Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

ప్రపంచం ముందు దోషిగా పాక్!

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో పెంచి పోషిస్తోంది. అందుకే అది ఉగ్రవాదానికే జై కొట్టింది. పహల్గామ్‌ దాడికి తెగబడింది. ప్రతిగా ప్రతీకారంగా భారత్‌ కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడికి దిగింది. వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. అయినా బుద్ధిరాని పాక్, భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. యుద్ధానికి సిద్ధపడింది. డ్రోన్‌ దాడులతో బరితెగించింది. మొత్తంగా ఇప్పుడు భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధం అనివార్యం అయింది. ఇక ఈ యుద్ధమే చివరిది కావాలి. ప్రపంచపటంలో పాక్ ఉనికి ఉంటుందా? లేదా? అన్నది తేల్చాలి.

గతానుభవాల దృష్ట్యా పాక్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తే, భారత పౌరులు లక్ష్యంగా దాడులకు దిగడమేంటి? మన రక్షణ దళాలు అత్యంత సమర్థంగా వాటిని తిప్పికొట్టడమే గాకుండా, కరాచీకి చెందిన నావల్‌ బేస్‌పై దాడులు చేసింది. అలాగే లాహోర్‌ ఎయిర్‌ బేస్‌ను ధ్వంసం చేసింది. ఒకటి రెండు దాడుల దండనతో ముగిసే వ్యవహారాన్ని పూర్తిస్థాయి యుద్దంగా మార్చేలా పాక్‌ తనకుతాను రంగంలోకి దిగింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని భారత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలకు భవిష్యత్‌లో పాక్‌ అండగా నిలవకుండా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది.

పాకిస్తాన్‌ కు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. యుద్ధమంటే ఆషామాషీ కాదని గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వని పాక్, మళ్ళీ యుద్ధంలోకి దిగింది. ప్రస్తుతం భారత్‌ దాడులకు పాక్‌ కకావికలమవుతోంది. అల్లకల్లోలంగా మారింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి పారిపోయారు. భారత్‌ మెరుపు దాడులతో పాకిస్తాన్‌ ఆర్మీ క్యాంపుల్లో భయం అలుముకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్దతు కరువైంది. అంతర్గతంగా ఆ దేశంలోని ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో దాపురించింది.

సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ పాక్‌ జరిపిన దాడులకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున దాడికి విఫలయత్నం చేసింది. అయితే, అత్యంత చాకచక్యంగా, అత్యాధునిక ఆయుధ సంపత్తితో, త్రివిద దళాల సమన్వయంతో ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ప్రతిగా లాహోర్‌ సహా పాక్‌ కు చెందిన 9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై భారత్‌ సైన్యం భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాక్‌ డ్రోన్లు, రాకెట్లతో సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం వాటిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసింది.

కాగా పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దులో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు బలోచిస్తాన్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏకంగా పాక్‌ సైన్యంపై విరుచుకుపడింది. బీఎల్‌ఏకు చెందిన ‘డెత్‌ స్క్వాడ్‌’ కలత్‌ జిల్లాలోని మంగోచెర్‌ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. బలోచ్‌ తిరుగుబాటుదార్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ తన సైన్యాన్ని భారత్‌ సరిహద్దుకు తరలిస్తున్న తరుణంలో బలూచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.

ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న దాయాది తమ దేశంలో టెర్రరిస్టులే లేరని ఇంతకాలంగా బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియా హై కమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందుకు కీలక ఆధారాలు తీసుకొచ్చారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపుల మీద భారత్‌ జరిపిన దాడుల్లో జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రౌఫ్‌ అజహర్‌ చనిపోయాడు. అతడితో పాటు ఇతర టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కారు అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోలను బయటపెట్టారు. టెర్రరిస్టుల శవపేటికపై పాక్‌ జెండాలు కప్పి ఉన్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రదాదుల వెనుక ఎవరు ఉన్నారు? వాళ్లకు ఇన్నాళ్లూ అండగా ఉంటోంది ఎవరనేది? ప్రపంచానికి తేటతెల్లమైంది. టెర్రరిస్టుల వెనుక పాకిస్తానే ఉందనే దానికి ఇంతకుమించిన ఆధారం మరోటి ఉండదు. దీంతో ప్రపంచం ముందు పాక్ అడ్డంగా బుక్కయింది. ఇక ఇప్పుడు పాక్‌ తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడంలేదు.

ప్రజలను సైతం దివాళా తీయించి, అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్‌ దిగజార్చింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్‌ చేయాలంటూ పాక్‌ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందడం పక్కన పెట్టి ఉగ్రమూకలను పెంచి పోషించడానికే బోలెడు ఖర్చు చేస్తున్నది. గత పాలకులను జైళ్ళల్లో పెడుతూ, సైన్యం, రాజకీయ నాయకులు అధికారాన్ని పంచుకుంటూ, కలిసికట్టుగా పాక్ ను దోచుకుంటున్నారు. ఎంతసేపూ భారత్‌ మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాక్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన ఆఖరి అవకాశంగా ఈ యుద్ధాన్ని మలచుకోవాలి. ఓ వైపు భారత్ తో యుద్ధం, మరోవైపు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్యుద్ధం, ప్రజల తిరుగుబాటు, చేతులెత్తేసిన సైన్యం, పారిపోయిన ప్రధాని, సైన్యాధ్యక్షుడినే అరెస్టు చేసిన సైన్యం ఏమిటీ దైన్యం? ఒక్క టెర్రరిస్టుల కోసం పాక్ టెర్రర్ అవుతున్న తీరు అత్యంత దారుణంగా, దయనీయంగా ఉంది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News