స్టాక్ మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 40 పాయింట్లు పడిపోవడం మార్కెట్ ఒత్తిడిని సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, క్రూడాయిల్, US బాండ్ యీల్డ్స్, బంగారం ధరలు తగ్గినప్పటికీ, డాలర్ ఇండెక్స్ పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. నిఫ్టీ 23,150 స్థాయిలో నిలదొక్కుకోవడం కీలకంగా మారింది. ఈరోజు DR REDDY, HPCL, ADANI ENERGY, ADANI GREEN ENERGY, TEJAS NETWORK కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి, వీటి ప్రభావం మార్కెట్ ట్రెండ్ను ప్రభావితం చేయవచ్చు.

