Monday, July 13, 2026
29.3 C
Hyderabad

బీహారీల ఓటు ఎటు!?|EDITORIAL

బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.

బిహార్ లో గెలిచినా, ఓడినా రాహుల్‌, ఓట్‌చోరీ ఆయుధంగా దేశ వ్యాప్త ఉద్యమానికి బలమైన వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే బిహార్ లో 9సార్లు సీఎంగా గెలిచిన నితీశ్‌ కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలుగా భావించవచ్చు. గెలిస్తే పదోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ఆ అవకాశం ఉందా? లేదా? అన్నది ఆ రాష్ట్ర ఓటర్ల తీర్పుని బట్టి ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్‌ ఓట్ల వాటా 15 శాతంగా ఉన్నది. నితీశ్‌ మళ్లీ అధికారానికి రావడానికి ఇది విశేషంగా తోడ్పడింది. 2005 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ రెండు ప్రధాన వర్గాలు నితీశ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆ వర్గాలు మహిళలు, బాగా వెనుకబడిన కులాలవారు. మహిళా ఓటర్ల శక్తిని జాతీయ రాజకీయ పార్టీలు అందిపుచ్చుకోకముందే నితీశ్‌ మహిళా ఓటర్ల ఆదరాభిమానాలను బాగా చూరగొంటున్నారు. మృదుభాషిగా పేరున్న నితీశ్‌ తన ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు, పల్లెటూరి మనిషిలా వ్యవహరించే లాలూప్రసాద్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈ కారణంగానే మహిళా ఓటర్లను నితీశ్‌ ఆకట్టుకున్నారు. అచంచలమైన కుల సంబంధిత విధేయతలతో పాటు మహిళా ఓటర్ల మద్దతు నితీశ్‌ విజయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2005లో నితీశ్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చదువుకుంటున్న బాలికలు అందరికీ ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఆనాడు లబ్ది పొందిన బాలికలు ఇప్పుడు వయోజన ఓటర్లుగా ఉన్నారు. ఆ మహిళా ఓటర్లే నితీశ్‌ నాయకత్వానికి, అధికార ప్రాభవానికి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పకతప్పదు.

ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ నితీశ్‌ను ఎన్‌డిఎ పక్షాన ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అలవాటు లేని మోదీ, ఒకప్పుడు నితీశ్‌ తనను తీవ్రంగా వ్యతిరేకించారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించడం వెనక బీహార్‌ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించాలి. బిహార్‌లో బీజేపీ ఎదుగుదలకు నితీశ్‌తో పొత్తు తప్పనిసరని మోదీ గ్రహించారు. మరోమారు బీహార్‌లో ఎన్‌డిఎ విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో బిహార్‌లో కూడా ఏక్‌నాథ్‌ షిండే లాంటి తిరుగుబాటు సంభవించే అవకాశం లేకపోలేదు. అయినా ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఎన్నికల విజయాలకు నితీశ్‌ ఆవశ్యకత అమితంగా ఉన్నది. లాలూప్రసాద్‌ యాదవ్‌తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో నితీశ్‌ జతకట్టంలో ఆయన స్వార్థం ఆయనకు ఉంది. నిరంతరాయంగా బీహార్‌ సిఎంగా నిలిచిపోవాలన్న ఆయన కాంక్షను కాదనలేం. రాజకీయ సౌలభ్యం కోసమే ఆయన మళ్లీ మోదీతో చేయి కలిపారు. అలాగని బీజేపీకి నితీశ్‌ పట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.

2013లో ప్రధానమంత్రి పదవికి అవసరమైన అర్హతలు నరేంద్ర మోదీకి లేనేలేవని తొట్టతొలుత నిరసన తెలిపిన నేత నితీశ్‌కుమార్‌. ఈ విషయాన్ని బీజేపీ మరచిపోయి ఉండదు. అయితే బిహార్‌లో ఎన్డీఏకు సమర్థంగా నేతృత్వం వహించగల నాయకుడు మరొకరు లేరన్న వాస్తవమూ బీజేపీకి బాగా తెలుసు. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా మరెవ్వరూ లేనందునే బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తోంది. వయసు మీద పడడంతో నితీశ్‌ కూడా తప్పని పరిస్థితుల్లో మోదీయే సర్వం అయిన ఢిల్లీ దర్బార్‌కు విధేయుడుగా ఉంటూ వస్తున్నారు.

అయితే మారుతున్న కాలానుగుణంగా బిహార్‌ ఓటర్లలో అత్యధికులు మౌలిక మార్పులు కోరుకుంటున్నారు. మరి ప్రశాంత్‌ కిశోర్‌ నాయకత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీకి వారు ఓటు వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. తేజస్వి యాదవ్‌ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.

బిహార్‌ ఓటర్ల సవరణ రచ్చ కూడా చర్చకు దారితీస్తోంది. ఎంఐఎం కూడా ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో బరిలోకి దిగింది. మరైతే, బిహార్‌ ఎన్నికలు ఎవరికి మొగ్గు చూపుతాయి, ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉందన్నది కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పటికే బిహార్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంలో నితీశ్‌ రికార్డు సృష్టించారు. మొత్తం తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ బిహార్‌కు ఆయన నాయకత్వం తప్పనిసరి అని పలువురు, ముఖ్యంగా బీజేపీ భావిస్తోంది. ఐదేళ్ళ క్రితం కొత్త తరం బిహారీ రాజకీయ నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్‌ స్థాయిని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది. నితీశ్‌ ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. గత శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్‌(యు) కేవలం 43 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగా బీజేపీ 74 నియోజక వర్గాలలో జయపతాక నెగురవేసింది. అయినప్పటికీ నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ సంకోచించింది. తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసేందుకు సుముఖత చూపలేదు.

నితీశ్‌ కుమార్‌ అపర చాణక్యుడు. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకున్నారు. ఆ పార్టీతో పొత్తును కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చివేసిన రీతిలో బిహార్‌లో తన పార్టీని బీజేపీ చీల్చకుండా ఉంటుందా? అని నితీశ్‌ ఆలోచించారు. అందుకే బీజేపీని తన దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఈసారి ఆయన పదోసారి సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.

తేజస్వీ యాదవ్‌ సీఎం కావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్‌ మహాఘట్‌బందన్‌ కలసివస్తుందా? లేదా? అలాగే రాహుల్‌ ఓట్‌చోరీ ఆరోపణలు ఏమేరకు ఫలితం ఇస్తాయో? ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోందో? ఫలితాలు వచ్చేదాకా ఆగాలి.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News