక్ష ఎన్నిక వివాదాస్పదంగా మారింది. భంగపడిన బీజేపీ ఎంపీ ఈటల పార్టీ వీడి బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆపార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఎంపీ కొండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో అత్యంత క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఏం జరుగుతోంది? ఇప్పటికే కొందరి శిష్ట వర్గానికి, కొన్ని సామాజిక వర్గాలకే చెందిన అంటరాని పార్టీగా ముద్రపడి ఉన్న ఆ పార్టీ, నిజంగానే మాంసాహారులను పక్కన పెడుతోందా? అన్న మీమాంసలు కొండా మాటలు విన్నాక కలగకమానవు. పార్టీ అధ్యక్ష పదవి కూడా వివాదాస్పదం అవడం ఆ పార్టీకి మంచికంటే చెడే ఎక్కువ చేసేలా ఉంది.

ఇదిలా ఉండగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న దశలోనే అన్ని మీడియా, సొషల్ మీడియా వేదికల నుంచి తొలగించారు. అయితే అప్పటికే వైరల్ అయిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపలా, బయటా దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేయనుంది?

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News