Monday, August 3, 2026
31.5 C
Hyderabad

రాజకీయ అవినీతికి అంతం లేదా!?|EDITORIAL

దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు. ఇది ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, నిస్సహాయతను పెంచుతోంది.

భారత రాజ్యాంగం చట్టం ముందు అంతా సామానమేనని చెబుతోంది. రాజకీయ అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఎన్నికల చట్టాలన్నీ సాధారణ పౌరులతోపాటు రాజకీయ నాయకులకూ వర్తిస్తాయి. జైలు శిక్షలు, ఆస్తుల స్వాధీనం, పదవుల రద్దు వంటి కఠిన నిబంధనలు చట్టాల్లో స్పష్టంగా ఉన్నాయి. చట్టాల్లో లొసుగులు, న్యాయపరమైన చిక్కులు, అమలులో లోపాలు వెరసి, రాజకీయ సంకల్పం లేకపోవడమే అసలు సమస్యగా మిగిలిపోతున్నది.
రాజకీయ అవినీతి కేసులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య పరస్పరం ఉండే అంతర్గత అవగాహన. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై కేసులు పెట్టినా, అధికార మార్పు తర్వాత అవే కేసులు నత్తనడకన సాగుతాయి లేదా నీరుగారిపోతాయి. నిర్వీర్యమవుతాయి. ‘ఈ రోజు నువ్వు – రేపు నేను’ అనే ధోరణి రాజకీయ వ్యవస్థను పీడిస్తోంది. విచారణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన చోట, అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాయనే విమర్శలు కొత్తవేమీ కావు.

అధికారంలో ఉన్నప్పుడే జీఓలు, ఫైళ్లు, కాంట్రాక్టులు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నీ మాయమవుతాయి. బినామీ లావాదేవీలు, షెల్ కంపెనీలు, విదేశీ ఖాతాల ద్వారా అక్రమ సంపదను దాచడం, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టడం వంటివి రాజకీయ అవినీతి రుజువును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. కోర్టులలో కేసులు సాగడానికి దశాబ్దాలు పడుతుండటం వల్ల రాజకీయ వ్యవస్థపైనే గాక, న్యాయవ్యవస్థపై కూడా ప్రజలు విశ్వాసాన్ని కొల్పోతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత అభివృద్ధి, పారదర్శక పాలన అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ పదేళ్ల పాలన అనంతరం రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, కాంట్రాక్టులు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేస్ ల చుట్టూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా వాటిపై సమగ్ర విచారణలు, స్పష్టమైన శిక్షలు నేటికీ ఖరారు కాలేదు. విధాన సభలు, రాజకీయ వేదికలపై వినిపిస్తున్న ఆరోపణలు, సరైన సాక్ష్యాలు లేకపోతే చట్టపరంగా న్యాయ పరీక్షకు నిలవవు. ఆరోపణలు ఆయా పార్టీల రాజకీయ లాభనష్టాలకే పరిమితమవుతాయి. తాజాగా బీఆర్ఎస్ పై కవిత ఆరోపణలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
అసలు అవినీతిని బయటపెట్టే బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల అవినీతిని ప్రశ్నించకపోతే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మౌనం పాటిస్తే, అవినీతి రుజువెలా అవుతుంది? ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లుతుంది? రాజకీయ నాయకులు నిజంగా అవినీతిపై పోరాటం చేయాలంటే ఆరోపణలకే పరిమితం కాకుండా, తమ వద్ద ఉన్న ఆధారాలను విచారణ సంస్థలకు, కోర్టులకు సమర్పించాలి. అది జరగకపోవడం వల్లే, అవన్నీ రాజకీయ అరాచక నాటకాలుగానే మిగులుతున్నాయి.
ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు క్రీయాశీలతను కోల్పోతే, ప్రజలకు మిగిలిన ఏకైక ప్రభావవంతమైన ఆయుధం ఓటు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజలు అవినీతి పాలనలను ఓటుతో శిక్షించారు. కానీ అది సరిపోవడంలేదు. రాజకీయ అవినీతిపై నిరంతర నిఘా, ప్రజా ఒత్తిడి అవసరం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం, మీడియా ద్వారా చర్చను నిలబెట్టడం, కోర్టులను ఆశ్రయించడం, శాంతియుత ప్రజా ఉద్యమాలు వంటివన్నీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మార్గాలు. ముఖ్యంగా రాజకీయ పార్టీలను, నాయకులను గుడ్డిగా, భక్తిగా ఆరాధించడంకాక, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రశ్నించే సంస్కృతి సమాజంలో రావాలి.

రాజకీయ అవినీతికి అంతానికి శిక్షలున్నాయి. కానీ అవి అమలు కావడం లేదు అన్నదే చేదు నిజం. చట్టాలు కాగితాలకే పరిమితమై, రాజకీయ సంకల్పం లేనప్పుడు ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. ఈ పరిస్థితి మారాలంటే వ్యక్తుల మార్పు కంటే వ్యవస్థాగత మార్పు అవసరం. ప్రజలు మౌనంగా వీడి, ప్రశ్నిస్తేనే, రాజకీయ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News