Sunday, July 12, 2026
24.4 C
Hyderabad

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ సవరణ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రజల వద్దకు వెళ్లాల్సిన బీఎల్‌వోలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారా? ఓటరు నమోదు సవ్యంగా సాగుతోందా? ప్రవాస భారతీయుల మాటేమిటి? నకిలీ నమోదులు తొలగిపోతున్నాయా? ఎన్యూమరేషన్ గందరగోళం సంగతేంటి?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

ఓటరు జాబితా ఎంత ఖచ్చితంగా ఉంటే ఎన్నికల ప్రక్రియ అంత విశ్వసనీయంగా ఉంటుంది. అదే సమయంలో, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి అన్యాయంగా తొలగిపోకుండా చూడటం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ లక్ష్యం ప్రశంసనీయం. అయినప్పటికీ, అమలు తీరుపై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారు (బీఎల్‌వో)ల పనితీరు, సాంకేతిక ఏర్పాట్లు, విదేశాల్లో ఉన్న ప్రవాసుల ఓటు హక్కు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.

హైదరాబాద్ వంటి మహానగరంలోనే అనేక గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలవకుండా కేవలం ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తులు చేయడం ద్వారా ఈ ప్రక్రియ లక్ష్యాన్ని పూర్తిగా సాధించడం కష్టమే. చివరి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ కోసం ముందుగానే ఫారాలు ఇవ్వాలని అధికారులు కోరుతుండగా, ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఫారాల రూపకల్పన క్లిష్టంగా ఉందని, అవసరమైన పత్రాలపై కూడా స్పష్టత లేదని రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తితే వేలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, ఒకటికి మించి ఓటరు నమోదులు చేసుకున్నట్లు తేలితే జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనలను అమలు చేయడంలో కూడా పారదర్శకత, సమన్యాయం అత్యంత కీలకం. ద్వంద్వ నమోదులను గుర్తించడం సులభమే అయినా, రెండు రాష్ట్రాల్లో ఉన్న నమోదులను గుర్తించడంలో భారత ఎన్నికల సంఘం సమన్వయం మరింత బలోపేతం కావాలి.

ప్రవాస భారతీయుల ఓటు హక్కు ఆందోళన కలిగిస్తోంది. భారత విదేశాంగశాఖ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో 90 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఏపీ తెలంగాణల నుంచే 20 నుంచి 25 లక్షల మంది విదేశాల్లో ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నిర్మల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు అనేక పట్టణ నియోజకవర్గాల్లో కూడా వేలాది కుటుంబాలు విదేశీ ఉపాధిపై ఆధారపడ్డారు.

ప్రస్తుత చట్టం ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ పాస్‌పోర్టులో ఉన్న చిరునామా ఆధారంగా ప్రవాస ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. చట్టపరమైన అవగాహన లేకపోవడం, పత్రాల్లో పేర్లు, వయస్సులో వ్యత్యాసాలు, రేషన్ కార్డు వంటి సంక్షేమ పథకాలపై అపోహలు, దూర ప్రాంతాల్లో కాన్సులర్ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

సర్ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ సవరణ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రజల వద్దకు వెళ్లాల్సిన బీఎల్‌వోలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారా? ఓటరు నమోదు సవ్యంగా సాగుతోందా? ప్రవాస భారతీయుల మాటేమిటి? నకిలీ నమోదులు తొలగిపోతున్నాయా? ఎన్యూమరేషన్ గందరగోళం సంగతేంటి?

డిజిటల్ విధానాలపై పూర్తిగా ఆధారపడటం గ్రామీణులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, వలస కార్మికులకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంటింటి ధృవీకరణ, హెల్ప్ డెస్క్ లు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు, బహుభాషా సమాచార వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రవాస సంఘాలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి.

ఓటు హక్కు కేవలం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మాత్రమే కాదు. పౌరుడి భాగస్వామ్యానికి ప్రతీక. అందుకే సవరణ పేరుతో అర్హులైన ఓటర్లు అనుకోకుండానైనా సరే, జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాలి. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళిన లక్షలాది తెలుగు ప్రవాసుల హక్కులను పరిరక్షించేలా స్పష్టమైన విధానాలు, సమర్థవంతమైన అమలు, పారదర్శక వ్యవస్థను రూపొందించడం అత్యవసరం. అప్పుడు మాత్రమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తన అసలు లక్ష్యాన్ని నెరవేర్చినట్లవుతుంది. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది.

Latest News

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

కానరాని వాన జాడ..!?|RAIN|FARMER

కరువు కోరల్లో రాష్ట్రాలు కోరలు చాచిన సూపర్ ఎల్‌నినో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు అడుగంటిన భూగర్భ జలాలు ఇక మంచినీళ్ళకూ తిప్పలే కరువు కోరలు చాస్తోందా? మంచినీటికి కూడా దిక్కులేని పరిస్థితి దాపురిస్తుందా? ఎల్ నినో...

సిల్లరే కదాని సిన్నగ సూడొద్దు!?|ADUGU TRENDS

ఒక్కొక్కటి కలిత్తేనే వందైతయి. వేయైయితి. లచ్చలైతయి. గందుకే ఒక్కటే కదాని సిల్లరగ సూడొద్దు. సిల్లరే కదాని తక్కువ సేయొద్దు. సిల్లరగాడని తిడ్తం. సిల్లరని తక్కువ శేత్తే మాత్రం మనం సిల్లరైపోతం. కోట్లైనా ఒక్కటితో...

కాళేశ్వరం కథ కంచికి చేరేనా!?|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News