Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

నిరంకుశం వైపు ప్రజాస్వామ్యం పరుగులు!|EDITORIAL

ప్రజలు, వారి ప్రతినిధుల ద్వారా ప్రజల కోసమే జరిగే పరిపాలన ప్రజాస్వామ్యం. రాను రాను ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేతలు, నిరంకుశంగా పాలించడం, నిరపేక్షంగా అధికారాన్ని చెలాయించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ నింరకుశంవైపు, నిరంకుశాలు నియంతృత్వంగా మారుతుండటం విచారకరం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేత అధికారాలు కేంద్రీకృతమై, ప్రజల స్వేఛ్ఛా హక్కులను హరించడమే దీని ఉద్దేశ్యం. ఇది ప్రజాభిప్రాయాన్ని అణచివేస్తుంది. వివిధ సంస్థలను హస్తగతం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశ ప్రవృత్తి మెల్లగా ప్రబలడం ఎంతో ప్రమాదకరం.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరిచి, అధికారంలోకి వచ్చాక తమ స్వంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవడం.. హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు జరగకుండా అణచివేయడం.. భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్రవేసి, విపక్షాలను విచారణల పేరుతో వేదించడం.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని అణచడానికి న్యాయ వ్యవస్థను లేదా చట్టాలను ఉపయోగించడం వంటివన్నీ నిరంకుశ ధోరణులే. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం వంటి నినాదాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. హిట్లర్ తరహాలోనే వీరు వ్యవహరిస్తున్నారు. శాసన సభలను రద్దు చేయడం, గవర్నర్ల వ్యవస్థను వాడుకోవడం, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్య బలహీనతలుగా చూడాలి.
బలమైన పౌర సమాజం ఏర్పడాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగాలి. హక్కుల విషయంలో గళమెత్తే శక్తిని ప్రజలు కలిగి ఉండాలి. ప్రశ్నించే మీడియా ఉంటే ప్రభుత్వ చర్యలు ప్రజలకు స్పష్టమవుతాయి. ప్రభుత్వానికి అతీతంగా స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఓటు హక్కును వినియోగించడమే కాక, ప్రభుత్వ చర్యలను గమనిస్తూ, ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలు చూపాలి. అప్పుడే నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుత రాజకీయ వాతావరణం కనిపించకుండా పోతోంది. అధికారం చేపట్టిన నేతలు నిరంకుశమనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు మీడియా పైనా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల దాకా వెళుతున్నారు. సొంత మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మోదీ, మమతా బెనర్జీ, నిన్న మెన్నటి దాకా కేసీఆర్‌, జగన్‌ వంటి వాళ్లంతా అహంకార పూరితంగా పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, వారిచ్చే ఓటుతో గెలిచి సుపరిపాలన అందించాలి. ఓట్లేయించుకోవడం, వేసుకోవడం ఎలాగో తెలుసుకుని రాజ్యమేలుతున్న మన రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలను పురుగుల్లా చూస్తున్నారు. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఊహించి ఉండరు. లేకుంటే ఎక్కడో అక్కడ ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేవారేమో!
దేశంలో ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ కాలంలోనూ, ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, వైఎస్ లాంటి నేతలు కూడా ఇంత నిరంకుశంగా పాలించ లేదు. ప్రజా సంక్షేమం పేరుతో, డబ్బుల పందేరంతో ఖాజానాను ఊడ్చేస్తున్న నాయకులు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్న వారు నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వారిని ఆదరిస్తారు. లేదంటే అత: పాతాళానికి తొక్కేస్తారు.
ప్రజాస్వామ్యానికి అసలైన శక్తి ప్రజలే. అయితే ప్రజల మౌనం, ఓటింగ్ పై ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత లాభం కోసమే ఓట్లేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి చేటు, నిరంకుశత్వానికి బలం చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. పాలకులను ప్రశ్నించగలగాలి. లేదంటే ప్రజాస్వామ్యం నెమ్మదిగా నియంతృత్వాన్ని సంతరించకోవడం ఖాయం.
…..

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News