Friday, July 31, 2026
25.7 C
Hyderabad

తెలంగాణలో చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తూ, దీన్ని సమాజ అభివృద్ధికి దిక్సూచి లాంటి మోడల్ డాక్యుమెంట్ గా అభివర్ణించారు. గత ఏడు దశాబ్దాలుగా బలహీన వర్గాలు, మైనారిటీలు ఎదురుచూస్తున్న డేటాను ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అందించేందుకు చేపట్టిన ఈ సర్వే ఏడాది కాలంలో విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ నివేదికను మంత్రిమండలి ఆమోదించిందని, రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తామని ప్రకటించారు.

ఈ సర్వే ద్వారా 46.25 శాతం బీసీలు, మైనారిటీల్లోని బీసీలు కలిపితే 56.33 శాతం బీసీలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం వీరందరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టామని, ఈ నివేదికకు చట్టబద్ధత కల్పించేందుకు మంత్రిమండలి ఉపసంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ సర్వే చేపట్టామని స్పష్టం చేశారు.

ఈ సర్వే 2024 నవంబర్ 6న గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభమై, డిసెంబర్ 25న పూర్తయింది. 50 రోజుల్లో 1,12,15,137 కుటుంబాలను (96.09 శాతం) నమోదు చేశామని వెల్లడించారు. ఫలితాల ప్రకారం, ఎస్సీలు 17.43 శాతం (61,84,319), ఎస్టీలు 10.45 శాతం (37,05,929), బీసీలు 46.25 శాతం (1,64,09,179), ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం (35,76,588) ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. మైనారిటీ జనాభా 12.56 శాతం (44,57,012) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.4 శాతం (80,424), హిందూ ఓసీలు 13.31 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకుంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం గా ఉందని తెలిపారు.

ఈ సర్వే డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉపయోగించనుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత 75 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టని ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 ఫిబ్రవరి 2024న మంత్రిమండలి ఆమోదం పొంది, 6 ఫిబ్రవరి 2024న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయత్నాలు న్యాయపరంగా నిలవకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం సర్వే పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 తెలంగాణకు కొత్త దశను అందించనుందని, ప్రభుత్వం సమాన అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News