Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

కులాలు, పండుగలు, ఆచారాలు, తెలంగాణ అస్తిత్వం|TELANGANA|FESTIVALS

ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులు తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ మొదటిదైన గణతంత్ర రాజ్య వ్యవస్థ స్థాపించబడింది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వయసు గల జీవనది గోదావరి. ఆ నదీ తీరంలో తపస్సు చేస్తున్న బావరి ఋషి ద్వారా తొలినాళ్ల బౌద్ధం ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుండి దక్షిణానికి వ్యాపించి వెయ్యేళ్ళపాటు వికసించింది. తెలంగాణ అస్తిత్వం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే సజీవ సంస్కృతి. ఇది కాలానుగుణ మార్పులను స్వీకరించుకుంటూనే తన మూలాలను కాపాడుకుంటూ వచ్చిన చారిత్రక చైతన్యం…

ప్రముఖ చరిత్రకారులు, రచయిత డా. ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం

ప్రాగైతిహాసిక కాలం:
ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రజలు గుంపులుగా జీవించేవారు. గుహా దేవాలయాలలో గుట్ట వేల్పులను పూజిస్తూ ఆటపాటలతో జాతరలు జరుపుకునేవారు. ఇలాగే ఇప్పటికీ కోయ గిరిజనులు మేడారం సమ్మక్క వంటి గుట్ట వేల్పులను రెండేళ్లకోసారి ఆరాధిస్తున్నారు. రాచకొండ, దేవరకొండ, పాండవులగుట్ట, రామచంద్రాపురం, అక్షరాలలొద్ది మొదలైన ప్రాంతాలలో నాయకపోడు గిరిజనులు కూడా గుట్టలపైనున్న గుహా చిత్రాలను ఇప్పటికీ పూజిస్తున్నారు. చెంచు గిరిజనులు సలేశ్వరం, లొద్ది, మల్లెలతీర్థం జలపాతాల దగ్గర ఏటా జాతరలు జరుపుతారు; అలాగే నాయకపోడులు సోమలదేవమ్మ జలపాతం దగ్గర (పూజారిగూడెం, చెర్ల) ఏటా కొలుపులు నిర్వహిస్తారు.

ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులలో ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి తెలంగాణలో ఉన్నాయి. ముదుమాల్ వద్ద ఉన్న స్మారక నిలువురాళ్లు (మెన్హిర్లు), స్టోన్‌హెంజ్ నిర్మాణాలు, పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న పురుష-స్త్రీ ఆకారపు క్రాస్ శిలలు ప్రపంచ బృహత్ శిలా సమాధుల సంస్కృతులలో ప్రత్యేకమైనవి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ మొత్తం దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలోనే మొదటిదైన గణతంత్ర రాజ్య వ్యవస్థ స్థాపించబడింది. క్రీ.పూ. 6వ శతాబ్దంలో బోధన్ కేంద్రంగా ఏర్పడిన ఆ జనపదాన్ని అస్మక జనపదం అంటారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వయసు గల జీవనది గోదావరి ఈ ప్రాంతానికి ఆయువుపట్టు అయింది. ఆ నదీ తీరంలో తపస్సు చేస్తున్న బావరి ఋషి ద్వారా తొలినాళ్ల బౌద్ధం ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుండి దక్షిణానికి వ్యాపించి వెయ్యి సంవత్సరాలపాటు వికసించింది.

సాతవాహనుల కాలం (క్రీ.పూ. 80 – క్రీ.శ. 225):
ఆంధ్ర సాతవాహన మరియు శాతకర్ణి కాలంలో మునులగుట్ట, మానస్తంభంపల్లి వద్ద జైన పండుగలు జరిగాయి. శాతకర్ణి అశ్వమేధ యాగం చేశాడు. బుద్ధ జయంతి వేడుకలనూ నిర్వహించాడు. వ్యాపార వాణిజ్య మార్గాల్లోని సాంచి, ఫణిగిరి తదితర బౌద్ధ విహారాల దగ్గర స్తూపాలతో పాటు తోరణాలను కట్టించారు. తోరణాలు దేశంలోనే వాస్తు శిల్పాలలో అరుదైనవి. రోమన్ సామ్రాజ్యంతో నెరపిన అంతర్జాతీయ వాణిజ్యం బాగా వర్ధిల్లి లెక్క లేనన్ని రోమన్ బంగారు నాణేలు తెలంగాణకు చేరాయి. గౌతమీపుత్ర శాతకర్ణి “ఏకబ్రాహ్మణ” భావనతో యాగాలు నిర్వహించి చాతుర్వర్ణ వ్యవస్థను నిలబెట్టాడు. అష్టాదశ శ్రేణులు (18 రకాల వాణిజ్య కులాలు) అభివృద్ధి చెందాయి. ప్రపంచంలో మొదటి కథా కోశం “గాథాసప్తశతి”ని హాల రాజు ప్రాకృత భాషలో సంకలించగా అందులో అన్ని ప్రధాన హిందూ పండుగల ప్రస్తావనలు ఉన్నాయి. ఆంధ్ర (ఆంధ్) గిరిజనులు ఇప్పటికీ సిరి హాల మరియు కనకాయి దేవతలను పూజిస్తున్నారు.

