Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

యాక్ థూ…పాక్!

రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ధి చెంది, పర్యాటకంగా పునరుత్తేజం పొందడాన్ని ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న పాక్‌ జీర్ణించుకోలేకపోతోంది. అందులో భాగమే పహల్గామ్ ఉగ్రదాడి. అయితే ఈ దాడిని ముందే పసిగట్టడంలో భద్రతాబలగాలు విఫలం అయ్యాయి. ఇదొక గుణపాఠంగా కాశ్మీర్‌ను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై ద్రుష్టి సారించాలి. శ్రీలంకలో ఈలం అన్నది లేకుండా చేసిన విధంగానే ఇప్పుడు కాశ్మీర్‌ని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. లెఫ్ట్‌ తీవ్రవాదం కన్నా ఇస్లామిక్‌ తీవ్రవాదం చాలా ప్రమాదకరంగా పరిణమించింది. మావోయిస్టులను ఏరివేసే పనిని పక్కన పెట్టి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే పనిని ముమ్మరం చేయాలి.

2008లో ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతం పాకిస్థానీ తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తున్నది. తహావూర్‌ హుస్సేన్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్‌ ముందుగానే తెలిపింది. అయితే, పర్యాటక స్వర్గథామంగా ఉన్నా జమ్మూకాశ్మీర్ ను అప్రమత్తంగా ఉంచడంలో కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్‌ టెర్రిరిస్ట్‌ గ్రూపులు అయిన లష్కర్‌ -ఏ -తోయిబా, జైష్‌ -ఏ – మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి లేకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రక్షించే పనికి పూనుకోవాల్సి ఉంది.

28మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. సౌదీ అరేబియా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని బుధవారం ఉదయం భారత్‌ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి కశ్మీర్‌లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్‌ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్‌ పౌరులకు జారీ చేసిన వీసాలన్నిటినీ రద్దు చేసింది. ఈ వీసాలున్న పాకిస్థాన్‌ పౌరులు 48గంటల్లోగా భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక పాకిస్థాన్ దేశ పౌరులను భారత దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన పాక్‌ పౌరులు మే 1వ తేదీ లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును సైతం తక్షణమే మూసి వేసింది. మన దేశంలోని పాక్‌ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్‌లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మే 1నుంచి మొత్తం విూద ఇరు దేశాల హైకమిషన్‌ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30కి కుదించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ తన మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్‌లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది.

పాక్‌ తన శక్తియుక్తులను కేవలం ఉగ్రదాడులకే ఉపయోగిస్తోంది. భారత్‌ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలి. పాక్‌ను ప్రపంచంతో వేరు చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక మారణహోమాలు సాగాయి. ఇలాగే వదిలేస్తే మరిన్ని దాడులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. భారత్‌పై కన్నేస్తే ఖతమే అన్నంతగా పరిస్థితులు మారాలి. టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తాజా దాడిలో ప్రత్యేకంగా హిందూ వర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం మత మౌఢ్యంతో కూడిన మూర్ఖపు చర్య. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కాశ్మీర్‌ పర్యాటక రంగం పుంజుకుంది. కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఉగ్రవాదులు చేసిన మత వైషమ్య మారణకాండ, పుంజుకుంటున్న కాశ్మీర్‌ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే కాశ్మీర్‌ పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది. కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు సమర్థనీయమైనవి. స్వాగతించాల్సిందే.

ఇవన్నీ చేస్తూనే కాశ్మీర్‌లో నిరంతర నిఘా పెంచాలి. ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకోవాలి. పాక్‌తో సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేయాలి. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిక్షణ శిబిరాలను నిర్వీర్యం చేయాలి. అవసరమైతే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. భారత్‌ బలమేంటో పాక్‌తోపాటు ప్రపంచానికి చాటాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News