Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

పర్యావరణ ప్రతీకలు పులులు!|EDITORIAL

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పర్యావరణ సమతౌల్యానికి పులులు ప్రతీకలు! జీవ వైవిధ్యానికే జీవం పులులు!! అడవుల్లో పులి ఉందంటే, అక్కడ జీవవైవిధ్యం సరిగ్గా ఉందని అర్థం. అందుకే 1973కు ముందు జాతీయ జంతువుగా ఉన్న సింహాన్ని కాదని పులిని ప్రకటించారు. ఇది దయ, బలం, చురుకుదనం, శక్తికి ప్రతీక. వన్యప్రాణి సంరక్షణకు చిహ్నం. అటువంటి కీలకమైన వన్యప్రాణి నేడు అడవులను విడిచి గ్రామాలు, పట్టణాల అంచులలో సంచరిడానికి కారణం మానవులే. మనమే. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, కొండలను విధ్వంసం చేయడం, సహజ వనరులను లూటీ చేయడమే ఈ సంక్షోభానికి మూలం.
అడవులు జంతుజాలానికి ఆవాసాలు. ఆవాసాలే నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంటే, అవి ఎక్కడికెళ్ళాలి? అడవులు పచ్చగా ఉన్నంతకాలం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు అడవుల్లోనే ప్రశాంతంగా జీవించాయి. కానీ, అభివృద్ధి పేరుతో సాగుతున్న అడవుల విధ్వంసం వన్యప్రాణులను బలవంతంగా మనుషుల మధ్యకు నెట్టేస్తోంది. దీంతో పులులు గ్రామాల్లోకి రావడం, ప్రజల్లో భయాందోళనలు చెలరేగడం సహజంగా మారింది.

ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల పులుల సంచారం పెరగడం ఇదే చేదు నిజానికి నిదర్శనం. నల్లమల, తిరుమల కొండలు, అమ్రాబాద్‌, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి వంటి అటవీ ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరగడంతో అక్కడ స్థలం సరిపోక, కొత్త ఆవాసాల కోసం అవి తెలంగాణ వైపు కదులుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులను ఈదుకుంటూ పులులు ప్రయాణిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చేసుకోవచ్చు.
అడవుల విస్తీర్ణం తగ్గడం, అటవీ కారిడార్లు ఛిన్నాభిన్నం కావడం వల్ల పులులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా కదలలేకపోతున్నాయి. దీంతో అవి వ్యవసాయ పొలాలు, గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇది మనుషులకు మాత్రమే కాదు, పులులకు కూడా ప్రమాదకరం. ఒకవైపు పంట నష్టం, ఆస్తి విధ్వంసం జరుగుతుండగా, మరోవైపు వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాల్లో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వాహనం ఢీకొని ఓ పులి మృతి చెందడం మన నిర్లక్ష్యానికి నిదర్శణం.

ఇప్పటికే గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. పులులు, చిరుతలు కూడా అదే బాటలో వస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారుతుందో ఊహించుకోవడం కష్టం కాదు. సమస్యను మూలంలోనే పరిష్కరించకుండా, వన్యప్రాణులను తరిమికొట్టే చర్యలతో సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అడవులను కాపాడకపోతే, రేపు మనుషులే తమతోపాటు తమ నివాసాలను వాటి బారి నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాకర్లు, ప్రత్యేక గస్తీ బృందాలతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. కానీ వాటిని నియంత్రించలేరు. ఈ సమస్యకు అసలైన పరిష్కారం అడవుల సంరక్షణలోనే ఉంది. అటవీ కారిడార్లను పునరుద్ధరించడం, అక్రమ నరికివేతను అరికట్టడం, కొండలను సంరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రణాళికలలో పర్యావరణ ప్రభావ అంచనాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇంకా పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. పులిని శత్రువుగా కాకుండా పర్యావరణ రక్షకుడిగా చూడగల దృష్టి రావాలి. సమాచారాన్ని వెంటనే అటవీశాఖకు అందించడం, వేటగాళ్లను నిరోధించడం ప్రజల బాధ్యత. ఎందుకంటే అడవులు ఉంటేనే మనం ఉంటాం. పులులు ఉంటేనే అడవులు ఉంటాయి.

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News