ఇక్ష్వాకుల కాలం (225 – 350):
ఇక్ష్వాకులు కూడా హిందూ మరియు బౌద్ధ మతాలను పోషించారు. పుష్పభద్రస్వామి, అష్టభుజ నారాయణస్వామి, హారితి దేవాలయాలను నిర్మించారు. సంతాన ప్రాప్తి కోసం హారితికి గాజులు సమర్పించే ఆచారం ఉండేది. రాజవైద్యుడు ధేమసేన ఫణిగిరి విహారానికి ధర్మచక్రం దానం చేశాడు. శాతవాహనుల చివరి కాలంలో దక్షిణాదిన తొలి విశ్వవిద్యాలయాన్ని ఆచార్య నాగార్జున స్థాపించాడు. అది ఇక్ష్వాకుల రాజధాని విజయపురి (నాగార్జునకొండ) లో ఉండి అంతర్జాతీయ బౌద్ధులను ఆకర్షించింది. సీహళ విహారం దీనికి ఒక ఉదాహరణ. విజయపురిలో రోమన్ శైలిలో ఉన్న ప్రదర్శన శాల (అంఫిథియేటర్) విజయపురికి ఉన్న అంతర్జాతీయ స్థాయికి మరో ఉదాహరణ. అయితే రోమన్ వాణిజ్యం క్రమంగా తగ్గడంతో రాజులు నాగళ్ళు, ఆవులు, ఎద్దులు పంచి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.

విష్ణుకుండుల కాలం (350-569):
విష్ణుకుండులు కూడా పెద్దపెద్ద బావులు, చెరువులు, కుంటలు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఇంద్రపాలనగరం శాసనాలు బుద్ధ జయంతి సందర్భంగా దశబలబలికి చేసిన దానాలను ప్రస్తావిస్తాయి. శాతవాహనుల నుంచి విష్ణుకుండుల వరకు రాణివాసపు స్త్రీలు విరివిగా దానాలు చేయడం ఆ శతాబ్దాలలో స్త్రీలకు సమాజంలో, రాజ కుటుంబంలో గల గౌరవ మర్యాదలకు, స్వతంత్రతకు నిదర్శనం. యజ్ఞ యాగాలు, ఆలయ ప్రతిష్ఠా పండుగలు కీసరగుట్టలో నిర్వహించబడ్డాయి, అక్కడ శైవం-వైష్ణవాన్ని కలిపి రామలింగేశ్వర ఆలయాలను నిర్మించి మత భేదాలను నివారించారు. ప్రపంచ ప్రసిద్ధ అజంతా గుహా వాస్తు శిల్ప చిత్రకళలు వీరి కాలంలో వాకాటకులతో సంబంధాల ద్వారా బాగా అభివృద్ధి చెందాయి.

చాళుక్యుల కాలం (569-1162):
తొలి చాళుక్యులు ఆలంపూర్, యేలేశ్వరం, ఆర్మకొండ (అనుమకొండ) భద్రకాళి వంటి ఆలయాలను నిర్మించారు. విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 672లో కార్తీక పౌర్ణమి రోజున వడ్డరేణభట్టుకు దానాలు ఇచ్చాడు.

వేములవాడ చాళుక్యులు (753-973): బోధన్, వేములవాడ, కోట్ల నర్సింహులపల్లి, కొలనుపాక వద్ద జైన తీర్థంకరులైన మహావీర మరియు పార్శ్వనాథ జయంతులను నిర్వహించారు. వారి సామంతులు ముదిగొండ చాళుక్యులు చెన్నూరు (అగస్తేశ్వర ఆలయం), ముదిగొండ, క్రివ్వక, కొరివి వద్ద ఆలయ ప్రతిష్ఠా పండుగలు నిర్వహించారు. “పెరామని పున్నమి” సందర్భంగా ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛంద పన్నులు చెల్లించేవారు. మకర సంక్రాంతి సందర్భంగా కూడా దానాలు చేసేవారు. ఎక్కువ మంది గ్రామాలు, అటవీ గూడెళ్లలో నివసించేవారు కాబట్టి పండుగల ద్వారా స్వచ్ఛంద విరాళాలు సేకరించి అడవులను నరికి పట్టణాలు, చెరువులు నిర్మించేవారు. గౌరీ పండుగలో బొట్టు బేత భార్య సిరి మహాదేవిని అభినవ గౌరీగా భావించేవారు. వైష్ణవ ఏకాదశి సందర్భంగా భగవాన్ నారాయణ, వరాహలాంచనం, గరుడ ధ్వజం ప్రాముఖ్యం పొందాయి. రాజు కుసుమాయుధుడు మానవ్యస గోత్రానికి చెందిన బ్రాహ్మణుడనని చెప్పుకున్నాడు. అయితే నాయకులు, కాంపులు రాజకీయంగా శక్తివంతులుగా ఉండేవారు.

