Friday, July 17, 2026
24.5 C
Hyderabad

కొండా వర్సెస్ కాంగ్రెస్!?|KONDA SUREKHA|CONGRESS

సీఎం రేవంత్ పై కినుక|CM|REVANTHREDDY
కడియంపై సీఎం కు లేఖ|KADIYAM SRIHARI
అధిష్ఠానానికి ఫిర్యాదు?|AICC
గతంలోనూ అవమానాలే
క్రమశిక్షణా సంఘంతో విచారణకు డిమాండ్|DISIPLINERY COMMITTEE

హైదరాబాద్, జూలై 7 (అడుగు న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అధికారులతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమవడంతో పాత సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి. గతంలోనూ తనకు అవమానాలే జరిగాయంటూ, తాజా సమస్యపై విచారణ జరపాలని సీఎం కు లేఖ రాసిన సురేఖ, అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు లేఖ రాయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కొండా కుటుంబానికి అధికారంతోపాటు వివాదాలు కొత్త కాదు. అయితే, అవి ఎప్పటికీ సమసిపోకుండా పోతున్నాయి. కొత్తగా తలెత్తుతుండటమే విచిత్రం. విధి వైపరీత్యం. స్వయం క్రుతాపారాధం. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి కొండా సురేఖకు అత్యంత నమ్మకస్తుడైన ఓఎస్‌డీ సుమంత్ ను సీఎంఓ తొలగించింది. సురేఖకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ఏకపక్ష నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.

నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి నియామక వ్యవహారం మంత్రిని తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే యాదాద్రి టెంపుల్ బోర్డు చైర్మన్‌తో సభ్యుల నియామకం విషయం కూడా మంత్రికి తెలియదట. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పేర్లు ఖరారై జీవో విడుదలైందట. తన సిఫార్సులకు కనీస విలువ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న కొండా సురేఖ, నిరసనగా ఇటీవల డిజిటల్ గా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికే హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. “కొండా సురేఖకు తెలియకుండానే కొణిదెల సురేఖ నియామకం” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు రావడం ఆమెను మరింత మనోవేదనకు గురిచేసినట్లు తెలిసింది.

యాదాద్రి వివాదం చల్లారకముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలి కొండా సురేఖకు మరింత ఆగ్రహం తెప్పించింది. దేవాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కడియం శ్రీహరి హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, భూముల పరిరక్షణపై ఆయన అధికారులకు గడువులు నిర్దేశించడంపై మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగానే ఫిర్యాదు చేశారు.

కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని ఉల్లంఘించారని మంత్రి మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఇంత అనుభవం ఉన్న నాయకుడు, శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి సమీక్షలు నిర్వహించడం అనుచిత సంప్రదాయమని, ఇది అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీస్తుందని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శాఖాపరమైన ఇబ్బందులతో పాటు, తన సొంత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కొండా సురేఖకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ఇప్పించుకోవాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా గ్రూపులు కట్టడం ఆమెను ఒంటరిని చేసింది. దీనికి విరుద్ధంగా అమె వ్యవహారశైలి, వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. అధిష్ఠానం జోక్యం చేసుకునేదాకా వెళ్లింది. ఏదో విధంగా సద్దుమణిగింది.

ఈ మొత్తం పరిణామాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న కొండా సురేఖకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో వ్యతిరేకతలు రావడం, నిర్లక్ష్యానికి గురవుతుండటాన్ని తన పట్ల వివక్షగా మంత్రి సురేఖ భావిస్తున్నారు.

అందుకే ఆమె ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని తేల్చుకోవాలనుకుంటున్నారు. ఒకవైపు సీఎంకు లేఖ రాస్తూనే, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అధిష్టానానికి రాయనున్న లేఖ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News