Monday, June 29, 2026
26.6 C
Hyderabad

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్‌లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్‌ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ ఆర్థిక పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం, పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, స్టాక్ మార్కెట్ల పతనం ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి అనుగుణంగా మోదీ తన కాన్వాయ్ ని కుదించుకోగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాన్వాయ్‌లలో కార్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేవలం కాన్వాయ్‌ల కార్లు తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందా?

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఉపరితల స్థాయిలో లేవు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల దిశగా కదులుతున్నాయి. భారతదేశం అవసరమైన చమురులో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరల్లో ప్రతి 10 డాలర్ల పెరుగుదల దేశ దిగుమతులపై వేల కోట్ల అదనపు భారాన్ని మోపుతోంది. దీని ప్రత్యక్ష ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. పెట్రో ధరలు పెరిగితే రవాణా వ్యయం పెరిగి, దాని ప్రభావం ఆహార పదార్థాల నుండి నిర్మాణ సామగ్రి వరకు అన్ని రంగాలపై పడటం ఖాయం.

ఇప్పటికే ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడుము విరుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 4% దాటడంతో పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రజల ఆదాయాలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల నిధుల కోతల కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు ప్రజలపై మరింత భారాన్ని మోపుతుంది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు పొదుపు బోధనలు చేయడం కన్నా ముందుగా తమ దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. కాన్వాయ్‌లలో రెండు కార్లు తగ్గించడం ప్రజలకు సందేశాత్మక చర్యే కావచ్చు. కానీ, అది నిజమైన ఆర్థిక సంస్కరణ కాదు. దేశ రాజకీయ వ్యవస్థలో కొనసాగుతున్న అనవసర ఖర్చులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులకు లక్షల్లో జీతాలు, భారీ భత్యాలు, జీవితాంతం పెన్షన్లు, ఉచిత బంగళాలు, ఉచిత విద్యుత్, ఫోన్, భద్రతా సిబ్బంది వంటి సౌకర్యాలపై ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రజలకు పొదుపు చెప్పే ముందు ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి.

దేశవ్యాప్తంగా శాసన మండళ్ల నిర్వహణ, వివిధ స్థాయిల్లో రాజకీయ పదవుల విస్తరణ, అవసరానికి మించిన ప్రభుత్వ కమిటీలు కూడా ఖర్చును పెంచుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో శాసన మండళ్ల అవసరంపై ఏళ్ళుగా చర్చ జరుగుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కొనసాగిస్తున్నారు. ప్రజల డబ్బుతో నడిచే ఈ వ్యవస్థల్లో పారదర్శకత, వ్యయ నియంత్రణ అత్యవసరం.

ఇక సామాన్య ప్రజల అవసరాలపై మాత్రం భారాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు ఇస్తోంది. విమాన ఇంధన ధరలు పెరగడంతో విమాన టిక్కెట్లు భారీగా పెరిగాయి. విదేశాల్లో ఉన్న పిల్లలను చూసేందుకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకే ఇప్పుడు విమాన ప్రయాణం భారంగా మారింది. ప్రజల జీవన వ్యయాలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ప్రతీకాత్మక చర్యలతో సరిపెట్టుకోవడం సరైంది కాదు.

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలు పెంచాలి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయాలి. ధరల నియంత్రణ కోసం మార్కెట్ జోక్యం పెంచాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ చురుకుదనం పొందుతుంది. ప్రజలపై పన్నులు, ధరల భారాలు మోపడం ద్వారా కాదు.
ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్‌లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్‌ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.

Latest News

పురుగుల శాక్లేట్లు!?|ADUGU TRENDS

శాకిలేట్లంటే ఎవ్వలికైనా ఇట్టమే.! శిన్న పిల్లలైతే నాక్కుంట, శీక్కుంట మరీ ఇట్టంగ తింటరు. గా శాకిలేట్ శేతికిత్తిమా శెప్పినట్టింటరు. అన్నం తింటరు. ఏడుపాపుతరు. శెప్పింది చేత్తరు. గందుకే పిల్లలకు బాజర్ల శాకిలేట్లు కొనిపిచ్చుడు...

యుద్ధం ముగిసిందా? ఎగసిందా!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ విజేతలను కాకుండా, మరింత విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుందనే చారిత్రక సత్యం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం కేవలం ఆ ప్రాంత దేశాలకే కాదు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా అత్యంత అవసరం....

జూన్ 30, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి పాడ్యమి పూర్తిగా రోజంత నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా రోజంత యోగం బ్రహ్మ మధ్యాహ్నం 03.33 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ సాయంత్రం 05.07 వరకు ఉపరి కౌలవ రాహుకాలం పగలు 03.00 నుండి 04.30...

జూన్ 29, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి తెల్ల 04.12 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మూల రాత్రి తెల్ల 03.31 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం శుక్ల మధ్యాహ్నం 02.53 వరకు ఉపరి బ్రహ్మ కరణం భద్ర మధ్యాహ్నం...

దంటగాడు!?|ADUGU TRENDS

రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకంటే గూడా దంటగాల్లే ఎక్కువ అంటరు. ఎవలికీ శెప్పుకోలేనివి గా దంటగాల్లకు శెప్పుకుంటరు. గవాల్లు గూడా బాగా సూసుకుంటరు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమించేవాడు,...

ప్రశ్నార్థకంగా ప్రశ్నించే సంస్కృతి!?|EDITORIAL

అధికారాన్ని నియంత్రించేది చట్టం. చట్టాన్ని సజీవంగా ఉంచేది ప్రజల అప్రమత్తత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలిచేది ప్రశ్నించే సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్యాయం జరగడం కాదు. అన్యాయం జరిగినా సమాజం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 28 నుండి జూలై 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే...

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News