Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

యాక్ థూ…పాక్!

రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ధి చెంది, పర్యాటకంగా పునరుత్తేజం పొందడాన్ని ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న పాక్‌ జీర్ణించుకోలేకపోతోంది. అందులో భాగమే పహల్గామ్ ఉగ్రదాడి. అయితే ఈ దాడిని ముందే పసిగట్టడంలో భద్రతాబలగాలు విఫలం అయ్యాయి. ఇదొక గుణపాఠంగా కాశ్మీర్‌ను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై ద్రుష్టి సారించాలి. శ్రీలంకలో ఈలం అన్నది లేకుండా చేసిన విధంగానే ఇప్పుడు కాశ్మీర్‌ని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. లెఫ్ట్‌ తీవ్రవాదం కన్నా ఇస్లామిక్‌ తీవ్రవాదం చాలా ప్రమాదకరంగా పరిణమించింది. మావోయిస్టులను ఏరివేసే పనిని పక్కన పెట్టి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే పనిని ముమ్మరం చేయాలి.

2008లో ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతం పాకిస్థానీ తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తున్నది. తహావూర్‌ హుస్సేన్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్‌ ముందుగానే తెలిపింది. అయితే, పర్యాటక స్వర్గథామంగా ఉన్నా జమ్మూకాశ్మీర్ ను అప్రమత్తంగా ఉంచడంలో కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్‌ టెర్రిరిస్ట్‌ గ్రూపులు అయిన లష్కర్‌ -ఏ -తోయిబా, జైష్‌ -ఏ – మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి లేకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రక్షించే పనికి పూనుకోవాల్సి ఉంది.

28మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. సౌదీ అరేబియా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని బుధవారం ఉదయం భారత్‌ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి కశ్మీర్‌లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్‌ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్‌ పౌరులకు జారీ చేసిన వీసాలన్నిటినీ రద్దు చేసింది. ఈ వీసాలున్న పాకిస్థాన్‌ పౌరులు 48గంటల్లోగా భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక పాకిస్థాన్ దేశ పౌరులను భారత దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన పాక్‌ పౌరులు మే 1వ తేదీ లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును సైతం తక్షణమే మూసి వేసింది. మన దేశంలోని పాక్‌ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్‌లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మే 1నుంచి మొత్తం విూద ఇరు దేశాల హైకమిషన్‌ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30కి కుదించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ తన మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్‌లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది.

పాక్‌ తన శక్తియుక్తులను కేవలం ఉగ్రదాడులకే ఉపయోగిస్తోంది. భారత్‌ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలి. పాక్‌ను ప్రపంచంతో వేరు చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక మారణహోమాలు సాగాయి. ఇలాగే వదిలేస్తే మరిన్ని దాడులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. భారత్‌పై కన్నేస్తే ఖతమే అన్నంతగా పరిస్థితులు మారాలి. టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తాజా దాడిలో ప్రత్యేకంగా హిందూ వర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం మత మౌఢ్యంతో కూడిన మూర్ఖపు చర్య. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కాశ్మీర్‌ పర్యాటక రంగం పుంజుకుంది. కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఉగ్రవాదులు చేసిన మత వైషమ్య మారణకాండ, పుంజుకుంటున్న కాశ్మీర్‌ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే కాశ్మీర్‌ పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది. కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు సమర్థనీయమైనవి. స్వాగతించాల్సిందే.

ఇవన్నీ చేస్తూనే కాశ్మీర్‌లో నిరంతర నిఘా పెంచాలి. ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకోవాలి. పాక్‌తో సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేయాలి. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిక్షణ శిబిరాలను నిర్వీర్యం చేయాలి. అవసరమైతే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. భారత్‌ బలమేంటో పాక్‌తోపాటు ప్రపంచానికి చాటాలి.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News