వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మీ కుటుంబం క్షేమం కోసమైన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకోని రోడ్డు రవాణా శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసి బైక్ ర్యాలీకి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయి ఈ ర్యాలీలో పాల్గోన్నారు. ఈ ర్యాలీని పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి పచ్చ జెండా పూపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సి వుంటుందని. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని. హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అధికంగా తలకు గాయాలు అయి వాహనదారుడు మరణిస్తున్నాడని. ప్రతి వాహన దారుడు క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, మీ అధారపడి జీవిస్తున్న మీ కుటుంటుంబ కోసమైన ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపడం అవసరమని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో జిల్లా రవాణాశాఖాధికారి పుప్పాల శ్రీనివాస్, అదనపు డిసిపి సురేష్కుమార్, ఎసిపిలు సత్యనారయణ,నాగయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్,చంద్రశేకర్తో పాటు రోడ్డు రవాణా శాఖ ,పోలీసుశాఖ చెందిన అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.


