Friday, April 10, 2026
26.7 C
Hyderabad

Farmer|రైతును King|రాజుగా చేసిందే ప్రజా పాలన|People’s Government

RAITHU BHAROSA| రైతు భరోసా సభలో CM| సీఎం రేవంత్ రెడ్డి |REVANTH REDDY గర్జన

TELANGANA| తెలంగాణ రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. SECRETERIAT| సచివాలయం సాక్షిగా STATE| రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్న రోజు ఇదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు గుర్తుచేశారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే పోరాటాలు, త్యాగాలు జరిగాయని, సొంత ఊరు, భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఆ తరువాతే ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో FARMERS| రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7625 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీని ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు.

AUGUST| ఆగస్టు 15, 2024 నాటికి రైతులను రుణ విముక్తులుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని కేసీఆర్ చెప్పారని గుర్తుచేసి, ప్రజా ప్రభుత్వం వచ్చాక వరి పండించండి, మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులకు మన ప్రభుత్వంపై నమ్మకం ఉండటం వల్లే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలో మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందన్నారు.

దళారుల దోపిడీని అడ్డుకున్న GOVERNMENT| ప్రభుత్వం తమదేనని, మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ |BONUS ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గర్వంగా చెప్పారు. KCR| కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడినట్లు వదిలేశారని, మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని, రైతులకేమి చేశారని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కోకాపేటలో భూములు అమ్మి రైతు భరోసా, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి రుణమాఫీ చేయాలన్న బలహీనతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

KALESHWARAM| కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న KCR| కేసీఆర్ ప్రభుత్వం రైతుల ముసుగులో వేల కోట్లు సంపాదించిందని, MOINABAD| మొయినాబాద్, JANWADA| జన్వాడ, GAJWEL| గజ్వేల్‌లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల దగ్గర 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్లలో వాళ్ళు ధనవంతులయ్యారు.. కానీ ధనిక తెలంగాణను దివాళా రాష్ట్రంగా మార్చారన్నారు.

తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం 1 లక్షా 4 వేల కోట్లను 18 నెలల్లో రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రజా పాలన తమదేనని అన్నారు. కేసీఆర్‌తో OPEN DEBATE| ఓపెన్ డిబేట్ కు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. మీరు లక్ష కోట్లు కొల్లగొడితే, మేము రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

WOMENS| మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ పదేళ్ల పాలన, 18 నెలల పాలనను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే 4 వేల ఎకరాల సాగు జరిగేదని, కానీ కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారని, లక్ష కోట్లు దోచుకుని ఇప్పుడు బనకచర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు చంద్రబాబు అవసరమైతే అక్కడే ఉండేవాణ్ణి.. కానీ సోనియమ్మ ఆశయాలతో కాంగ్రెస్‌లో చేరాను అన్నారు.

GODAVARI| గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చకు సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి చర్చ పెట్టాలంటూ కేసీఆర్‌ను సూటిగా సవాలు చేశారు. తాము నిజాయితీతో రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, సాగునీటి న్యాయం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News