Monday, July 13, 2026
34 C
Hyderabad

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి. 30ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్‌ గానీ, తాజా ఇసుమండ బ్లోఅవుట్‌ గానీ, నేర్పుతున్న పాఠం ఒక్కటే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్, అభివృద్ధి ఏదైనా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. దేశ ఇంధన అవసరాల కోసం ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి.

1995 జనవరి 8న పాశర్లపూడిలో సంభవించిన బ్లోఅవుట్‌ ఈ ప్రాంత చరిత్రలో చెరగని విషాద ఘట్టం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ ఘటనను అదుపు చేయడానికి 65 రోజులు పట్టింది. ఆరు వేల కుటుంబాలు శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. పంటలు నాశనమై, పర్యావరణానికి తీరని నష్టం జరిగింది. ఆ మంటల వేడి, ఆకాశాన్ని చీల్చిన శబ్దం ఇప్పటికీ కోనసీమ వాసుల జ్ఞాపకాలలో భయానకంగా నిలిచిపోయాయి.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ ఒక్కసారిగా జరిగిన ప్రమాదమేమీ కాదు. 1993లో కొమరాడ, 1997లో దేవరపల్లి, 2020లో ఉప్పూడి, ఇలా బ్లోఅవుట్‌లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2014లో మామిడికుదురు మండలం నగరంలో గెయిల్‌ పైప్‌లైన్‌ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన పైప్‌లైన్లు, నిర్వహణ లోపాలు, ప్రైవేటు సంస్థల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా మలికిపురం మండలం ఇసుమండలో ఓఎన్‌జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్‌ కోనసీమను మరోసారి కలవరపాటుకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, మూడు రోజులైనా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది కొబ్బరి చెట్లు, వరి నారుమళ్లు, పంటలు నాశనం కావడం ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. బ్లోఅవుట్‌ భయంతో మూడు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పాఠాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? 1993లో డ్రిల్లింగ్‌ చేసిన బావిని, అధిక పీడనం ఉందని అప్పట్లోనే నిలిపివేసిన ప్రాంతాన్ని, మళ్లీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి పడటం కాదు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే చమురు సంస్థలు, నిర్వాహకులు, ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలం చెల్లిన పరికరాలు తొలగించడం, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, ప్రైవేటు సంస్థలపై కఠిన నియంత్రణ పెట్టడం అత్యవసరం. బాధితులకు తక్షణమే సముచిత నష్టపరిహారం చెల్లించడం ఇంకా అవసరం.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ జరిగి మూడు దశాబ్దాలు గడిచాయి. కానీ కోనసీమ ప్రజల భయాలు ఏమాత్రం తగ్గలేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవ నిర్లక్ష్యం ఉంటే ప్రమాదాలు తప్పవు. పాశర్లపూడి నుంచి నేటిదాకా కోనసీమ నేర్పుతున్న పాఠం ఇదే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్ గ్యాస్ అయినా, అభివృద్ధి అయినా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News