Sunday, March 15, 2026
35.3 C
Hyderabad

కంచె చేను మేస్తే..!

ఆ ఇద్దరినీ కలిపిన ఓ (అ)న్యాయవాది

కార్మిక స్థలాన్ని కబ్జా చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువు

ఆ రాబందు(వు)కు సహకరించిన వరంగల్ తూర్పు అప్పటి ఎమ్మెల్యే

రూ.కోట్లు చేతులు తడిపి ఆ స్థలాన్ని కొల్లగొట్టిన బడా వ్యాపారి

కార్మిక భవన నిర్మాణానికి ఆనాడే రూ. 20 లక్షల ఎంపీ నిధులు

నిర్మాణాన్ని అడ్డుకున్న కార్మిక సంఘ నాయకులు

తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న వాస్తవాలు

నిజానిజాల నిగ్గు తేలుస్తున్న “అడుగు” జాడలు

కార్మిక స్థలం, కాస్తంత భవనం కాదేది కబ్జా కనర్హం! కనిపించేదేదైనా కబ్జాదారులకు భోజ్యం! ఇదే సర్వత్రా వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రస్తుతం. 80 ఏళ్ల క్రితం నాటి అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థలం ఇందుకు అతీతమేమి కాదు. కాలేదు.

వరంగల్ అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పరిస్థితి కంచె చేను మేసినట్లుగా మారింది. కార్మిక సంక్షేమానికి పాటుపడుతూ కార్మిక భవనాన్ని కాపాడాల్సిన సంఘ నాయకులే ఆ సంఘానికి విద్రోహులుగా మారారు. కార్మిక భవన స్థల కబ్జాకు కారకులయ్యారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు… తల్లి లాంటి మిల్లు కార్మిక భవన స్థలాన్ని రాబందుల పాలు చేశారు. ఆ కార్మిక భవన స్థలంలో మొదలైన నిర్మాణానికి అడ్డు గోడగా నిలిచి, అడ్డగోలుగా కబ్జాదారుల కు అప్పగించారు. ఓ హై కోర్టు న్యాయవాది ప్రమేయం, వరంగల్ తూర్పు నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే సహకారంతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువు తప్పుడు పత్రాలు సృష్టించి కొనుగోలు చేసి, వరంగల్ కు చెందిన ఓ బడా వ్యాపారికి ఓం నమశ్శివాయ చేసేసారు.

అజం జాహి మిల్లు కార్మిక భవనం మొత్తం మిల్లు స్థలాల మధ్యలోనే ఉంది. ఆ కార్మిక భవనం కూడా ఆ స్థలంలో 1944లో నిర్మించింది. 80 ఏళ్లుగా ఎన్నో కార్మిక ఉద్యమాలకు అడ్డాగా, సాక్షి గా నిలిచింది. మిల్లు ఆఖరి ఆనవాలుగా ఆ భవనం శిథిలావస్థలో నిలిచి ఉంది. అయినా, 1,333 గజాల విస్తీర్ణంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే ఆ స్థలం ప్రైవేటుపరం కావడంలో అధికారుల చేతివాటం, రాజకీయ నాయకుల అవినీతి, కార్మిక సంఘ నాయకుల కాసుల కక్కుర్తి, న్యాయవాది వ్యూహం,
డబ్బున్న వ్యాపారి స్వార్థం కలగలిసి మిల్లు కార్మిక భవన స్థలాన్ని కబళించి అన్యాక్రాంతం చేసేసింది.

అజం జాహి మిల్లు ఎంతో చారిత్రాత్మకమైoది. అంతే చరిత్ర కలిగింది కార్మిక భవనం. కార్మికులు దేవాలయంగా భావించే కార్మిక భవనం స్థలం విషయంలో వరంగల్ మహా నగర కార్పొరేషన్ మేయర్, అధికారులు కూడా అలసత్వం వహించడమే కాదు, ఆ బడా వ్యాపారి ప్రైవేటు నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు కార్మిక భవన స్థలాన్ని అంతా కలిసి ఖతం చేసేసారు.

అందరినీ కలిపిన ఓ (అ)న్యాయవాది
పైగా హై కోర్టులో న్యాయవాదిగా పని చేసిన ఓ వ్యక్తి.. ఆ కార్మిక సంఘ ఇద్దరు నాయకులకు అనుసంధానంగా నిలిచి, మెల్లిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువును రంగంలోకి దింపాడు. అదే సమయంలో వరంగల్ తూర్పు అప్పటి ఎమ్మెల్యే ను కలిపి లేని కాగితాలను సృష్టించి కార్మిక సంఘ భవన స్థలాన్ని భవనం ఉండగానే ప్రైవేటు స్థలంగా చిత్రీకరించి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువుకి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. ఆ బంధువు ద్వారా వరంగల్లోని ఓ బడా వ్యాపారికి ఆ స్థలాన్ని అమ్మారు. ఈ లావాదేవీల్లో కోట్ల రూపాయలు చేతులు మారి, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంతా కలిసి పంచుకున్నారు.

