Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి!

దేశ విభజన వివాదం ఇంకా రావణ కాష్టంలా మండుతూనే ఉంది. పదవీ లాలస పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. సరిగా దేశ విభజన జరగక పోడం, కాశ్మీర్‌ విషయంలో నాన్చివేత ధోరణి, 370 అధికరణ, యుద్ధాల్లో ఓడిన పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం వంటి ఉదారవాద విధానాల ఫలితాలని నేటికీ అనుభవిస్తున్నాం. ఆనాడే పటిష్టమైన విధానాలు అవంబించి, ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుని, పక్కాగా విభజన ఒప్పందాలు చేసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు.

తాజాగా కాశ్మీర్‌లో జరిగిన నరమేధాన్ని కేవలం ఉగ్రదాడిగా చూడలేం. ప్రత్యక్షంగా కనిపించకపోయినా పాకిస్థాన్ ఇండియాపై జరిపిన దాడిగానే చూడాల్సి ఉంటుంది. దాడి జరిగిన విధానాన్ని బట్టి హిందువులే లక్ష్యంగా చేసిన దాడి. ముస్లిం ఉగ్రవాదుల పనే అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం దీన్ని ఖండించాలి. ఇలాంటి మూఢ మత ఛాందసాన్ని చూస్తూ ఊరుకోమని ఉగ్రవాదులకు గుణపాఠంగా చెప్పాలి. అలా చేయని వారిని నిజాయితీ లేని వారుగా గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా మన దేశంలోని ఎంఐఎం లాంటి ముస్లిం పార్టీలు బహిరంగా ఉగ్రవాదుల దుశ్చర్యలను నిలదీయాలి. నిరసించాలి. పాక్‌ తీరును ఎండగట్టాలి. ఈ ఉగ్రదాడిని ఏ మాత్రం క్షమించరాని నేరంగా చూడాలి. ఈ భూమ్మీద ఎక్కడైనా ఇలాంటి ఉగ్ర చర్యలను ఉపేక్షించరాదు. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్‌ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులపై ముష్కర మూక జరిపిన దాడిని ముప్పేట ఖండించాలి. మన సైనిక దుస్తుల్లోనే వచ్చి, ఒక్కొక్కరిని వారి మతాన్ని అడుగుతూ పిట్టల్లా కాల్చేశారు. చివరకు ఓ ముస్లిం పెద్దను కూడా పొట్టన పెట్టుకున్నారు. కొత్తగా పెళ్ళైన జంటల్లో భర్తపోతే, భార్య, భార్యపోతే, భర్తలు మాత్రమే మిగిలారు.

ఇప్పటి వరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా ఈ ఘటనను పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో 28 మందిని కాల్చిపారేశారు. మరికొందరు కొనఊపిరితో మ్రుత్యువుతో పోరాడుతున్నారు. కాందహార్‌ విమానం హైజాక్‌ చేసినప్పుడు కూడా ఇలాగే ఉగ్రవాదులు ఎందరినో పొట్టన పెట్టుకున్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్పష్టమయింది. కాల్పుల అనంతరం సవిూప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు.

ఇప్పుడు ఈ దాడి వెనక పాకిస్థాన్‌ హస్తం ఉందనడానికి వేరే రుజువులు అక్కర్లేదు. మన దేశంలో ఏ దాడి జరిగినా దాని మూలాలు అక్కడే ఉంటున్నాయి. ఇటీవల దాయాది పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ‘అది మా జీవనాడి, దానిని మర్చిపోలేమ’ని వ్యాఖ్యానించారు. ఇంకా ‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. విూరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. విూరు విూ పిల్లలకు పాక్‌ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు- కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంద’’ని చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూసినా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేదిగా ఉన్నాయి. నిజానికి భారత్‌లో వీరంతా ఎక్కడి వారు? అన్న చరిత్ర కూడా చెప్పివుంటే బాగుండేది. ఓ రకంగా భారత్‌లో ఉగ్రదాడికి ఆర్మీ చీఫ్‌ మునీర్‌ వ్యాఖ్యలు ఊపిరి పోశాయని చెప్పాలి. అలాగే కాశ్మీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కాశ్మీర్‌ సోదరులను మేం అలా వదిలేయం’ అంటూ బీరాలు పలికారు. నిజానికి కాశ్మీర్‌, పాక్, భారతదేశ చరిత్ర తెలియని మూర్ఖుడుగా అతడిని గుర్తించాలి. పాక్‌ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు చేసిన వారంలోపే ఈ దాడి జరిగింది. దీంతో పాకిస్థాన్‌ సైన్యం, పాక్‌ ప్రభుత్వంపై కూడా అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడికి పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడ నప్పటికీ, పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ముందుగానే స్పందించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్‌ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్‌ నుంచి కాశ్మీర్‌ వరకు, దక్షిణాన ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయ’ని ప్రకటించారు. ఈ వరుస సంఘటనలన్నీ పాకిస్థాన్‌ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి.

ఈ నరమేధంతో మనం మరింత అప్రమత్తం కావాలి. ఉగ్రవాదుల ఏరివేతలో మరింత కఠినంగా వ్యవహరించాలి. కాశ్వీర్ లోని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఉగ్రవాదంపై ఉదారవాదాన్ని వీడాలి. ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. మొత్తం దేశం ఒక్కటిగా నిలబడి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలి.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News