Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు. మనమే కల్పించుకోవాలి. అప్పుడప్పుడు పరిణామాల నుంచి కూడా అవకాశాలు పుడతాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అలాంటి అవకాశమే రాహుల్‌గాంధీ ముందు నిలిచింది. నీట్ పరీక్షల లీకులు, విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై పెరుగుతున్న అసంతృప్తితో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుతో ముందుకొచ్చిన యువత ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. జులై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు, జెన్‌జీ యువత తరలివచ్చారు. ఈ తరుణంలో రాహుల్‌గాంధీ విద్యార్థుల పక్షాన నిలవడం, పార్లమెంట్‌లో వారి సమస్యలను ప్రస్తావించడం రాజకీయంగా సహజమైన వ్యూహమే. అయితే, ఈ ఉద్యమాన్ని రాహుల్‌గాంధీ తన రాజకీయ బలంగా మార్చుకోగలరా? లేక ఇది మరో తాత్కాలిక రాజకీయ అవకాశంగానే మిగిలిపోతుందా?

2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఊపిరి పోశాయి. 2019లో 52 స్థానాలకే పరిమితమైన పార్టీ 2024లో 99 స్థానాలకు చేరింది. అదే సమయంలో బీజేపీ 303 నుంచి 240 స్థానాలకు తగ్గింది. ఈ ఫలితం బీజేపీ పతనానికి సంకేతం కాకపోయినా, కాంగ్రెస్‌కు తిరిగి పోరాడే అవకాశం లభించిందనడానికి మాత్రం నిదర్శనం. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల అంశాలను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేయడం కూడా అది పుంజుకోవడానికి కారణమైంది.

కానీ, వచ్చిన 99 స్థానాలు అధికారాన్ని హస్తగతం చేయలేకపోయాయి. రాహుల్‌ వ్యక్తిగత ప్రజాదరణ, పార్టీ సంస్థాగత బలం, విస్తృత సామాజిక కూటమి అంశాల్లో కాంగ్రెస్ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే యువతను ఆకర్షించడం రాహుల్‌కు భవిష్యత్తు పోరాటానికి అవసరం.

భారత యువత పరిమాణమే ఇందుకు కారణం. కేంద్ర గణాంకాల ప్రకారం 2021లో 15–29 ఏళ్ల వయసు వారు దేశ జనాభాలో 27.2%. 2036 నాటికి ఈ వాటా 22.7 శాతానికి తగ్గినా, వారి సంఖ్య 34.5 కోట్లుగా ఉంటుందని అంచనా. అంటే రాబోయే దశాబ్దంలో భారత ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద సామాజిక వర్గం యువతే.

అయితే, యువతను కేవలం నినాదాలతో ఆకట్టుకోవడం సాధ్యం కాదు. ఉద్యోగం, నాణ్యమైన విద్య, పరీక్షల విశ్వసనీయత, పారదర్శక నియామకాలు, అవినీతి నియంత్రణ, ప్రభుత్వ జవాబుదారీతనం అత్యావశ్యం. 2023–24లో 15 ఏళ్లు పైబడిన వారిలో దేశవ్యాప్తంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 56.4 శాతంగా ఉంది. మహిళలది 35.6 శాతానికి చేరినా, పురుషుల 77.5 శాతంతో పోలిస్తే అంతరం ఇంకా పెద్దదే. ఈ గణాంకాలు యువతకు అవకాశాలు సృష్టించడం ఎంత కీలకమో చెబుతున్నాయి.

ఇక్కడే సీజేపీ ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల రద్దు, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై ఏర్పడిన ఆగ్రహం ఒక పార్టీకి చెందినది కాదు. అది విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న యువత అసంతృప్తికి ప్రతీకగా మారింది. అందుకే ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పూర్తిగా తన రాజకీయ రంగులోకి లాగేందుకు ప్రయత్నిస్తే, యువత దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఒకటి. ఉద్యమాన్ని స్వాధీనం చేసుకోవడం మరొకటి. ఈ తేడాను రాహుల్‌గాంధీ గుర్తించాల్సి ఉంటుంది.

తమిళనాడు పరిణామాలు కూడా రాజకీయ పార్టీలకు ఒక పాఠం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే 34.92 శాతం ఓట్లతో 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 24.19 శాతం ఓట్లతో 59, ఏఐఏడీఎంకే 21.21 శాతంతో 47 స్థానాలకు పరిమితమయ్యాయి. అంటే కొత్త రాజకీయ శక్తికి యువతలో ఏర్పడిన ఆకర్షణను విస్మరించలేమని తమిళ ఫలితాలు సూచిస్తున్నాయి.

విజయ్ విజయాన్ని కేవలం ‘సంక్షేమానికి వ్యతిరేకంగా యువత తీర్పు’గా చూడటం కూడా తప్పే. టీవీకే తన ఎన్నికల ప్రచారంలో యువత, విద్య, మహిళలు, ఆరోగ్యం, రైతులు, పాలన వంటి అంశాలపై విస్తృత హామీలు ఇచ్చే గెలిచింది. కాబట్టి యువత సంక్షేమాన్ని తిరస్కరించడం లేదని తేలిపోయింది. సంక్షేమంతో పాటు గౌరవం, అవకాశాలు, జవాబుదారీతనం, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోరుకుంటోంది.
ఇదే కాంగ్రెస్‌కు అసలైన సవాల్. ఖద్దరు, పాత నినాదాలు, కుటుంబ వారసత్వం మాత్రమే యువతను ఆకర్షించలేవు. అదే సమయంలో జీన్స్, టీషర్ట్ ధరించడం వల్ల కూడా యువత మనసు గెలుచుకోలేరు. రాజకీయ భాష, పార్టీ అంతర్గత సంస్కృతి, అభ్యర్థుల ఎంపిక, ఉద్యోగాలపై విధానం, డిజిటల్ యుగానికి అనుగుణమైన కమ్యూనికేషన్ అన్నీ మారాలి.

మోదీ నాయకత్వంలోని బీజేపీకి కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుంది. దీర్ఘకాలం ఒకే రాజకీయ కథనంతో యువతను నిలబెట్టుకోవచ్చని ఏ పార్టీ భావించినా అది భ్రమే. యువత సోషల్‌ మీడియాను చూస్తోంది, ప్రభుత్వ పనితీరును పోల్చుకుంటోంది. మంచి చెడులను ఎంచుతోంది. ప్రశ్నిస్తోంది. విమర్శను అణచివేయడం కంటే సరైన సమాధానం చెప్పడం భవిష్యత్తు రాజకీయాల్లో కీలకం.

కాబట్టి, రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News