ఎంపీ నిధులతో ముందుకు వచ్చిన బండా ప్రకాశ్


వరంగల్ అజం జాహి మిల్లుతో డాక్టర్ బండ ప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని విశ్రాంత ఉద్యోగులుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో వారికి అజంజాహి మిల్లు భూముల్లోనే స్థలాలు ఇప్పించడంలో బండ ప్రకాష్ కృషి మరువరానిది. ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 సందర్భంగా కార్మికుల వద్దకు వెళ్లి వారి వెన్నంటి ప్రకాష్ నడిచారు. అదే అనుబంధంతో ఆయన రూ.20 లక్షలు నిధులు ఇచ్చారు. ఆయన దఫా దఫాలుగా నిధులు ఇస్తానని ముందుకు వచ్చారు. ప్రొసీడింగ్ నెంబర్ 26/ఎంపీ లాడ్స్/బిపి/వరంగల్ అర్బన్/2018-19, తేది:12/02/2020 తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రోసీడింగ్ ఇచ్చారు.

కార్మిక భవన నిర్మాణాన్ని అడ్డుకున్న ఆ ఇద్దరు నేతలు
టెండర్లు పూర్తి అయి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఆ పనులు జరగకుండా అప్పటి కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డుకున్నారు. సంఘం పేరుతో ఎవరెన్ని చెప్పిన వినకుండా నిర్మాణ పనులను సాగనివ్వలేదు. కాంట్రాక్టర్ ను బెదిరించి పంపించేశారు. అజం జాహి కార్మిక సంఘం పేరుతో ఇద్దరు నాయకులు చేసిన ఖర్మ, చివరికి కార్మిక భవనం కాలగర్భంలో కలిసేలా చేసింది.

ఆనాడే ఆ నిర్మాణం మొదలై ఉంటే..
అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదమే వచ్చేది కాదు. శిథిలావస్థలో ఉన్న పాత కార్మిక భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం అయి ఉండేది. కార్మిక స్థలం రక్షింపబడేది. అన్యాక్రాంతమై ఇంతటి వివాదానికి దారి తీసేది కాదు. కొత్తగా కళకళలాడే ఆ భవనంలో కార్మిక కుటుంబాలు తమ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుంటూ సేద తీరుతూ సంతోషంగా ఉండేవారు.

తవ్విన కొద్దీ నిగ్గు తేలుతున్న నిజాలు
అజం జాహి కార్మిక భవనం అన్యాక్రాంతమైన విషయంలో తవ్వుతున్న కొద్ది నిజాలు వెలుగు చూస్తున్నాయి. కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శుల హోదాలో ఇద్దరు వ్యక్తులు పెత్తనం చెలాయించి బండ ప్రకాష్ ఇచ్చిన ఎంపీ నిధులను వినియోగించకుండా, ఆ నిధులు మురిగి పోయేలా చేశారు. అనంతరం దొంగ పత్రాలతో కార్మిక భవనాన్ని కబ్జా చేసేందుకు ముందుకు వచ్చిన భూకబ్జాదారుడికి పూర్తిగా సహకరించారు. పెద్ద మొత్తంలో డబ్బులు కజేసి కార్మికులకు అన్యాయం చేశారు. అజం జాహి మిల్లు చివరి ఆనవాలైన కార్మిక భవనాన్ని ఆ ఇద్దరు నేతలు లేకుండా చేశారు. వారిలో ఒకరు మరణించగా, బతికున్న మరో వ్యక్తి కబ్జాదారుల వైపు నిలబడడం గమనార్హం.

కోర్టు విచారణలో మిల్లు కార్మిక భవన స్థలం
మరోవైపు అజo జాహి మిల్లు కార్మిక భవన స్థల వివాదం కోర్టు పరిధిలోకి పోయింది. ఇప్పటికే విచారణ పూర్తయి ఈ నెల 25వ తేదీకి తీర్పు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

అంతా ఆ తాను ముక్కలే!
ఇక తర్వాత వచ్చిన పాలకులు కూడా గత పాలకుల పద్ధతిలోనే వ్యవహరించారు. దీంతో గత పాలకుల పాపాన్ని మోస్తూ, కొత్త సమస్యలకు కారణమయ్యారు. వాటి పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, కార్మిక కుటుంబ సభ్యులు అంతా ఏకతాటిపై వచ్చి ప్రజా ఉద్యమాలను నిర్మిస్తున్నారు. మిల్లు స్థలంలోనే కొత్త భవనం నిర్మించడం తప్ప మరో దారే కనిపించడం లేదు.

Latest News

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News