Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది సాగు, మంచినీటి వంటి జీవనాధార విధానాలలో సరైన పంథా కాదు.

పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పదేళ్ళైనా పూర్తికాకపోవడం ఆందోళనకరం. దీంతో ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతూ కాలయాపనకు గురవుతోంది. ఏడాదికేడాది నిర్మాణ ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన ప్రయోజనాలు నెరవేడంలేదు. తాజాగా 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు, కానీ, దానిక నుగుణంగా దశలవారీ కార్యాచరణ, నిధుల సమీకరణ, పారదర్శక అమలు అవసరం. పోలవరం పూర్తయితేనే సాగు, తాగునీరు, వరద నియంత్రణ, జలవిద్యుత్ వంటి అనేక ప్రయోజనాలు సాకారం అవుతాయి.

ఇదిలా ఉండగా, నల్లమల సాగర్ ప్రాజెక్టు వంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలకు తావివ్వడం సముచితం కాదు. నీటి విషయాలు భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, పరస్పర ప్రయోజనాలు, సహకారం, గౌరవంతో చర్చించాల్సినవి. నదీజలాల వినియోగంపై సంయుక్త సాంకేతిక కమిటీలు, డేటా ఆధారిత చర్చలు, పారదర్శక ఒప్పందాలు ఉండాలి. పరస్పర ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడవచ్చు కానీ, ఆయా రాష్ట్రాలకు, రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చవు.

అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, విచారణలు, దోషులు, శిక్షలు వంటివి వేగంగా తేల్చాల్సినవి ఆలస్యమవడం రాజకీయ సంకల్ప లోపం. అయితే, విమర్శలు చేయడం కంటే, సాంకేతిక లోపాలుంటే సమీక్షించి సరిదిద్దడం అవసరం. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల వాదోపవాదాల బలి పీఠం మీద నిలబెట్టడం సమంజసం కాదు.

ఇటీవల నీటి వినియోగంపై కొత్త పాలసీ, రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు వంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. నీటి సరఫరా ఖర్చులకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తున్నది. నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వాదనలో కొంత తార్కికత ఉన్నప్పటికీ, సాగునీటిపై అదనపు భారం రైతులకు పెనుభారమవుతుంది. ఇది రైతుల వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం మంచినీరు, సాగునీరు, జలవిద్యుత్, పరిశ్రమల ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. వ్యవసాయ రంగం ఇంకా అస్థిర పరిస్థితుల్లోనే ఉండగానే, పరిశ్రమలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలు పెంచుతాయి కానీ, దేశ, రాష్ట్రాల ప్రగతికి సరైన దశ, దిశను నిర్దేశించలేవు.

రైతాంగం లాభాల బాట పట్టే విధంగా, నీటి వినియోగాన్ని విరివిగా వినియోగించే వరిసాగు తగ్గించి ఉద్యాన పంటలు, తృణ ధాన్యాలు ప్రోత్సహించాలనే సూచనలు సూత్రప్రాయంగా మంచివే. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కాలానుగుణ అవసరం. అయితే భూసార అనుకూలత, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులకు నష్టదాయకం. పంటల మార్పు ఒక దీర్ఘకాలిక వ్యూహంగా, ప్రోత్సాహకాలతో, అవగాహన కార్యక్రమాలతో అమలు చేయాలి. హడావుడిగా కాదు.

రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి అనేక నదులు, వేలాది చెరువులు ఉన్నా వాటి సామర్థ్య వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాల్వల ఆధునీకరణ వంటివేవీ జరగడంలేదు. ‘నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి’ అనే ఆలోచన ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలి.

రాజకీయాలకంటే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం, పరిపాలనా దృఢత్వం అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారదర్శకంగా జల విధానం, రైతు కేంద్రంగా నిర్ణయాలు, రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక సయోధ్యలే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాలు. సమగ్ర నీటి యాజమాన్య ప్రణాళికతోనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సుసాధ్యం. లేకపోతే కొత్త ప్రతిపాదనలు, పాత వివాదాలు, పెరుగుతున్న వ్యయభారాలే మిగిలిపోతాయి. పక్కా ప్రణాళికలు, ప్రాధాన్యతా క్రమంతో ‘సాగ’డమే శ్రేయస్కరం.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News