Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

Farmer|రైతును King|రాజుగా చేసిందే ప్రజా పాలన|People’s Government

RAITHU BHAROSA| రైతు భరోసా సభలో CM| సీఎం రేవంత్ రెడ్డి |REVANTH REDDY గర్జన

TELANGANA| తెలంగాణ రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. SECRETERIAT| సచివాలయం సాక్షిగా STATE| రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్న రోజు ఇదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు గుర్తుచేశారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే పోరాటాలు, త్యాగాలు జరిగాయని, సొంత ఊరు, భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఆ తరువాతే ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో FARMERS| రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7625 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీని ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు.

AUGUST| ఆగస్టు 15, 2024 నాటికి రైతులను రుణ విముక్తులుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని కేసీఆర్ చెప్పారని గుర్తుచేసి, ప్రజా ప్రభుత్వం వచ్చాక వరి పండించండి, మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులకు మన ప్రభుత్వంపై నమ్మకం ఉండటం వల్లే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలో మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందన్నారు.

దళారుల దోపిడీని అడ్డుకున్న GOVERNMENT| ప్రభుత్వం తమదేనని, మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ |BONUS ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గర్వంగా చెప్పారు. KCR| కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడినట్లు వదిలేశారని, మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని, రైతులకేమి చేశారని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కోకాపేటలో భూములు అమ్మి రైతు భరోసా, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి రుణమాఫీ చేయాలన్న బలహీనతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

KALESHWARAM| కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న KCR| కేసీఆర్ ప్రభుత్వం రైతుల ముసుగులో వేల కోట్లు సంపాదించిందని, MOINABAD| మొయినాబాద్, JANWADA| జన్వాడ, GAJWEL| గజ్వేల్‌లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల దగ్గర 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్లలో వాళ్ళు ధనవంతులయ్యారు.. కానీ ధనిక తెలంగాణను దివాళా రాష్ట్రంగా మార్చారన్నారు.

తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం 1 లక్షా 4 వేల కోట్లను 18 నెలల్లో రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రజా పాలన తమదేనని అన్నారు. కేసీఆర్‌తో OPEN DEBATE| ఓపెన్ డిబేట్ కు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. మీరు లక్ష కోట్లు కొల్లగొడితే, మేము రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

WOMENS| మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ పదేళ్ల పాలన, 18 నెలల పాలనను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే 4 వేల ఎకరాల సాగు జరిగేదని, కానీ కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారని, లక్ష కోట్లు దోచుకుని ఇప్పుడు బనకచర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు చంద్రబాబు అవసరమైతే అక్కడే ఉండేవాణ్ణి.. కానీ సోనియమ్మ ఆశయాలతో కాంగ్రెస్‌లో చేరాను అన్నారు.

GODAVARI| గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చకు సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి చర్చ పెట్టాలంటూ కేసీఆర్‌ను సూటిగా సవాలు చేశారు. తాము నిజాయితీతో రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, సాగునీటి న్యాయం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News