Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

ప్రజల పక్షపాతి ప్రభంజన్!|PRABHANJAN YADAV

ప్రభంజన్ కుమార్ యాదవ్ ప్రతిభ గల జర్నలిస్టు, కవి, రచయిత, వరంగల్ జిల్లా వాసి. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. భాషా శాస్త్రం, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఎం.సి.జె.) చదివిండు. రూరల్ & డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఐచ్ఛికంగా ఎం.ఫిల్ పూర్తి చేసిండు.

1988 నుంచి వివిధ తెలుగు పత్రికల్లో దశాబ్ద కాలం జర్నలిస్టుగా పనిచేసిండు. జర్నలిజంలో నిలదొక్కుకోవాలనుకున్నడు. 1998లో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా, స్వభావ రీత్యా నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమైండు. ఆత్మవంచన, శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేసే బహుకొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో ప్రభంజన్ కుమార్ యాదవ్ ఒకడు.

స్వభావ రీత్యా ప్రభంజన్ చాల సెన్సిటివ్. పేద ప్రజల పట్ల, ఉత్పత్తి కులాల పట్ల అభిమానం, ఆదరణ గల వ్యక్తి అనడానికి ఆయన రచనలే ప్రత్యక్ష సాక్ష్యం. జర్నలిస్టుగా ప్రభంజన్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకురావడం సంతోషం. నడుస్తున్న చరిత్రను సజీవంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభంజన్ ది. నిజాలను నిర్భయంగా రాసే సాహసం ఆయన కలానిది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ప్రభంజన్ మనస్తత్వం. రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం ఆయనది. ఏ రోటికాడి మాట ఆ రోటికాడ చెప్పడం చాతకానివాడు. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరగటం తెలియనివాడు. నిష్టూరమైనా పరవాలేదని నిగ్గు తేల్చాలనుకునేవాడు. కష్టాలకు, నష్టాలకు వెరవడు. ఏటికి ఎదురీదడమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభంజన్ ప్రజల పక్షపాతి. ఆయన రచనల్లో ప్రతిబింభించిన ఉత్పత్తి కులాల ఆవేదన, బీదల బాధలు అందుకు నిదర్శనం. ప్రజల ఆలోచనలకు, ఆవేదనలకు ప్రభంజన్ అక్షర నివేదనే ఈ వ్యాస సంకలనం.

‘ప్రభంజన పథం’
“గొల్లల సంస్కృతి-గొప్ప సంస్కృతి” అనే పరిశోధన వ్యాసంతో మొదలైంది ఈ పుస్తకం. ఈ సమాజానికి తన కులం ‘అయిదు రకాల పరిశ్రమలను, ఉత్పత్తులను అందించినందుకు ప్రతిఫలం అవమానమా?’ అని ప్రభంజన్ నిలదీసిండు. శ్రమను గౌరవించని దోపిడి సంస్కృతిని ఈసడించుకున్నడు. వెట్టిచాకిరి చేస్తున్న రజకుల కష్టాలు తీరాలన్నడు. గీత కార్మికులకు ఊతం యివ్వాలని, వెలవెల బోతున్న నేతగాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆశతో రాసిండు. మూలవాసుల విముక్తి బాటలో కలిసి పయనించిండు. దళిత గేయాలు రాసి పల్లవి కలిపిండు. దళిత రచయితల, కళాకారుల, మేధావుల (దరకమే) ఐక్యవేదికలో, నాస్తిక సంఘంలో పనిచేసిండు. రచనలు, ఉపన్యాసాలతోనే ఊర్కోలేదు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నడు. జన చైతన్యం కోసం సంఘటిత ఉద్యమాల్లో భాగస్వామి అయిండు. ఆచరణే గీటురాయని నిరూపించిండు.

‘చూడు చూడు వాడలు నిర్లక్ష్యపు నీడలు’ అన్న వ్యాసంలో ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టిండు. ‘జనజీవనాడి పాట’, ‘పరిగెత్తే కాలంతో పయనించలేక’, ‘బతుకు బాటలో ఒంటరి పయనం’, ‘బూటకపు ఎన్ కౌంటర్లలో బలహీన వర్గాలే బలి’, ‘కమ్యూనిస్టులకు కనువిప్పు కలిగే మేడే ఏనాడో!’, ‘కమ్యూనిస్టులకు కుల నిర్మూలన ఇప్పుడు గుర్తొచ్చిందా!’, ‘సామాన్యుడి ముంగిట ఇంకా వికసించని విద్యుత్తేజం’ అన్న వ్యాసాలతో అన్ని వర్గాల ప్రజల కోసం స్పందించిండు. కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను గుర్తించినా సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణకు ఉపక్రమించలేదని ప్రశ్నించిండు. కమ్యూనిస్టులే ఐక్యం కానప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపివ్వడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసిండు.

ప్రభంజన్ వ్యంగ్య రచనలు కూడా చేసిండు. ‘లత్కోర్ కౌంటర్’, ‘భలే ఓట్లు…. బాయినెట్లు’, ‘రామోజీరావు గారు అందుకో ఈ లేఖ’, ‘నేనే రారాజు చూసేవాళ్లే బేజారు’ అన్న రచనల్లో సూటిగా చురకలంటించిండు. కథనం చాల సాఫీగా సాగిపోయింది.

ఈ రచనలతో పాటు ప్రభంజన్, యాదవ కులాన్ని సమీకరించిండు. సమాజంలో యాదవులు బాగా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. యాదవ కులంలో మేధావి వర్గం కూడా తక్కువే. అటువంటి యాదవ కులాన్ని సమీకరించడమే కాక, మేధావి వర్గాన్ని ఆర్జనైజ్ చేయాల్సిన అవసరముందని గుర్తించిండు. యాదవ మేధావుల ఫోరానికి వ్యవస్థాపక కన్వీనర్ గా పనిచేసిండు. నేను రాసిన “గొల్ల కురుమలు ఈ సమాజానికి ఏం చేసిండ్రు?”, “డోలు దెబ్బ” పాటల సంకలనాన్ని మేధావుల ఫోరం తరపున వెలువరించడంలో కన్వీనర్ గా కీలకపాత్ర పోషించిండు.

ప్రభంజన్ పాటలు కూడా రాసిండు. దొడ్డి కొమురన్న పాట చాల మంచి పాట. దొడ్డి కొమురయ్య జీవితాన్ని తిరిగి మనకు గుర్తు చేస్తుంది. ‘మంద కదిలింది రా జంబాయిరే’ అనే పాట కూడా యాదవ జీవన పోరాటాన్ని అద్దంలో చూపుతుంది.

ప్రభంజన్ వ్యాసాలు, పాటలు, కవితలు, కథలు కూడా రాసిండు. రచనలన్నీటిలోనూ సామాజిక స్పృహ, చైతన్యం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనం లేని రచనలు చేయడమెందుకని ప్రశ్నిస్తాడు కూడా!

-ఆచార్య కంచె ఐలయ్య
(23/3/2004న రాసిన వ్యాసం)

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News