Saturday, August 8, 2026
25.1 C
Hyderabad

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు. మనమే కల్పించుకోవాలి. అప్పుడప్పుడు పరిణామాల నుంచి కూడా అవకాశాలు పుడతాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అలాంటి అవకాశమే రాహుల్‌గాంధీ ముందు నిలిచింది. నీట్ పరీక్షల లీకులు, విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై పెరుగుతున్న అసంతృప్తితో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుతో ముందుకొచ్చిన యువత ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. జులై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు, జెన్‌జీ యువత తరలివచ్చారు. ఈ తరుణంలో రాహుల్‌గాంధీ విద్యార్థుల పక్షాన నిలవడం, పార్లమెంట్‌లో వారి సమస్యలను ప్రస్తావించడం రాజకీయంగా సహజమైన వ్యూహమే. అయితే, ఈ ఉద్యమాన్ని రాహుల్‌గాంధీ తన రాజకీయ బలంగా మార్చుకోగలరా? లేక ఇది మరో తాత్కాలిక రాజకీయ అవకాశంగానే మిగిలిపోతుందా?

2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఊపిరి పోశాయి. 2019లో 52 స్థానాలకే పరిమితమైన పార్టీ 2024లో 99 స్థానాలకు చేరింది. అదే సమయంలో బీజేపీ 303 నుంచి 240 స్థానాలకు తగ్గింది. ఈ ఫలితం బీజేపీ పతనానికి సంకేతం కాకపోయినా, కాంగ్రెస్‌కు తిరిగి పోరాడే అవకాశం లభించిందనడానికి మాత్రం నిదర్శనం. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల అంశాలను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేయడం కూడా అది పుంజుకోవడానికి కారణమైంది.

కానీ, వచ్చిన 99 స్థానాలు అధికారాన్ని హస్తగతం చేయలేకపోయాయి. రాహుల్‌ వ్యక్తిగత ప్రజాదరణ, పార్టీ సంస్థాగత బలం, విస్తృత సామాజిక కూటమి అంశాల్లో కాంగ్రెస్ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే యువతను ఆకర్షించడం రాహుల్‌కు భవిష్యత్తు పోరాటానికి అవసరం.

భారత యువత పరిమాణమే ఇందుకు కారణం. కేంద్ర గణాంకాల ప్రకారం 2021లో 15–29 ఏళ్ల వయసు వారు దేశ జనాభాలో 27.2%. 2036 నాటికి ఈ వాటా 22.7 శాతానికి తగ్గినా, వారి సంఖ్య 34.5 కోట్లుగా ఉంటుందని అంచనా. అంటే రాబోయే దశాబ్దంలో భారత ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద సామాజిక వర్గం యువతే.

అయితే, యువతను కేవలం నినాదాలతో ఆకట్టుకోవడం సాధ్యం కాదు. ఉద్యోగం, నాణ్యమైన విద్య, పరీక్షల విశ్వసనీయత, పారదర్శక నియామకాలు, అవినీతి నియంత్రణ, ప్రభుత్వ జవాబుదారీతనం అత్యావశ్యం. 2023–24లో 15 ఏళ్లు పైబడిన వారిలో దేశవ్యాప్తంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 56.4 శాతంగా ఉంది. మహిళలది 35.6 శాతానికి చేరినా, పురుషుల 77.5 శాతంతో పోలిస్తే అంతరం ఇంకా పెద్దదే. ఈ గణాంకాలు యువతకు అవకాశాలు సృష్టించడం ఎంత కీలకమో చెబుతున్నాయి.

ఇక్కడే సీజేపీ ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల రద్దు, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై ఏర్పడిన ఆగ్రహం ఒక పార్టీకి చెందినది కాదు. అది విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న యువత అసంతృప్తికి ప్రతీకగా మారింది. అందుకే ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పూర్తిగా తన రాజకీయ రంగులోకి లాగేందుకు ప్రయత్నిస్తే, యువత దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఒకటి. ఉద్యమాన్ని స్వాధీనం చేసుకోవడం మరొకటి. ఈ తేడాను రాహుల్‌గాంధీ గుర్తించాల్సి ఉంటుంది.

తమిళనాడు పరిణామాలు కూడా రాజకీయ పార్టీలకు ఒక పాఠం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే 34.92 శాతం ఓట్లతో 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 24.19 శాతం ఓట్లతో 59, ఏఐఏడీఎంకే 21.21 శాతంతో 47 స్థానాలకు పరిమితమయ్యాయి. అంటే కొత్త రాజకీయ శక్తికి యువతలో ఏర్పడిన ఆకర్షణను విస్మరించలేమని తమిళ ఫలితాలు సూచిస్తున్నాయి.

విజయ్ విజయాన్ని కేవలం ‘సంక్షేమానికి వ్యతిరేకంగా యువత తీర్పు’గా చూడటం కూడా తప్పే. టీవీకే తన ఎన్నికల ప్రచారంలో యువత, విద్య, మహిళలు, ఆరోగ్యం, రైతులు, పాలన వంటి అంశాలపై విస్తృత హామీలు ఇచ్చే గెలిచింది. కాబట్టి యువత సంక్షేమాన్ని తిరస్కరించడం లేదని తేలిపోయింది. సంక్షేమంతో పాటు గౌరవం, అవకాశాలు, జవాబుదారీతనం, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోరుకుంటోంది.
ఇదే కాంగ్రెస్‌కు అసలైన సవాల్. ఖద్దరు, పాత నినాదాలు, కుటుంబ వారసత్వం మాత్రమే యువతను ఆకర్షించలేవు. అదే సమయంలో జీన్స్, టీషర్ట్ ధరించడం వల్ల కూడా యువత మనసు గెలుచుకోలేరు. రాజకీయ భాష, పార్టీ అంతర్గత సంస్కృతి, అభ్యర్థుల ఎంపిక, ఉద్యోగాలపై విధానం, డిజిటల్ యుగానికి అనుగుణమైన కమ్యూనికేషన్ అన్నీ మారాలి.

మోదీ నాయకత్వంలోని బీజేపీకి కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుంది. దీర్ఘకాలం ఒకే రాజకీయ కథనంతో యువతను నిలబెట్టుకోవచ్చని ఏ పార్టీ భావించినా అది భ్రమే. యువత సోషల్‌ మీడియాను చూస్తోంది, ప్రభుత్వ పనితీరును పోల్చుకుంటోంది. మంచి చెడులను ఎంచుతోంది. ప్రశ్నిస్తోంది. విమర్శను అణచివేయడం కంటే సరైన సమాధానం చెప్పడం భవిష్యత్తు రాజకీయాల్లో కీలకం.

కాబట్టి, రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.

Latest News

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News