Friday, May 29, 2026
33.2 C
Hyderabad

విచారణల సాగదీత న్యాయమా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

విచారణల ఉద్దేశ్యం నిజాలను వెలికి తీయడం, తప్పు చేసినవారిని శిక్షించడం. కానీ నేటి రాజకీయ వ్యవస్థలో విచారణలు న్యాయ సాధనంగా కాకుండా, రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా జరుగుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారంలో ఉన్నవారికి జవాబుదారీతనం మాత్రం కనిపించడంలేదు. సవాళ్లు–ప్రతిసవాళ్లతో అసలు సమస్యలను దారి మళ్ళిస్తూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీ లో టీడీపీ–వైసీపీ మధ్య, తెలంగాణలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం ఓ ప్రహసనంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వ్యక్తిగత తప్పిదాలను రాజకీయ వ్యవస్థాగతం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. అసలు ప్రశ్నలు నేరం, రుజువు, శిక్ష, న్యాయం, బాధ్యత, పారదర్శకత ఆ రాజకీయాల్లో కొట్టుకుపోతున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఒక ఘోర నేరం. వ్యక్తిగత గోప్యతను హరించడం. రాజ్యాంగ విరుద్ధం. ఈ కేసుపై విచారణ రెండేళ్లు దాటినా, ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. విచారణల పేరుతో కాలం గడిచిపోతోంది.

బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష, స్వపక్ష నేతలు, సినీతారలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్ సంభాషణలు రికార్డు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని నిలుపుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఈ అక్రమ మార్గాలను ఉపయోగించారనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ బిడ్డే తనది, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, తాము కూడా బాధితులమేనని చెప్పుకోవడం ద్వారా ఈ వ్యవహారం ఎంత విస్తృతంగా జరిగిందో అర్థమవుతోంది. కవిత పదేపదే ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు.

కొనసాతున్న దర్యాప్తుతో నిజంగా న్యాయం జరుగుతుందా? లేక ఇది కూడా ఒక రాజకీయ నాటకమేనా? అన్న సందేహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అవసరమైన ఆధారాలు ప్రభుత్వానికి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెబుతూనే, విచారణను ఎందుకు సాగదీస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల “ఇంకెంతకాలం?” అని ప్రశ్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

విచారణ ఎంత ఎక్కువకాలం సాగితే, అంతగా రాజకీయ లబ్ది పొందవచ్చన్న లెక్క ప్రభుత్వానికి ఉందా? అన్న సందేహం సహజమే. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌లు … విచారణల పేరిట తమను వేధిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసులను ఉపయోగిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. విచారణలు ముగిసి, తుది ఫలితాలు రాకపోతే, అనుమానాలే నిజమయ్యే ప్రమాదం ఉంది.

ఇదే సమయంలో సింగరేణి భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధిస్తూ సింగరేణిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు బొగ్గు గనులను కేంద్రం వేలం ద్వారా ప్రైవేట్‌కు అప్పగించగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఓవర్‌బర్డెన్ పనులకే పరిమితమైన ప్రైవేట్ పాత్రను, ఇప్పుడు నేరుగా బొగ్గు ఉత్పత్తికే విస్తరించడం, సింగరేణి అస్తిత్వానికి ముప్పుగా మారుతోంది. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఎండీవో పేరిట టెండర్లు పిలవడం ద్వారా, గని మొత్తాన్ని 25 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మాత్రమే సింగరేణిది, అధికారమంతా ప్రైవేట్ చేతుల్లో ఉంటే, అది ప్రైవేటీకరణ కాక ఇంకేమిటి?

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే విచారణలు త్వరగా పూర్తవుతాయి. తప్పు చేసినవారికి శిక్షలు వేగంగా పడతాయి. కానీ రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు అంతులేని ప్రక్రియలుగా మారతాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త వివాదాలు తెరపైకి వస్తుంటాయి. విచారణల పేరుతో కాలయాపన చేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం అనివార్యం. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ప్రాణం. దానిని కాపాడకపోతే, అధికారంలో ఉన్నవారు కూడా కనుమరుగవడం ఖాయం.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News