Monday, July 13, 2026
29.3 C
Hyderabad

పార్టీలు కాదు, ప్రయో‘జనాలే’ ముఖ్యం!|EDITORIAL

ప్రభుత్వాలను నడపడమంటే పరస్పర ఆరోపణలు కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది.

ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.

అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడాన్ని పారిపోవడంగా అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది?

అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.

సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రభుత్వాలను నడపడమంటే ఆరోపణలు చేసుకోవడం కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది. తెలంగాణలో కృష్ణా–గోదావరి జలాల వాటాపై జరుగుతున్న రాజకీయ రచ్చే ఇందుకు ఉదాహరణ. ‘రాష్ట్రానికి అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోను, తోలు తీస్తా’నంటూ మొదలు పెట్టిందే కేసీఆర్. దీన్ని అవకాశంగా తీసుకున్న సీఎం రేవంత్, ‘కృష్ణా–గోదావరి జలాలపై ఏకంగా అసెంబ్లీలోనే చర్చిద్దాం రండి!’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సావకాశంగా సభలోనే చర్చించి, వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పోగా, ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించింది. పైగా పోటీగా పార్టీ కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నిలదీత సరే, అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడం తప్పించుకోవడంగానో? పారిపోవడంగానో అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది? ఇది సభను అవమానించడం, ప్రజలను వంచించడం కాదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తక మానవు.

తప్పులేకపోతే అసెంబ్లీ చర్చల నుంచి తప్పుకోవడం ఎందుకు? అనే ప్రశ్న సూటిగా బీఆర్ఎస్ గులాబీలకు ముల్లులా గుచ్చుతోంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 299 టీఎంసీల నీటి వాటాకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందా? లేదా? ఒప్పుకుంటే ఎందుకు? ఒప్పుకోకపోతే ఆ పార్టీకి వచ్చిన ముప్పేంటి? జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే నిర్ణయం ఎందుకు జరిగింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పూర్తైన పనులు ఎంత శాతం? ఖర్చు చేసిన నిధులెన్ని? అన్నవి ప్రధాన ప్రశ్నలు. వీటికి సమాధానమివ్వాల్సిన ప్రతిపక్షం, అసలు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ అంటూ ఆరోపణలకు దిగుతోంది. అసలు సీఎంకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస తెలివి లేదని ఒకరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని మరొకరు, తోలు తీస్తామని అధినేత చేసిన ఆరోపణలన్నీ, ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ ముందు తేలిపోతున్నాయి. పైగా ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దారు. అయితే, ప్రాజెక్టు వ్యయం, కాలపరిమితి, అనుమతులు, విద్యుత్ వ్యయం వంటి అంశాలు ఆది నుంచే విమర్శలకు గురవుతున్నాయి. ఇది వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ఆశాకిరణమైతే, ఆర్థిక భారంగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. ఈ పరస్పర నిందారోపణల నుంచే కృష్ణా–గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తెరమీదకు వచ్చింది. సమస్యను పార్టీల ప్రెస్ మీట్లు, సభా వేదికల నుంచి అసెంబ్లీ చర్చల దాకా లాగింది బీఆరెఎస్సే. బీఆర్ఎస్ ను అసెంబ్లీకి లాగింది సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చర్చ నుం చి తప్పకుంది బీఆర్ఎస్.
నీటి వివాదాలు రాష్ట్రాల ప్రయోజనాలు, సాంకేతిక అంశాలు, రాజకీయ చతురత, న్యాయపరమైన నేర్పరితనం, కేంద్రంతో సమన్వయం అనే పరిష్కారాలపై ఆధారపడతాయి. అయితే, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.

సాధికార చర్చకు అసెంబ్లీ అసలైన వేదిక. ప్రజలకు నేరుగా చేరే సిసలైన ప్రచార ప్రసార వాహకం. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధమే అయినా, దాన్ని వినియోగించే విధానం కూడా ముఖ్యమే. సభలోనే ఆధారాలతో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించడం ప్రతిపక్షం బాధ్యత. బయట పోటీ పీపీటీలు, రాజకీయ ప్రచారం, తక్షణ లాభం కావచ్చూమోగానీ, సమగ్ర చర్చకు అది దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం కాజాలదు.
ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆశలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య సంస్కృతిని కూడా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ప్రవర్తించాలి. అన్నింటికంటే ముఖ్యంగా సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News