Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది సాగు, మంచినీటి వంటి జీవనాధార విధానాలలో సరైన పంథా కాదు.

పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పదేళ్ళైనా పూర్తికాకపోవడం ఆందోళనకరం. దీంతో ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతూ కాలయాపనకు గురవుతోంది. ఏడాదికేడాది నిర్మాణ ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన ప్రయోజనాలు నెరవేడంలేదు. తాజాగా 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు, కానీ, దానిక నుగుణంగా దశలవారీ కార్యాచరణ, నిధుల సమీకరణ, పారదర్శక అమలు అవసరం. పోలవరం పూర్తయితేనే సాగు, తాగునీరు, వరద నియంత్రణ, జలవిద్యుత్ వంటి అనేక ప్రయోజనాలు సాకారం అవుతాయి.

ఇదిలా ఉండగా, నల్లమల సాగర్ ప్రాజెక్టు వంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలకు తావివ్వడం సముచితం కాదు. నీటి విషయాలు భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, పరస్పర ప్రయోజనాలు, సహకారం, గౌరవంతో చర్చించాల్సినవి. నదీజలాల వినియోగంపై సంయుక్త సాంకేతిక కమిటీలు, డేటా ఆధారిత చర్చలు, పారదర్శక ఒప్పందాలు ఉండాలి. పరస్పర ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడవచ్చు కానీ, ఆయా రాష్ట్రాలకు, రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చవు.

అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, విచారణలు, దోషులు, శిక్షలు వంటివి వేగంగా తేల్చాల్సినవి ఆలస్యమవడం రాజకీయ సంకల్ప లోపం. అయితే, విమర్శలు చేయడం కంటే, సాంకేతిక లోపాలుంటే సమీక్షించి సరిదిద్దడం అవసరం. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల వాదోపవాదాల బలి పీఠం మీద నిలబెట్టడం సమంజసం కాదు.

ఇటీవల నీటి వినియోగంపై కొత్త పాలసీ, రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు వంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. నీటి సరఫరా ఖర్చులకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తున్నది. నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వాదనలో కొంత తార్కికత ఉన్నప్పటికీ, సాగునీటిపై అదనపు భారం రైతులకు పెనుభారమవుతుంది. ఇది రైతుల వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం మంచినీరు, సాగునీరు, జలవిద్యుత్, పరిశ్రమల ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. వ్యవసాయ రంగం ఇంకా అస్థిర పరిస్థితుల్లోనే ఉండగానే, పరిశ్రమలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలు పెంచుతాయి కానీ, దేశ, రాష్ట్రాల ప్రగతికి సరైన దశ, దిశను నిర్దేశించలేవు.

రైతాంగం లాభాల బాట పట్టే విధంగా, నీటి వినియోగాన్ని విరివిగా వినియోగించే వరిసాగు తగ్గించి ఉద్యాన పంటలు, తృణ ధాన్యాలు ప్రోత్సహించాలనే సూచనలు సూత్రప్రాయంగా మంచివే. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కాలానుగుణ అవసరం. అయితే భూసార అనుకూలత, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులకు నష్టదాయకం. పంటల మార్పు ఒక దీర్ఘకాలిక వ్యూహంగా, ప్రోత్సాహకాలతో, అవగాహన కార్యక్రమాలతో అమలు చేయాలి. హడావుడిగా కాదు.

రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి అనేక నదులు, వేలాది చెరువులు ఉన్నా వాటి సామర్థ్య వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాల్వల ఆధునీకరణ వంటివేవీ జరగడంలేదు. ‘నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి’ అనే ఆలోచన ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలి.

రాజకీయాలకంటే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం, పరిపాలనా దృఢత్వం అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారదర్శకంగా జల విధానం, రైతు కేంద్రంగా నిర్ణయాలు, రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక సయోధ్యలే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాలు. సమగ్ర నీటి యాజమాన్య ప్రణాళికతోనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సుసాధ్యం. లేకపోతే కొత్త ప్రతిపాదనలు, పాత వివాదాలు, పెరుగుతున్న వ్యయభారాలే మిగిలిపోతాయి. పక్కా ప్రణాళికలు, ప్రాధాన్యతా క్రమంతో ‘సాగ’డమే శ్రేయస్కరం.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News