Monday, August 10, 2026
27.5 C
Hyderabad

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ప్రజల జీవనాధారమూ వ్యవసాయమే. అయితే, ఈ రంగం పూర్తిగా వర్షాధారమై ఉండటం వల్ల ప్రతి ఏడాది రైతు ఆశలు ఆకాశం వంక చూస్తూనే ఉంటాయి. ఈసారి ఆ ఆశలను ఎల్‌నినో ప్రభావం మరింత అడియాశలు చేసి, అనిశ్చితిలోకి నెట్టింది. జూన్‌లో కురవాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమవడం, జూలైలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 40 శాతం తక్కువగా నమోదైంది. జూలై మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో లోటు కొంత తగ్గినా, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది. జూలై నెలలో వర్షపాతం దీర్ఘకాల సగటులో 94 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని కూడా అంచనా వేసింది. అంటే కేవలం 6శాతమే వర్షాలన్నమాట.

వర్షాల లేమి ప్రభావం ఇప్పటికే దేశమంతా కనిపిస్తోంది. జూలై మధ్యకు వచ్చినా అనేక ప్రాంతాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక మళ్లీ విత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే పోగుంటలకు రైతులు తయారయ్యారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరిలో కొంత ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత ఆందోళన కలిగిస్తోంది. సాగునీటి కొరతతో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా వెనుకబడి ఉంది. జూలై 5 నాటికి గత ఏడాదితో పోలిస్తే 21 శాతం తక్కువ విస్తీర్ణంలోనే విత్తనాలు వేశారు. దీనికి ప్రధాన కారణం వర్షాల వెనుకబాటే. వాతావరణ నిపుణులు తక్కువ నీటితో సాగయ్యే మక్కజొన్న, సజ్జలు, పెసర, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.

అయితే, రైతు సమస్యలు వర్షాల కొరతతోనే ముగియవు. వ్యవసాయం నేడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ట్రాక్టర్ల అద్దెలు, కూలీల వేతనాలు… ప్రతి అంశంలో వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ పెట్టుబడికి తగిన దిగుబడి రావడం లేదు. వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు వ్యవస్థలో ఉన్న లోపాలు రైతును మార్కెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తున్నాయి.

నకిలీ విత్తనాలు రైతాంగాన్ని మరోవైపు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అధిక దిగుబడుల పేరుతో విక్రయించే నాసిరకం విత్తనాల వల్ల మొలక శాతం తగ్గి, పంటలు దెబ్బతింటున్నాయి. సీజన్ సమయంలో ఎరువుల కొరత రైతులకు మరో శాపంగా మారుతోంది. అవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశమే లేకుండా పోతోంది.

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్ల వానలు… వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

ఈ సంక్షోభానికి మరో విషాదకర కోణం రైతుల అప్పులు. బ్యాంకు రుణాలు సకాలంలో అందని చిన్న, సన్నకారు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలు, పంట నష్టాలు, గిట్టుబాటు ధరల లేమి కలిసి వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఆర్థిక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పటికీ ఆగకపోవడం దేశానికి సిగ్గుచేటు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి సహాయాలు, పరిహారాలు ప్రకటించడం సరిపోదు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, మైక్రో ఇరిగేషన్ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. నకిలీ విత్తనాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఆలస్యం కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలి. కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా మార్చే అంశాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. వ్యవసాయం నిలబడితేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దేశ అభివృద్ధి నిలకడగా ఉంటాయి. ఎల్‌నినో ఒక సహజ వాతావరణ ప్రక్రియ కావచ్చు. కానీ దాని ప్రభావాన్ని విపత్తుగా మారనివ్వకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం పాలకుల బాధ్యత. ఈ వర్షాకాలం మరోసారి గుర్తు చేస్తున్న సందేశం ఒక్కటే. వ్యవసాయాన్ని కాపాడటం అంటే రైతును మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును కాపాడటమని గుర్తుంచుకోవాలి.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News