Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ప్రజా సంక్షేమం, ఆర్థిక నియంత్రణ, పాలనా బాధ్యత..ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినవి. వీటి మధ్య సమతౌల్యం అవసరం. లేకపోతే పరిపాలన, ప్రజాప్రగతి పడకేసి, దేశమే అల్లకల్లలమయ్యే ఆర్థిక ఇబ్బందుల ఆందోళన తీవ్రమవుతాయి. ప్రభుత్వాల ఖర్చు విధానం, ఉచిత పథకాల విస్తరణ, ఉద్యోగుల బకాయిల పెరుగుదల ఇవి కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో ఉద్యోగుల బకాయిలు రూ.6వేల కోట్లకు పైగా ఉన్నాయని అధికార వర్గాల అంచనా. గత దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ పాలనలో ప్రారంభమైన ఈ సమస్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీనికితోడు, పెన్షనర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది వంటి వర్గాలకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన “బటన్ నొక్కుడు” పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమూ ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ ఆదాయం-వ్యయం మధ్య బ్యాలెన్స్ ను కోల్పోయాయి.

ఈ ఆర్థిక ఒత్తిడిలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లపై చర్చ ప్రారంభమవుతోంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకు నెలకు లక్షల్లో గౌరవ వేతనం, అదనంగా భత్యాలు లభిస్తాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులకు పలుమార్లు ఎన్నికైతే, అతనికి అనేక పెన్షన్లు పొందే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో “ప్రజాప్రతినిధులకు ఇంత అధిక పారితోషికం అవసరమా?” అనే ప్రశ్న సహజంగా తలెత్తుతోంది.

అయితే, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, భత్యాలను, పెన్షన్లను పూర్తిగా రద్దు చేయాలని కాదు. కానీ, హేతుబద్ధత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. జీతాలు లేకపోతే ధనవంతులే రాజకీయాల్లో కొనసాగుతారు. లేదా అంతా అవినీతికి పాల్పడతారు. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, సరైన పారితోషికం లేకపోతే అవినీతి పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జీతాల వ్యవస్థ అవసరం. అయితే, అది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలి.

ప్రధాన సమస్య ఉచిత పథకాల వితరణలోనే ఉంది. ఎన్నికల సమయంలో ఆకర్షణీయ హామీల కోసం ప్రభుత్వాలు భారీగా ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, గృహ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరమే. కానీ అవి ఆర్థికంగా భరించగలిగిన పరిమితుల్లో ఉండాలి. లేకపోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని పూడ్చేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులపై వడ్డీలు చెల్లించడం మరింత భారమవుతుంది.

భారత సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు సూచించింది. అధిక ఉచితాలు ప్రజల్లో పని చేయాలనే ప్రేరణను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల లాభాల కోసం సంక్షేమాన్ని అతిగా వినియోగిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. ప్రభుత్వాలు తమ ఖర్చులను ప్రాధాన్యతల ఆధారంగా పునర్వ్యవస్థీకరించాలి. మొదటిగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అవసరమైన సేవలకు చెల్లింపులు సమయానికి చేయడం తప్పనిసరి. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, చివరగా సంక్షేమ పథకాలను ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా అమలు చేయాలి.

ఇక ప్రజాప్రతినిధుల గౌరవ జీతాలు, భత్యాలు, పెన్షన్లలో సంస్కరణలు అవసరం. పనితీరు ఆధారిత భత్యాలు, ఒకే పెన్షన్ విధానం, పారదర్శక ఖర్చుల వివరాలు వంటి మార్పులు చేయవచ్చు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఎన్నికల ఖర్చులను నియంత్రించడం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కూడా కీలకం.

సంక్షేమం పూర్తిగా తప్పు కాదు. కానీ, అది మోతాదు మించకూడదు. అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచకపోతే దీర్ఘకాలంలో రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఎక్స్ ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, వైద్యశాలలు, పాఠశాలలు ఇవే భవిష్యత్తును నిర్మిస్తాయి.

ప్రజాప్రతినిధుల జీతాలు సమస్యలో చిన్న భాగం మాత్రమే. అసలు సమస్య అసమతౌల్య, అహేతుక, దుబారా ఖర్చులు. ఎన్నికల రాజకీయాలు, ఆర్థిక నియంత్రణ లోపం. ప్రభుత్వాలు తక్షణ ప్రజాప్రియ నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. లేనిపక్షంలో అప్పుల భారంతో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం అనివార్యం.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News