Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

నిరంకుశం వైపు ప్రజాస్వామ్యం పరుగులు!|EDITORIAL

ప్రజలు, వారి ప్రతినిధుల ద్వారా ప్రజల కోసమే జరిగే పరిపాలన ప్రజాస్వామ్యం. రాను రాను ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేతలు, నిరంకుశంగా పాలించడం, నిరపేక్షంగా అధికారాన్ని చెలాయించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ నింరకుశంవైపు, నిరంకుశాలు నియంతృత్వంగా మారుతుండటం విచారకరం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేత అధికారాలు కేంద్రీకృతమై, ప్రజల స్వేఛ్ఛా హక్కులను హరించడమే దీని ఉద్దేశ్యం. ఇది ప్రజాభిప్రాయాన్ని అణచివేస్తుంది. వివిధ సంస్థలను హస్తగతం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశ ప్రవృత్తి మెల్లగా ప్రబలడం ఎంతో ప్రమాదకరం.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరిచి, అధికారంలోకి వచ్చాక తమ స్వంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవడం.. హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు జరగకుండా అణచివేయడం.. భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్రవేసి, విపక్షాలను విచారణల పేరుతో వేదించడం.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని అణచడానికి న్యాయ వ్యవస్థను లేదా చట్టాలను ఉపయోగించడం వంటివన్నీ నిరంకుశ ధోరణులే. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం వంటి నినాదాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. హిట్లర్ తరహాలోనే వీరు వ్యవహరిస్తున్నారు. శాసన సభలను రద్దు చేయడం, గవర్నర్ల వ్యవస్థను వాడుకోవడం, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్య బలహీనతలుగా చూడాలి.
బలమైన పౌర సమాజం ఏర్పడాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగాలి. హక్కుల విషయంలో గళమెత్తే శక్తిని ప్రజలు కలిగి ఉండాలి. ప్రశ్నించే మీడియా ఉంటే ప్రభుత్వ చర్యలు ప్రజలకు స్పష్టమవుతాయి. ప్రభుత్వానికి అతీతంగా స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఓటు హక్కును వినియోగించడమే కాక, ప్రభుత్వ చర్యలను గమనిస్తూ, ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలు చూపాలి. అప్పుడే నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుత రాజకీయ వాతావరణం కనిపించకుండా పోతోంది. అధికారం చేపట్టిన నేతలు నిరంకుశమనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు మీడియా పైనా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల దాకా వెళుతున్నారు. సొంత మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మోదీ, మమతా బెనర్జీ, నిన్న మెన్నటి దాకా కేసీఆర్‌, జగన్‌ వంటి వాళ్లంతా అహంకార పూరితంగా పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, వారిచ్చే ఓటుతో గెలిచి సుపరిపాలన అందించాలి. ఓట్లేయించుకోవడం, వేసుకోవడం ఎలాగో తెలుసుకుని రాజ్యమేలుతున్న మన రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలను పురుగుల్లా చూస్తున్నారు. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఊహించి ఉండరు. లేకుంటే ఎక్కడో అక్కడ ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేవారేమో!
దేశంలో ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ కాలంలోనూ, ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, వైఎస్ లాంటి నేతలు కూడా ఇంత నిరంకుశంగా పాలించ లేదు. ప్రజా సంక్షేమం పేరుతో, డబ్బుల పందేరంతో ఖాజానాను ఊడ్చేస్తున్న నాయకులు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్న వారు నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వారిని ఆదరిస్తారు. లేదంటే అత: పాతాళానికి తొక్కేస్తారు.
ప్రజాస్వామ్యానికి అసలైన శక్తి ప్రజలే. అయితే ప్రజల మౌనం, ఓటింగ్ పై ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత లాభం కోసమే ఓట్లేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి చేటు, నిరంకుశత్వానికి బలం చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. పాలకులను ప్రశ్నించగలగాలి. లేదంటే ప్రజాస్వామ్యం నెమ్మదిగా నియంతృత్వాన్ని సంతరించకోవడం ఖాయం.
…..

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News