Wednesday, September 16, 2026
30.2 C
Hyderabad

విచారణల సాగదీత న్యాయమా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

విచారణల ఉద్దేశ్యం నిజాలను వెలికి తీయడం, తప్పు చేసినవారిని శిక్షించడం. కానీ నేటి రాజకీయ వ్యవస్థలో విచారణలు న్యాయ సాధనంగా కాకుండా, రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా జరుగుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారంలో ఉన్నవారికి జవాబుదారీతనం మాత్రం కనిపించడంలేదు. సవాళ్లు–ప్రతిసవాళ్లతో అసలు సమస్యలను దారి మళ్ళిస్తూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీ లో టీడీపీ–వైసీపీ మధ్య, తెలంగాణలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం ఓ ప్రహసనంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వ్యక్తిగత తప్పిదాలను రాజకీయ వ్యవస్థాగతం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. అసలు ప్రశ్నలు నేరం, రుజువు, శిక్ష, న్యాయం, బాధ్యత, పారదర్శకత ఆ రాజకీయాల్లో కొట్టుకుపోతున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఒక ఘోర నేరం. వ్యక్తిగత గోప్యతను హరించడం. రాజ్యాంగ విరుద్ధం. ఈ కేసుపై విచారణ రెండేళ్లు దాటినా, ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. విచారణల పేరుతో కాలం గడిచిపోతోంది.

బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష, స్వపక్ష నేతలు, సినీతారలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్ సంభాషణలు రికార్డు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని నిలుపుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఈ అక్రమ మార్గాలను ఉపయోగించారనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ బిడ్డే తనది, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, తాము కూడా బాధితులమేనని చెప్పుకోవడం ద్వారా ఈ వ్యవహారం ఎంత విస్తృతంగా జరిగిందో అర్థమవుతోంది. కవిత పదేపదే ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు.

కొనసాతున్న దర్యాప్తుతో నిజంగా న్యాయం జరుగుతుందా? లేక ఇది కూడా ఒక రాజకీయ నాటకమేనా? అన్న సందేహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అవసరమైన ఆధారాలు ప్రభుత్వానికి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెబుతూనే, విచారణను ఎందుకు సాగదీస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల “ఇంకెంతకాలం?” అని ప్రశ్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

విచారణ ఎంత ఎక్కువకాలం సాగితే, అంతగా రాజకీయ లబ్ది పొందవచ్చన్న లెక్క ప్రభుత్వానికి ఉందా? అన్న సందేహం సహజమే. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌లు … విచారణల పేరిట తమను వేధిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసులను ఉపయోగిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. విచారణలు ముగిసి, తుది ఫలితాలు రాకపోతే, అనుమానాలే నిజమయ్యే ప్రమాదం ఉంది.

ఇదే సమయంలో సింగరేణి భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధిస్తూ సింగరేణిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు బొగ్గు గనులను కేంద్రం వేలం ద్వారా ప్రైవేట్‌కు అప్పగించగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఓవర్‌బర్డెన్ పనులకే పరిమితమైన ప్రైవేట్ పాత్రను, ఇప్పుడు నేరుగా బొగ్గు ఉత్పత్తికే విస్తరించడం, సింగరేణి అస్తిత్వానికి ముప్పుగా మారుతోంది. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఎండీవో పేరిట టెండర్లు పిలవడం ద్వారా, గని మొత్తాన్ని 25 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మాత్రమే సింగరేణిది, అధికారమంతా ప్రైవేట్ చేతుల్లో ఉంటే, అది ప్రైవేటీకరణ కాక ఇంకేమిటి?

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే విచారణలు త్వరగా పూర్తవుతాయి. తప్పు చేసినవారికి శిక్షలు వేగంగా పడతాయి. కానీ రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు అంతులేని ప్రక్రియలుగా మారతాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త వివాదాలు తెరపైకి వస్తుంటాయి. విచారణల పేరుతో కాలయాపన చేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం అనివార్యం. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ప్రాణం. దానిని కాపాడకపోతే, అధికారంలో ఉన్నవారు కూడా కనుమరుగవడం ఖాయం.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News