Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

రాజకీయ అవినీతికి అంతం లేదా!?|EDITORIAL

దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు. ఇది ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, నిస్సహాయతను పెంచుతోంది.

భారత రాజ్యాంగం చట్టం ముందు అంతా సామానమేనని చెబుతోంది. రాజకీయ అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఎన్నికల చట్టాలన్నీ సాధారణ పౌరులతోపాటు రాజకీయ నాయకులకూ వర్తిస్తాయి. జైలు శిక్షలు, ఆస్తుల స్వాధీనం, పదవుల రద్దు వంటి కఠిన నిబంధనలు చట్టాల్లో స్పష్టంగా ఉన్నాయి. చట్టాల్లో లొసుగులు, న్యాయపరమైన చిక్కులు, అమలులో లోపాలు వెరసి, రాజకీయ సంకల్పం లేకపోవడమే అసలు సమస్యగా మిగిలిపోతున్నది.
రాజకీయ అవినీతి కేసులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య పరస్పరం ఉండే అంతర్గత అవగాహన. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై కేసులు పెట్టినా, అధికార మార్పు తర్వాత అవే కేసులు నత్తనడకన సాగుతాయి లేదా నీరుగారిపోతాయి. నిర్వీర్యమవుతాయి. ‘ఈ రోజు నువ్వు – రేపు నేను’ అనే ధోరణి రాజకీయ వ్యవస్థను పీడిస్తోంది. విచారణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన చోట, అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాయనే విమర్శలు కొత్తవేమీ కావు.

అధికారంలో ఉన్నప్పుడే జీఓలు, ఫైళ్లు, కాంట్రాక్టులు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నీ మాయమవుతాయి. బినామీ లావాదేవీలు, షెల్ కంపెనీలు, విదేశీ ఖాతాల ద్వారా అక్రమ సంపదను దాచడం, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టడం వంటివి రాజకీయ అవినీతి రుజువును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. కోర్టులలో కేసులు సాగడానికి దశాబ్దాలు పడుతుండటం వల్ల రాజకీయ వ్యవస్థపైనే గాక, న్యాయవ్యవస్థపై కూడా ప్రజలు విశ్వాసాన్ని కొల్పోతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత అభివృద్ధి, పారదర్శక పాలన అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ పదేళ్ల పాలన అనంతరం రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, కాంట్రాక్టులు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేస్ ల చుట్టూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా వాటిపై సమగ్ర విచారణలు, స్పష్టమైన శిక్షలు నేటికీ ఖరారు కాలేదు. విధాన సభలు, రాజకీయ వేదికలపై వినిపిస్తున్న ఆరోపణలు, సరైన సాక్ష్యాలు లేకపోతే చట్టపరంగా న్యాయ పరీక్షకు నిలవవు. ఆరోపణలు ఆయా పార్టీల రాజకీయ లాభనష్టాలకే పరిమితమవుతాయి. తాజాగా బీఆర్ఎస్ పై కవిత ఆరోపణలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
అసలు అవినీతిని బయటపెట్టే బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల అవినీతిని ప్రశ్నించకపోతే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మౌనం పాటిస్తే, అవినీతి రుజువెలా అవుతుంది? ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లుతుంది? రాజకీయ నాయకులు నిజంగా అవినీతిపై పోరాటం చేయాలంటే ఆరోపణలకే పరిమితం కాకుండా, తమ వద్ద ఉన్న ఆధారాలను విచారణ సంస్థలకు, కోర్టులకు సమర్పించాలి. అది జరగకపోవడం వల్లే, అవన్నీ రాజకీయ అరాచక నాటకాలుగానే మిగులుతున్నాయి.
ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు క్రీయాశీలతను కోల్పోతే, ప్రజలకు మిగిలిన ఏకైక ప్రభావవంతమైన ఆయుధం ఓటు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజలు అవినీతి పాలనలను ఓటుతో శిక్షించారు. కానీ అది సరిపోవడంలేదు. రాజకీయ అవినీతిపై నిరంతర నిఘా, ప్రజా ఒత్తిడి అవసరం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం, మీడియా ద్వారా చర్చను నిలబెట్టడం, కోర్టులను ఆశ్రయించడం, శాంతియుత ప్రజా ఉద్యమాలు వంటివన్నీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మార్గాలు. ముఖ్యంగా రాజకీయ పార్టీలను, నాయకులను గుడ్డిగా, భక్తిగా ఆరాధించడంకాక, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రశ్నించే సంస్కృతి సమాజంలో రావాలి.

రాజకీయ అవినీతికి అంతానికి శిక్షలున్నాయి. కానీ అవి అమలు కావడం లేదు అన్నదే చేదు నిజం. చట్టాలు కాగితాలకే పరిమితమై, రాజకీయ సంకల్పం లేనప్పుడు ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. ఈ పరిస్థితి మారాలంటే వ్యక్తుల మార్పు కంటే వ్యవస్థాగత మార్పు అవసరం. ప్రజలు మౌనంగా వీడి, ప్రశ్నిస్తేనే, రాజకీయ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News