Saturday, September 5, 2026
27.6 C
Hyderabad

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే!

ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.

అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం? ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి. ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే. గెలుపోటములను సమానంగా తీసుకోవాలనీ అంటారు. నిజమే కానీ, ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.

యుద్ధం-క్రీడ వేర్వేరుగా కనిపిస్తున్నా, రెండూ ఒకటే. అందుకే యుద్ధ క్రీడ అన్నారు. యుద్ధ తంత్రాలు, ఎత్తుగడలు, గెలుపు-ఓటములు, రెండింటా ఒకటే. ఒక్క చంపడాలు, చంపుకోవడాలు, రక్తపాతం తప్ప. యుద్ధంలో చావులుండవచ్చు కానీ, ఒక్కోసారి ఆటల్లో ఓటమి చావుకంటే భయంకరంగా ఉంటుంది. అదీ ఒక దేశం తరపున ఆడినప్పుడు ఆ దేశ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకునుగుణంగా గెలిచి తీరాల్సి వస్తుంది. టీ20 ఆసియా కప్ లో వరసగా మూడు మ్యాచుల్లోనూ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆ విధంగానే పాకిస్తాన్ మీద అదే వేదికపై పదే పదే విజయం సాధించడం ద్వారా 150 కోట్ల భారతీయుల మనుసుల్లోని భావోద్వేగాల్ని గెలిచారు. బలాన్ని చాటారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత, భారత్ పాక్ పై చేసిన దాడులు ఆ దేశాన్ని దిమ్మతిరిగేలా చేశాయి. అదే తరహాలో భారత క్రికెట్ జట్టు దుబాయ్ లో జరిగిన అసియా కప్ పొట్టి ఫార్మెట్ లో పాకిస్తాన్ పై అటు బ్యాట్ తో ఇటు బాల్ తో దాడులు చేసి తుత్తునియలు చేశారు. పాక్ పై భారత్ కు ఓటమి లేదని, ఎప్పటికైనా పాక్ ఓడాల్సిందేనని ప్రపంచానికి చాటారు. భారత్ లో దసరాకు ముందే పండుగొచ్చినంత ఆనందం వెల్లివిరిసింది. మ్యాచులు జరుగుతున్నంత సేపూ టీవీలకతుక్కుపోయిన క్రీడాభిమానులు రకరకాలుగా పండుగ చేసుకున్నారు. తలోతీరుగా స్పందించారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం ‘ఆట ఆపరేషన్ సింధూర్ ని తలపించిందని’ కామెంట్ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు అటు ఇటు దగ్గరగా ఉండవచ్చు కానీ, ప్రధాని స్థాయి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకోవడమే అవుతుందా? ఆలోచించాలి. ఆటను యుద్ధంతో పోల్చడమనే సరళి భవిష్యత్ భారతానికి మంచి చేయకపోచ్చు.

అయితే, క్రికెట్ ఆటకు, సిందూర్ యుద్ధానికి తేడాలున్నాయి. క్రికెట్ ఒక ఆట మాత్రమే. ఆ ఆటలోనూ, ఏ ఆటలోనూ గెలుపోటములు శాశ్వతం కాదు. ఇవ్వాళ వరసగా గెలిచిన భారతే, విధి వశాత్తు, పర్ఫార్మెన్స్ పరంగా రేపు ఓటమి చెందితే, ఒకవేళ మొన్నటి ఏదో ఒక మ్యాచులో మనం ఓడిపోయి ఉంటే? మనలాంటి పరిస్థితే పాక్ ఆటగాళ్ళకు, ఇవ్వాళ వాళ్ళలాంటి పరిస్థితే మన ఆటగాళ్ళకు ఆపాదించబడాల్సిందేనా? ఆలోచించాలి.

అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? క్రీడాకారులు కూడా మామూలు మనుషులే. వారికీ దేశం, దేశభక్తి వంటి భోవోద్వేగాలుంటాయి. కాదనలేం. ఆ నిర్ణయాలు క్రీడాకరులవి లేదా జట్టు మేనేజ్ మెంట్ వి లేదా భారత్ వి ఎవరివైనా, కానీ ఆటల్లో కరచాలనం చేయకపోవడం ఒక నిరసనగా చూడొచ్చు. కానీ కరచాలనం కూడా చేయకుండా మనం ఆడుతున్నామా? భౌతిక యుద్ధం చేస్తున్నామా? ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లోనూ వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ముందు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా? లేదా? మరి ఆ మర్యాద క్రీడల్లో ఉండకూడదా? అదే పాకిస్తాన్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి చేతుల మీదుగా కప్ ను తీసుకోవడానికి నిరాకరించడం మరోవిధమైన నిరసనే. అయితే, మనతో ఓడిన వాడి చేతుల మీదుగా గెలిచిన కప్ అందుకుంటే? ఎలా ఉండేది? మరింత గర్వంగా గెలుపునుకు ప్రతీకగా ఉండేదేమో!? అసలు క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగేలా మనం ఎందుకు ప్రవర్తించాలి? క్రీడల ద్వారా దాయాదితో శత్రుత్వాన్ని మరింతగా ఎందుకు పెంచుకోవాలి? అంతేగాక, క్రీడలపై రాజకీయాల ప్రభావం అంత మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దాయాదుల మధ్య క్రికెట్ పోటీలో భావోద్వేగాలు ఆటకు మించినవిగా కనిపించడం క్రికెట్ కే కాదు, రెండు దేశాల మధ్య రేపటి సంబంధాలకు కూడా ఇబ్బంది కలిగించేవే. అలాగని పాకిస్తాన్ నో, దాని ఆగడాలనో సమర్థించ లేం. అది పడగ విప్పినప్పుడల్లా తిప్పి కొట్టాల్సిందే. ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం?

ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి. క్రీడాకారులంతా జట్టుగా అన్ని విభాగాల్లోనూ రాణించారు. తడబడ్డా కూడా కుదురుకున్నారు. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, మిడిలార్డర్ లో తిలక్ వర్మ, సంజు శాంసన్ లు, బౌలింగ్ లో మిడిల్ ఓవర్లలో స్పిన్ త్రయం కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ లు ప్రత్యర్థులను కట్టడి చేసిన తీరు ముచ్చటేసింది. ఫైనల్ లో తిలక్ ఆటను తిలకించడానికి రెండు కళ్ళు సరిపోలేదు. క్రికెటర్లు ఆటలో ప్రజల మనసుల్ని గెలిచారు.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News