Saturday, April 25, 2026
38.2 C
Hyderabad

అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ప్రజా సంక్షేమం, ఆర్థిక నియంత్రణ, పాలనా బాధ్యత..ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినవి. వీటి మధ్య సమతౌల్యం అవసరం. లేకపోతే పరిపాలన, ప్రజాప్రగతి పడకేసి, దేశమే అల్లకల్లలమయ్యే ఆర్థిక ఇబ్బందుల ఆందోళన తీవ్రమవుతాయి. ప్రభుత్వాల ఖర్చు విధానం, ఉచిత పథకాల విస్తరణ, ఉద్యోగుల బకాయిల పెరుగుదల ఇవి కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో ఉద్యోగుల బకాయిలు రూ.6వేల కోట్లకు పైగా ఉన్నాయని అధికార వర్గాల అంచనా. గత దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ పాలనలో ప్రారంభమైన ఈ సమస్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీనికితోడు, పెన్షనర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది వంటి వర్గాలకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన “బటన్ నొక్కుడు” పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమూ ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ ఆదాయం-వ్యయం మధ్య బ్యాలెన్స్ ను కోల్పోయాయి.

ఈ ఆర్థిక ఒత్తిడిలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లపై చర్చ ప్రారంభమవుతోంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకు నెలకు లక్షల్లో గౌరవ వేతనం, అదనంగా భత్యాలు లభిస్తాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులకు పలుమార్లు ఎన్నికైతే, అతనికి అనేక పెన్షన్లు పొందే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో “ప్రజాప్రతినిధులకు ఇంత అధిక పారితోషికం అవసరమా?” అనే ప్రశ్న సహజంగా తలెత్తుతోంది.

అయితే, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, భత్యాలను, పెన్షన్లను పూర్తిగా రద్దు చేయాలని కాదు. కానీ, హేతుబద్ధత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. జీతాలు లేకపోతే ధనవంతులే రాజకీయాల్లో కొనసాగుతారు. లేదా అంతా అవినీతికి పాల్పడతారు. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, సరైన పారితోషికం లేకపోతే అవినీతి పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జీతాల వ్యవస్థ అవసరం. అయితే, అది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలి.

ప్రధాన సమస్య ఉచిత పథకాల వితరణలోనే ఉంది. ఎన్నికల సమయంలో ఆకర్షణీయ హామీల కోసం ప్రభుత్వాలు భారీగా ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, గృహ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరమే. కానీ అవి ఆర్థికంగా భరించగలిగిన పరిమితుల్లో ఉండాలి. లేకపోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని పూడ్చేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులపై వడ్డీలు చెల్లించడం మరింత భారమవుతుంది.

భారత సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు సూచించింది. అధిక ఉచితాలు ప్రజల్లో పని చేయాలనే ప్రేరణను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల లాభాల కోసం సంక్షేమాన్ని అతిగా వినియోగిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. ప్రభుత్వాలు తమ ఖర్చులను ప్రాధాన్యతల ఆధారంగా పునర్వ్యవస్థీకరించాలి. మొదటిగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అవసరమైన సేవలకు చెల్లింపులు సమయానికి చేయడం తప్పనిసరి. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, చివరగా సంక్షేమ పథకాలను ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా అమలు చేయాలి.

ఇక ప్రజాప్రతినిధుల గౌరవ జీతాలు, భత్యాలు, పెన్షన్లలో సంస్కరణలు అవసరం. పనితీరు ఆధారిత భత్యాలు, ఒకే పెన్షన్ విధానం, పారదర్శక ఖర్చుల వివరాలు వంటి మార్పులు చేయవచ్చు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఎన్నికల ఖర్చులను నియంత్రించడం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కూడా కీలకం.

సంక్షేమం పూర్తిగా తప్పు కాదు. కానీ, అది మోతాదు మించకూడదు. అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచకపోతే దీర్ఘకాలంలో రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఎక్స్ ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, వైద్యశాలలు, పాఠశాలలు ఇవే భవిష్యత్తును నిర్మిస్తాయి.

ప్రజాప్రతినిధుల జీతాలు సమస్యలో చిన్న భాగం మాత్రమే. అసలు సమస్య అసమతౌల్య, అహేతుక, దుబారా ఖర్చులు. ఎన్నికల రాజకీయాలు, ఆర్థిక నియంత్రణ లోపం. ప్రభుత్వాలు తక్షణ ప్రజాప్రియ నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. లేనిపక్షంలో అప్పుల భారంతో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం అనివార్యం.

Latest News

పేదోడి ఏసీ ఎట్లుందో సూడుండ్రి!?|ADUGU TRENDS

పేదోల్ల ప్రిజ్జు కూజలు, మట్టికుండల్ని సూసినం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. కొన్నింటికి మనం కొనలేనప్పుడు, గసొంటి వాటినే కాస తక్కువల తయారు చేసుకుంటం. రకరకాల ఉపాయాలు శేత్తం. ఇగ గీ...

25-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 09.55 వరకు తదుపరి దశమి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.25 వరకు తదుపరి మఖ యోగం గండ రాత్రి 02.51 వరకు తదుపరి వృద్ధి కరణం బాలవ ఉదయం...

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News