Monday, July 20, 2026
25.8 C
Hyderabad

అప్పుల పీడను వధించడమే కర్తవ్యం!?|EDITORIAL

వెనుకటికి అప్పు ముప్పన్నారు. ఇప్పుడు పాలకులు అదే ముద్దంటున్నారు. రాజులపైస రాళ్ళ పాలన్నట్లు.. ప్రజల డబ్బును ప్రజలకే పంచి పెడుతున్నామని, అందులో అప్పైతేమి? ముప్పైతేమి? మధ్య మనకు పవర్ కు పవర్, మిగతా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఫ్రీగా అందుతున్నాయి. ‘దాచుకునే వాడికి దోచుకున్నంత’ అన్నట్లుగా అధికారం కోసం ఏ హామీ అయినా ఇచ్చేసి, అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేసి, అందలం ఎక్కామా? హాపీగా ఉన్నామా? అన్నదే ఫైనల్ అన్నట్లుగా బతికేస్తున్నారు. ఒక్కసారి అవకాశం వస్తే వందేళ్ళకు సరిపడా తరతరాలకు సంపాదిస్తున్నారు మన పాలకులు.
నిజమే, ఏపీ, తెలంగాణలను అప్పుల నరకాసురుడు వేధిస్తున్నాడు. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మనమంతా కలసికట్టుగా ఈ అప్పుల నరకాసరుడిని అంతమొందించాలి. వీడిని మనకు అంటగడుతున్న రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల నేతలకు తగు బుద్ధి చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో లేనంత అవినీతి, అక్రమాలు, విడిపోయాక విజృంభించాయి. ప్రతి ఏటా దీపావళి వెలుగులు విరజిమ్మాల్సిన చోట, అప్పుల అమావాస్య కమ్ముకుంది. ప్రస్తుత, గత పాలకుల పని తీరు చూస్తుంటే, ఈ రెండు రాష్ట్రాలు అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. అధికారం కోసం అడ్డమైన హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక అప్పులు చేయడం అలవాటుగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి పెద్దమనిషుల హెచ్చరికలు కూడా ఎవరికీ పట్టడం లేదు. అలాగని చేసిన అప్పులతో రాష్ట్రాలు బాగుపడ్డాయా? అంటే అదీ లేదు. నెలనెలా జీతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు ప్రభుత్వ ప్రతిభకు, పనితీరుకు గీటురాయిగా మారింది. అప్పులు చేయడంలో వెనుకబడకూడదని పాలక పార్టీలూ కంకణం కట్టుకున్నట్లున్నాయి. సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచి పెట్టినంత మాత్రాన ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారా? అంటే అదీ లేదు!

ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. తాజాగా బీహార్‌ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కావచ్చు డబ్బు పందేరాలకు రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా వచ్చిన కాడికి తీసుకోవాలన్న ధోరణిలో ఉన్నారు. ఈ డబ్బు పంపిణీకి తిలోదకాలివ్వకపోతే, మన ప్రజాస్వామ్యం పటాపంచలయ్యేటట్లు కనిపిస్తున్నది. ఈ పందేరాల దుబారాకు ఫుల్‌ స్టాప్‌ పడకపోతే తిప్పలు తప్పేలా లేవు. అలాగే పథకాలు పొందని, పన్నులు చెల్లిస్తున్న వారు ప్రభుత్వాల వైఖరిని నిలదీయక మానరు.
ఏపీ, తెలంగాణల్లో గత పన్నెండేళ్లుగా ఇదే సాగుతోంది. భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఎలా అన్నది పక్కకు పోయింది. అప్పులు చేసి పండగ చేస్తున్నారు. చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ఓట్ల పండగ రావాలని కోరుకుంటున్నారు. ఎంతకాలమీ అప్పుల జాతర? అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలున్నాయి.

ఎపి విభజన తరవాత కేసీఆర్‌, జగన్‌ చేసిన నిర్వాకంతో ఇది మనింత ఎక్కువైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్‌ ఊరూరా ఊదరగొట్టారు. రెవెన్యూ మిగులులో ఉందని ప్రకటించారు. అదే సమయంలో విభజిత ఆంధప్రదేశ్‌ రూ.20 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటుతో ఏర్పడింది. 11 ఏళ్లు గడిచేసరికి రెండు రాష్ట్రాలూ దివాళా తీసాయి. అప్పు కోసం వెళితే దొంగను చూసినట్టు చూస్తున్నారని ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వాస్తవాన్ని బయటపెట్టారు. చేసిన అప్పులకు వేలకోట్లు వడ్డీలుగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టడమే కాకుండా, భవిష్యత్‌ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే ఈ దుర్భర పరిస్థితి దాపురించింది.

అయినా సరే, ఉచిత బస్సు, ఉచిత బియ్యం, ఉచితంగా వేల రూపాయల బదిలీలు వంటివన్నీ చేస్తున్నారు. రేవంత్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను కూడా ఎడా పెడా అమ్మేస్తున్నారు. రైతు రుణ మాఫీ కోసం దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన తీరువల్ల కలిగిన ప్రయోజనం కూడా అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్షేమ పథకాల జాతర ఆగడం లేదు. తెలంగాణ పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసేందుకు చంద్రబాబు అపసోపాలు పడుతున్నారు. అందుకే ఈ అవినీతి, అక్రమాల పార్టీలు, ప్రభుత్వాల పని పట్టాల్సిందే. అప్పుల నరకాసురుడిని మనమే కాల్చాలి. ప్రజలే ఇందుకు పూనుకోవాలి. పథకాల పేరుతో చేస్తున్న అప్పులపై ప్రశ్నించాలి. అప్పుడే మనకు నిజమైన దీపావళి అని గుర్తించాలి.

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం...

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News