Monday, March 16, 2026
29.3 C
Hyderabad

ప్రపంచం ముందు దోషిగా పాక్!

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో పెంచి పోషిస్తోంది. అందుకే అది ఉగ్రవాదానికే జై కొట్టింది. పహల్గామ్‌ దాడికి తెగబడింది. ప్రతిగా ప్రతీకారంగా భారత్‌ కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడికి దిగింది. వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. అయినా బుద్ధిరాని పాక్, భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. యుద్ధానికి సిద్ధపడింది. డ్రోన్‌ దాడులతో బరితెగించింది. మొత్తంగా ఇప్పుడు భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధం అనివార్యం అయింది. ఇక ఈ యుద్ధమే చివరిది కావాలి. ప్రపంచపటంలో పాక్ ఉనికి ఉంటుందా? లేదా? అన్నది తేల్చాలి.

గతానుభవాల దృష్ట్యా పాక్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తే, భారత పౌరులు లక్ష్యంగా దాడులకు దిగడమేంటి? మన రక్షణ దళాలు అత్యంత సమర్థంగా వాటిని తిప్పికొట్టడమే గాకుండా, కరాచీకి చెందిన నావల్‌ బేస్‌పై దాడులు చేసింది. అలాగే లాహోర్‌ ఎయిర్‌ బేస్‌ను ధ్వంసం చేసింది. ఒకటి రెండు దాడుల దండనతో ముగిసే వ్యవహారాన్ని పూర్తిస్థాయి యుద్దంగా మార్చేలా పాక్‌ తనకుతాను రంగంలోకి దిగింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని భారత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలకు భవిష్యత్‌లో పాక్‌ అండగా నిలవకుండా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది.

పాకిస్తాన్‌ కు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. యుద్ధమంటే ఆషామాషీ కాదని గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వని పాక్, మళ్ళీ యుద్ధంలోకి దిగింది. ప్రస్తుతం భారత్‌ దాడులకు పాక్‌ కకావికలమవుతోంది. అల్లకల్లోలంగా మారింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి పారిపోయారు. భారత్‌ మెరుపు దాడులతో పాకిస్తాన్‌ ఆర్మీ క్యాంపుల్లో భయం అలుముకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్దతు కరువైంది. అంతర్గతంగా ఆ దేశంలోని ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో దాపురించింది.

సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ పాక్‌ జరిపిన దాడులకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున దాడికి విఫలయత్నం చేసింది. అయితే, అత్యంత చాకచక్యంగా, అత్యాధునిక ఆయుధ సంపత్తితో, త్రివిద దళాల సమన్వయంతో ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ప్రతిగా లాహోర్‌ సహా పాక్‌ కు చెందిన 9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై భారత్‌ సైన్యం భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాక్‌ డ్రోన్లు, రాకెట్లతో సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం వాటిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసింది.

కాగా పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దులో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు బలోచిస్తాన్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏకంగా పాక్‌ సైన్యంపై విరుచుకుపడింది. బీఎల్‌ఏకు చెందిన ‘డెత్‌ స్క్వాడ్‌’ కలత్‌ జిల్లాలోని మంగోచెర్‌ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. బలోచ్‌ తిరుగుబాటుదార్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ తన సైన్యాన్ని భారత్‌ సరిహద్దుకు తరలిస్తున్న తరుణంలో బలూచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.

ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న దాయాది తమ దేశంలో టెర్రరిస్టులే లేరని ఇంతకాలంగా బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియా హై కమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందుకు కీలక ఆధారాలు తీసుకొచ్చారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపుల మీద భారత్‌ జరిపిన దాడుల్లో జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రౌఫ్‌ అజహర్‌ చనిపోయాడు. అతడితో పాటు ఇతర టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కారు అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోలను బయటపెట్టారు. టెర్రరిస్టుల శవపేటికపై పాక్‌ జెండాలు కప్పి ఉన్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రదాదుల వెనుక ఎవరు ఉన్నారు? వాళ్లకు ఇన్నాళ్లూ అండగా ఉంటోంది ఎవరనేది? ప్రపంచానికి తేటతెల్లమైంది. టెర్రరిస్టుల వెనుక పాకిస్తానే ఉందనే దానికి ఇంతకుమించిన ఆధారం మరోటి ఉండదు. దీంతో ప్రపంచం ముందు పాక్ అడ్డంగా బుక్కయింది. ఇక ఇప్పుడు పాక్‌ తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడంలేదు.

ప్రజలను సైతం దివాళా తీయించి, అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్‌ దిగజార్చింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్‌ చేయాలంటూ పాక్‌ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందడం పక్కన పెట్టి ఉగ్రమూకలను పెంచి పోషించడానికే బోలెడు ఖర్చు చేస్తున్నది. గత పాలకులను జైళ్ళల్లో పెడుతూ, సైన్యం, రాజకీయ నాయకులు అధికారాన్ని పంచుకుంటూ, కలిసికట్టుగా పాక్ ను దోచుకుంటున్నారు. ఎంతసేపూ భారత్‌ మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాక్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన ఆఖరి అవకాశంగా ఈ యుద్ధాన్ని మలచుకోవాలి. ఓ వైపు భారత్ తో యుద్ధం, మరోవైపు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్యుద్ధం, ప్రజల తిరుగుబాటు, చేతులెత్తేసిన సైన్యం, పారిపోయిన ప్రధాని, సైన్యాధ్యక్షుడినే అరెస్టు చేసిన సైన్యం ఏమిటీ దైన్యం? ఒక్క టెర్రరిస్టుల కోసం పాక్ టెర్రర్ అవుతున్న తీరు అత్యంత దారుణంగా, దయనీయంగా ఉంది.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News