Tuesday, July 14, 2026
26.4 C
Hyderabad

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి జరుగుతున్న లెక్కలేనన్ని చొరబాట్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభాను ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ లెక్కల్లో స్పష్టత లేదు. 2016లో కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో 2 కోట్ల వరకు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉండవచ్చని అంచనా.

పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అసోంలో 1985లో జరిగిన అసోం ఒప్పందం నుంచే విదేశీయుల సమస్య ప్రధాన చర్చగా మారింది. అనంతరం జాతీయ పౌర రిజిస్టర్ ప్రక్రియలో 19 లక్షల మంది జాబితా వెలుపల ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో రోహింగ్యాల అక్రమ వలస అంశం కూడా భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశంలో 40 వేల వరకు రోహింగ్యాలు నివసిస్తున్నారని భావిస్తున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్, జమ్మూ, ఢిల్లీ, మేవాత్ ప్రాంతాల్లో స్థిరపడినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.

అక్రమ వలసల ప్రభావం కేవలం జనాభా పెరుగుదలకే పరిమితం కాదు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు పొందడం ద్వారా కొందరు రాజకీయ, సామాజిక వ్యవస్థలోకి చొరబడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాల్లో విదేశీయుల పేర్లు ఉండటం వివాదాలకు దారితీస్తోంది. దీనివల్ల స్థానిక ప్రజల్లో ఉపాధి, వనరుల పంపకం, భూముల ఆక్రమణలపై అసంతృప్తి పెరుగుతోంది.

ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నవోలేకర్ ఆధ్యర్యం వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి తదితరులు సభ్యులుగా ఉండటం ఈ కమిటీకి విశేష ప్రాముఖ్యతను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మత, సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులను ఈ కమిటీ విశ్లేషించి, కాలపరిమితితో కూడిన విధాన సూచనలు చేయనుంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్రమ వలసలపై కఠిన వైఖరి పెరుగుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ చర్చకు దారితీసింది. అదే విధంగా బ్రిటన్ కూడా వలస విధానాన్ని సంస్కరించింది. యూరప్‌లో కూడా అక్రమ వలసల నియంత్రణ కోసం అనేక దేశాలు సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తున్నాయి. భారతదేశం కూడా తన భౌగోళిక, భద్రతా అవసరాల దృష్ట్యా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినవారు ఆధార్, ఓటరు కార్డులు పొంది స్థానిక వ్యవస్థల్లో కలిసిపోయారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల రాష్ట్రంలో విదేశీయుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. “గుర్తించండి – తొలగించండి – బహిష్కరించండి” అనే నినాదంతో చర్యలు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్బంధ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగం అందుకుంది.
అయితే, ఈ అంశాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చట్టబద్ధమైన శరణార్థులు, మానవ హక్కుల పరిరక్షణ అవసరాలను కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. మత, జాతి ఆధారిత విద్వేషం పెరగకుండా జాగ్రత్త పడటం ప్రభుత్వాల బాధ్యత. అక్రమ వలసలను అరికట్టడం ఎంత ముఖ్యమో, చట్టబద్ధ ప్రక్రియలో మానవీయ దృక్పథాన్ని పాటించడం కూడా అంతే అవసరం.

సరిహద్దు భద్రత బలోపేతం, ఆధార్-ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన, నకిలీ పత్రాల మాఫియాపై కఠిన చర్యలు, రాష్ట్రాలు-కేంద్రం మధ్య సమన్వయం వంటి చర్యల ద్వారానే ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమత్వానికి, సామాజిక, రాజకీయ, ఆర్థిక భద్రతకు ముప్పుగా మారకుండా ఇప్పుడే సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News