కాకతీయుల కాలం (1162-1323):
13 వ శతాబ్దంలో రుద్రమదేవి మొగిలిచర్లలో బిడ్డకు మగ సంతానం కలగాలని బోనాల పండుగ జరిపింది. దేవగిరి యాదవులపై విజయానంతరం బతుకమ్మ పండుగను నిర్వహించింది. పుష్య, మాఘ మాసాల్లో జాతరలు జరిగాయి. దసరా పార్వేట ఉత్సవం నిర్వహించారు. రాజులు, రాజన్యులు గొలుసుకట్టి చెరువులను నిర్మించారు. రామప్ప ఆలయం, వేయి స్తంభాల ఆలయం వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలు నిర్మించారు. సామాన్య ప్రజలను వీరశైవ మతం బాగా అక్కున చేర్చుకుంది. కుల సమయాలు, అష్టాదశ, అశేష, సమస్త ప్రజలు ఆ కాలంలో నివసించేవారు.

రేచర్ల పద్మనాయకుల కాలం (1361-1475):
రేచర్ల పద్మనాయక సోదరులు తమ మధ్య శతాబ్దకాలం విభేదాలు లేకుండా పాలనాధికారాలను పంచుకున్నారు. వసంతోత్సవాలు నిర్వహించి రాజులు మంత్రులు, పండితులు, కవులు, గాయకులు, నర్తకులు, స్త్రీలతో సహా అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోయేవారు. ఆ ఉత్సవాల్లో రత్నపాంచాలిక, ప్రసన్న రాఘవ నాటకాలు ప్రదర్శించబడేవి. పుష్పాపచయం, జలక్రీడలు కూడా జరిగేవి. వీరి కాలంలో పలు కులాల స్థిరీకరణ జరిగింది. ఆ కాలపు ప్రసిద్ధ కవి శ్రీనాథుడు రేచర్ల కులం నుంచే రెడ్లు, పద్మనాయక వెలమలు ఉద్భవించారు అని రాశాడు.

కుతుబ్షాహీల కాలం (1518-1687):
గోల్కొండ కుతుబ్షాహీలు వజ్రాలు, రత్నాల అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. భాగమతి పేరిట చార్మినార్ వద్ద హైదరాబాద్ (భాగ్యనగరం) నగరాన్ని నిర్మించారు. తెలుగు కవులు అచ్చ తెలుగు కావ్యాలు, యక్షగానాలు రచించారు. హిందూ-ముస్లిం సమ్మిళిత సంస్కృతి అభివృద్ధి చెందింది.

అదే సంప్రదాయం తరువాత నిజాం పాలనలో కూడా శతాబ్దం క్రితం వరకు కొనసాగింది. గోండు తదితర గిరిజనులు రాంజీ గోండ్, కుంరం భీమ్ నాయకత్వంలో అటవీ హక్కుల కోసం పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు కేవలం ఒక శతాబ్దం క్రితం మాత్రమే ప్రారంభమయ్యాయి.

ముగింపు:
మొత్తంగా పరిశీలిస్తే, తెలంగాణ అస్తిత్వం ఒకే కాలానికి, ఒకే మతానికి లేదా ఒకే కుల నిర్మాణానికి పరిమితమైనది కాదు. ఇది ప్రాగైతిహాసిక గుట్ట వేల్పుల పూజల నుంచి ప్రారంభమై, గిరిజన జాతరలు, బౌద్ధ ధర్మ ప్రాచుర్యం, జైన మరియు హిందూ పండుగల విస్తరణ, మధ్యయుగాల ఆలయ సంస్కృతి, మరియు తరువాతి కాలంలో హిందూ–ముస్లిం సమ్మిళిత సంస్కృతుల వరకు విస్తరించిన నిరంతర సాంస్కృతిక ప్రవాహం.

ఈ పరిణామ క్రమంలో కుల వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పటికీ, పండుగలు మరియు ఆచారాలు మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఐక్యతను, సహజీవనాన్ని ప్రతిబింబించాయి. గిరిజనుల గుట్ట వేల్పుల పూజలు, చెరువుల నిర్మాణానికి సంబంధించిన ఉత్సవాలు, యాగాలు, జాతరలు, వసంతోత్సవాలు—ఇవన్నీ సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

తెలంగాణ చరిత్రలో ప్రతి రాజవంశం తనదైన విధంగా మతసామరస్యాన్ని, ఆర్థికాభివృద్ధిని, మరియు సామాజిక సమన్వయాన్ని పెంపొందించింది. గిరిజన సంప్రదాయాల నుంచి రాజసభల ఉత్సవాల వరకు, దేవాలయాల నుంచి బౌద్ధ విహారాల వరకు, వాణిజ్య మార్గాల నుంచి గ్రామీణ జీవన విధానాల వరకు—ఈ సమగ్ర అనుభవమే తెలంగాణకు ప్రత్యేకమైన సాంస్కృతిక స్వరూపాన్ని అందించింది.

అందువల్ల తెలంగాణ అస్తిత్వం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే సజీవ సంస్కృతి. ఇది కాలానుగుణ మార్పులను స్వీకరించుకుంటూనే తన మూలాలను కాపాడుకుంటూ వచ్చిన చారిత్రక చైతన్యం…

-డా. ద్యావనపల్లి సత్యనారాయణ

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News