Thursday, March 12, 2026
26.8 C
Hyderabad

పరిశ్రమలు సరే, మరి పర్యావరణం సంగతేంటి?|EDITORIAL

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని నిస్సిగ్గుగా బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెడితే, మీక్కావల్సిన వన్నీ ఇచ్చేస్తా మంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టండి. మీక్కావల్సినవన్నీ ఇచ్చేస్తామంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు కీలక పారిశ్రామిక విధానాలను అమలులోకి తెచ్చింది. ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఇ ఎంట్రప్రిన్యూరీ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 విధానాలకు మార్గదర్శకాలను వెలువరించింది. అదేవిధంగా, రాష్ట్రంలో 45వేల ఎకరాల పారిశ్రమల కోసం సిద్ధంగా ఉంచింది. ఈ విధానాల ద్వారా ఉద్యోగాల కల్పన, పెట్టుబడి ఆకర్షణ వంటివి వీటి లక్ష్యాలు.

తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల కొరకు రూ. 45 వేల కోట్లు పెట్టుబడి అంచనాతో ఉంది. ఇందుకవసరమైన భూ సేకరణకు కూడా చేపడుతున్నది. ఇప్పటికే తెలంగాణలోని 2,180 పరిశ్రమలలో 2,179కి ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
పరిశ్రమల చుట్టుముట్టు ప్రాంతాల్లో పీల్చే గాలి, తాగే నీరు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాంతక వ్యాధులకు అవి కేంద్రంగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అటు ప్రభుత్వమూ, ఇటు పరిశ్రమాధిపతులు పూర్తిగా వదిలేశారు. కోట్ల విలువైన రాయితీలు, సదుపాయాలు కల్పించి పరిశ్రమాధిపతులకు లాభాలు సమకూర్చడం పైనే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ఆ పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, వృత్తిదారులను విస్మరించాయి. ఇప్పటికే ఉప్పాడ కార్మికులు సముద్రంలో కలుస్తున్న కాలుష్యాన్ని నిలిపివేయాలంటూ పాలకులను నిలదీసారు. తాజాగా అనకాపల్లి సెజ్‌ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వారు అంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని సక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది.

నిజానికి ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. పైగా ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలన్న డిమాండ్‌పై ఏకమవడం నూతన పరిణామం.

ఉపాధి పేరుతో మోసగించి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలన్న ప్రభుత్వ పెద్దల ఆరాటానికి ప్రజా పోరాటాలు బ్రేకులు వేస్తున్నాయి. పోలీసు బలగాలతో ప్రజలను భయపెట్టేందుకు యత్నించినా చాలా ప్రాంతాల్లో తిరగబడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ ఒక్కటే కాదు ఎక్కడ భూ సేకరణ జరిగినా రైతులు తిరగబడుతున్నారు. పరిశ్రమలకు ఒకనాడు భూములిచ్చిన రైతులు ఇపుడు అడుక్కు తింటున్నారు. తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా పరిశ్రములు, రోడ్లు, ప్రాజెక్టులకు రైతుల భూములు లాక్కోవడం వారిని వదిలివేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. పోలవం బాధితులు, మల్లన్నసాగర్‌ బాధితులు ఇదే కోవలోకి వస్తారు.

కొద్ది రోజుల క్రితం బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ఆపాలంటూ, ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన మంత్రి వాహనం ముందు తాటిచెట్టు అడ్డంపెట్టి మరీ పోరాడారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్టు మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఆదానీకి చెందిన గంగవరం పోర్టు ధూళి, దుమ్ముతో భరించలేని కాలుష్యంతో బాధపడుతున్న ప్రజల్లో అంబూజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆగ్రహం వెల్లువెత్తింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌, గంగవరం పోర్టును పర్యావరణ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీపిసి కాలుష్యంతో మూల స్వయంవరం, సోమినాయుడుపాలెం ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పరవాడ ఫార్మా సిటీకి అనుకొనివున్న గ్రామాలు వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి విడిచిపెడుతున్నాయి. రాంకీ యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ అధికారులు నోటీసులు జారీ చేసినా? చర్యలేవిూ తీసుకోలేదు. ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరు కాలుష్యమయమైంది. అచ్యుతాపురం సెజ్‌ లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా పూడిమడక వాగులోకి వదిలేయడంతో చేపలు చనిపోయి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజలకు హానికరంగా నిబంధనలు సవరించి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉంటున్నారు.

ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినకుండా వుండాలంటే పర్యావరణ ప్రమాణాలను పరిశ్రమలు పాటించేలా నిబంధనలు కఠినతరం చేయాలి. అలాగే కాలుష్యకారక పరిశ్రమలతో పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలను దూరం పెట్టడమే మంచిది.

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News