Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

పార్టీలు కాదు, ప్రయో‘జనాలే’ ముఖ్యం!|EDITORIAL

ప్రభుత్వాలను నడపడమంటే పరస్పర ఆరోపణలు కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది.

ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.

అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడాన్ని పారిపోవడంగా అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది?

అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.

సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రభుత్వాలను నడపడమంటే ఆరోపణలు చేసుకోవడం కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది. తెలంగాణలో కృష్ణా–గోదావరి జలాల వాటాపై జరుగుతున్న రాజకీయ రచ్చే ఇందుకు ఉదాహరణ. ‘రాష్ట్రానికి అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోను, తోలు తీస్తా’నంటూ మొదలు పెట్టిందే కేసీఆర్. దీన్ని అవకాశంగా తీసుకున్న సీఎం రేవంత్, ‘కృష్ణా–గోదావరి జలాలపై ఏకంగా అసెంబ్లీలోనే చర్చిద్దాం రండి!’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సావకాశంగా సభలోనే చర్చించి, వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పోగా, ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించింది. పైగా పోటీగా పార్టీ కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నిలదీత సరే, అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడం తప్పించుకోవడంగానో? పారిపోవడంగానో అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది? ఇది సభను అవమానించడం, ప్రజలను వంచించడం కాదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తక మానవు.

తప్పులేకపోతే అసెంబ్లీ చర్చల నుంచి తప్పుకోవడం ఎందుకు? అనే ప్రశ్న సూటిగా బీఆర్ఎస్ గులాబీలకు ముల్లులా గుచ్చుతోంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 299 టీఎంసీల నీటి వాటాకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందా? లేదా? ఒప్పుకుంటే ఎందుకు? ఒప్పుకోకపోతే ఆ పార్టీకి వచ్చిన ముప్పేంటి? జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే నిర్ణయం ఎందుకు జరిగింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పూర్తైన పనులు ఎంత శాతం? ఖర్చు చేసిన నిధులెన్ని? అన్నవి ప్రధాన ప్రశ్నలు. వీటికి సమాధానమివ్వాల్సిన ప్రతిపక్షం, అసలు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ అంటూ ఆరోపణలకు దిగుతోంది. అసలు సీఎంకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస తెలివి లేదని ఒకరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని మరొకరు, తోలు తీస్తామని అధినేత చేసిన ఆరోపణలన్నీ, ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ ముందు తేలిపోతున్నాయి. పైగా ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దారు. అయితే, ప్రాజెక్టు వ్యయం, కాలపరిమితి, అనుమతులు, విద్యుత్ వ్యయం వంటి అంశాలు ఆది నుంచే విమర్శలకు గురవుతున్నాయి. ఇది వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ఆశాకిరణమైతే, ఆర్థిక భారంగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. ఈ పరస్పర నిందారోపణల నుంచే కృష్ణా–గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తెరమీదకు వచ్చింది. సమస్యను పార్టీల ప్రెస్ మీట్లు, సభా వేదికల నుంచి అసెంబ్లీ చర్చల దాకా లాగింది బీఆరెఎస్సే. బీఆర్ఎస్ ను అసెంబ్లీకి లాగింది సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చర్చ నుం చి తప్పకుంది బీఆర్ఎస్.
నీటి వివాదాలు రాష్ట్రాల ప్రయోజనాలు, సాంకేతిక అంశాలు, రాజకీయ చతురత, న్యాయపరమైన నేర్పరితనం, కేంద్రంతో సమన్వయం అనే పరిష్కారాలపై ఆధారపడతాయి. అయితే, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.

సాధికార చర్చకు అసెంబ్లీ అసలైన వేదిక. ప్రజలకు నేరుగా చేరే సిసలైన ప్రచార ప్రసార వాహకం. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధమే అయినా, దాన్ని వినియోగించే విధానం కూడా ముఖ్యమే. సభలోనే ఆధారాలతో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించడం ప్రతిపక్షం బాధ్యత. బయట పోటీ పీపీటీలు, రాజకీయ ప్రచారం, తక్షణ లాభం కావచ్చూమోగానీ, సమగ్ర చర్చకు అది దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం కాజాలదు.
ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆశలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య సంస్కృతిని కూడా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ప్రవర్తించాలి. అన్నింటికంటే ముఖ్యంగా సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News