Friday, July 31, 2026
24.6 C
Hyderabad

పై ‘చేయి’!|CONGRESS|HAND

ప్రజాభిప్రాయానికి ప్రతిబింబమా?
సీఎం రేవంత్ పనితీరుకు పట్టమా?
ప్రజల్లో పుంజుకున్న కాంగ్రెస్!
గ్రామాల్లో బలంగానే బీఆర్ఎస్!!
గ్రామీణుల్లో పాగా వేస్తున్న బీజేపీ!?
పార్టీలను కాదని, స్వతంత్రులవైపు ప్రజల మొగ్గు?

హైదరాబాద్, డిసెంబర్ 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 57,57,277 మంది ఓటర్లలో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు23,15,796 మంది, పురుషులు 21,99,367 మంది, ఇతరులు 78మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా 90శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంపై గ్రామీణ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశాయి. స్వగ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి, నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో గ్రామీణులు చూపిన ఆసక్తి, ఎక్కువ శాతం పోలింగ్ రూపంలో ప్రతిఫలించింది. మరోవైపు అధికార కాంగ్రెస్, ఎన్నికేదైనా, తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ, హవాను కొనసాగిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ ఓడిన అనేక స్థానాల్లో ఆపార్టీ రెబెల్సే ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ 2383కి పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్1146కి పైగా స్థానాలతో సరిపెట్టుకుంది. 181 పంచాయతీలు గెలిచిన బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో పాగా వేసింది. 455 సర్పంచ్ లు గెలిచి, స్వతంత్రులు తమ సత్తా చాటారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్ల గెలిచాయి. ఇవన్నీ గ్రామాల్లో రాజకీయాల్లో మారుతున్న సమీకరణలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలకు పాజిటివ్ ప్రజాభిప్రాయమా?
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన భారీ ఆధిక్యం ప్రభుత్వంపై, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపైన గ్రామీణుల్లో ఉన్న నమ్మకానికి ప్రతిబింబంగా చూడొచ్చు. ముఖ్యంగా రైతులకు సాగు నీరు, గ్రామీణ రహదారులు, డీవోల్యూషన్ నిధులు, స్థానిక నేతల చురుకుదనం వంటి అంశాలు గ్రామ స్థాయిలో కాంగ్రెస్‌ పై పోజిటివ్‌ వైబ్‌ను సృష్టించినట్లు కనిపిస్తోంది.

గ్రామీణ ఓటు బ్యాంకు లక్ష్యంగా ఇందిరమ్మ చీరెల పంపిణీని వేగంగా పూర్తి చేయడం, మెరుగైన నాణ్యమైన చీరెలను అందించామని చేసిన ప్రచారం మహిళా ఓటర్లలో బాగానే వర్కౌట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రాయితీలు వంటి పథకాలు కూడా ఓటర్లను ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలు కూడా ప్రజలను ఆకర్షించాయనుకోవాలి.

సీఎం రేవంత్ పనితీరుకు పట్టమా?
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను పార్టీ బలంగా ఉపయోగిస్తోంది. అంతేగాక ప్రభుత్వాధినేతగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ కు ఈ ఫలితాలు తార్కాణంగా చూడొచ్చు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు, పరిపాలనలో పాదర్శకత, సమర్థత, ప్రభుత్వ పథకాలిస్తున్న సత్ఫలితాలు, ప్రతిపక్షాలపై సీఎం సాధిస్తున్న పై ‘చేయి’కి, పట్టుకు ఇవి నిదర్శనాలు. అయితే, సాధారణంగా స్థానిక ఎన్నికల్లో పలితాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ, ప్రభుత్వ, సీఎం పనితీరుని తక్కువగా చూడటం సరికాదు.

గ్రామాల్లో బలంగానే బీఆర్ఎస్
అదే సమయంలో బీఆర్ఎస్‌ 1125 పంచాయతీల్లో గెలిచిన తీరు ఆ పార్టీకి గ్రామాల్లో ఉన్న బలమైన కేడర్ నెట్‌వర్క్ ఇప్పటికీ ప్రభావవంతంగానే కొనసాగుతోందని తేట తెల్లం చేస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా, గ్రామ రాజకీయాల్లో వారి పట్టు పటిష్టంగానే ఉన్నదని ఈ ఎన్నికలు తెలియజేశాయి.

గ్రామాల్లో పాగా వేస్తున్న బీజేపీ
బీజేపీ 502 గ్రామాల్లో గెలిచి, చూపిన ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం. ఇప్పటి దాకా అతి కొద్ది పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ గ్రామాల్లోనూ వేళ్ళూను కుంటోందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. బీజేపీకి గ్రామీణుల్లో, మధ్య, ఎగువతరగతికే కాకుండా, దిగువ తరగతి ప్రజల్లోనూ చొచ్చుకుపోతున్నది.

పార్టీలను కాదని, స్వతంత్రులవైపు ప్రజల మొగ్గు?
అయితే స్వతంత్రులు, 502 పంచాయతీలను గెలుచుకోవడం అత్యంత ఆసక్తికర పరిణామం. గ్రామాల్లో జాతీయ, రాష్ట్ర పార్టీలు కాకుండా స్థానికంగా వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, సేవా గుణం, కుల సామాజిక సమీకరణలు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలకు బలమైన ఆయుధాలని చాటి చెబుతోంది.

ఇంకా ఈ ఫలితాలు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రజలు ఏ పార్టీపై పూర్తి స్థాయి విశ్వాసం ఉంచలేదని తేలిపోయింది. పార్టీలకతీతంగా, సమస్యలు వాటి పరిష్కారాలు, అభివృద్ధి ఆధారంగా, తమ నాయకుడిని ఎంచుకుంటున్నారని అర్థమవుతోంది.

ఇక రానున్న ఎన్నికలు త్రిముఖమే!
గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధారణంగా స్థానిక సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, కాంగ్రెస్‌కు వచ్చిన మెజార్టీ స్థానాలు, ఆ పార్టీ అధికారానికి మొదటి దశలో వచ్చిన మద్దతుగా భావించవచ్చు. బీఆర్ఎస్‌కు వచ్చిన స్థానాలు గ్రామాల్లో ఆ పార్టీకి చెక్కు చెదరని బలాన్ని తెలియజేస్తున్నాయి. బీజేపీకి వచ్చిన స్థానాలు, భవిష్యత్ రాజకీయాల్లోకి ఆ పార్టీ దూసుకు వస్తున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రుల గెలుపు గ్రామీణ రాజకీయాల స్వరూపం ఇంకా సంప్రదాయబద్ధాగానే ఉందని గుర్తు చేస్తోంది.

ఈ ఫలితాలు తెలంగాణ గ్రామీణ రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అయితే మొదటి దశ ఎన్నికలు, మిగతా రెండు దశల పంచాయతీ ఎన్నికలకు ఫలితాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపడం ఖాయం.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News