Friday, July 17, 2026
24.5 C
Hyderabad

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే!

ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.

అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం? ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి. ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే. గెలుపోటములను సమానంగా తీసుకోవాలనీ అంటారు. నిజమే కానీ, ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.

యుద్ధం-క్రీడ వేర్వేరుగా కనిపిస్తున్నా, రెండూ ఒకటే. అందుకే యుద్ధ క్రీడ అన్నారు. యుద్ధ తంత్రాలు, ఎత్తుగడలు, గెలుపు-ఓటములు, రెండింటా ఒకటే. ఒక్క చంపడాలు, చంపుకోవడాలు, రక్తపాతం తప్ప. యుద్ధంలో చావులుండవచ్చు కానీ, ఒక్కోసారి ఆటల్లో ఓటమి చావుకంటే భయంకరంగా ఉంటుంది. అదీ ఒక దేశం తరపున ఆడినప్పుడు ఆ దేశ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకునుగుణంగా గెలిచి తీరాల్సి వస్తుంది. టీ20 ఆసియా కప్ లో వరసగా మూడు మ్యాచుల్లోనూ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆ విధంగానే పాకిస్తాన్ మీద అదే వేదికపై పదే పదే విజయం సాధించడం ద్వారా 150 కోట్ల భారతీయుల మనుసుల్లోని భావోద్వేగాల్ని గెలిచారు. బలాన్ని చాటారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత, భారత్ పాక్ పై చేసిన దాడులు ఆ దేశాన్ని దిమ్మతిరిగేలా చేశాయి. అదే తరహాలో భారత క్రికెట్ జట్టు దుబాయ్ లో జరిగిన అసియా కప్ పొట్టి ఫార్మెట్ లో పాకిస్తాన్ పై అటు బ్యాట్ తో ఇటు బాల్ తో దాడులు చేసి తుత్తునియలు చేశారు. పాక్ పై భారత్ కు ఓటమి లేదని, ఎప్పటికైనా పాక్ ఓడాల్సిందేనని ప్రపంచానికి చాటారు. భారత్ లో దసరాకు ముందే పండుగొచ్చినంత ఆనందం వెల్లివిరిసింది. మ్యాచులు జరుగుతున్నంత సేపూ టీవీలకతుక్కుపోయిన క్రీడాభిమానులు రకరకాలుగా పండుగ చేసుకున్నారు. తలోతీరుగా స్పందించారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం ‘ఆట ఆపరేషన్ సింధూర్ ని తలపించిందని’ కామెంట్ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు అటు ఇటు దగ్గరగా ఉండవచ్చు కానీ, ప్రధాని స్థాయి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకోవడమే అవుతుందా? ఆలోచించాలి. ఆటను యుద్ధంతో పోల్చడమనే సరళి భవిష్యత్ భారతానికి మంచి చేయకపోచ్చు.

అయితే, క్రికెట్ ఆటకు, సిందూర్ యుద్ధానికి తేడాలున్నాయి. క్రికెట్ ఒక ఆట మాత్రమే. ఆ ఆటలోనూ, ఏ ఆటలోనూ గెలుపోటములు శాశ్వతం కాదు. ఇవ్వాళ వరసగా గెలిచిన భారతే, విధి వశాత్తు, పర్ఫార్మెన్స్ పరంగా రేపు ఓటమి చెందితే, ఒకవేళ మొన్నటి ఏదో ఒక మ్యాచులో మనం ఓడిపోయి ఉంటే? మనలాంటి పరిస్థితే పాక్ ఆటగాళ్ళకు, ఇవ్వాళ వాళ్ళలాంటి పరిస్థితే మన ఆటగాళ్ళకు ఆపాదించబడాల్సిందేనా? ఆలోచించాలి.

అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? క్రీడాకారులు కూడా మామూలు మనుషులే. వారికీ దేశం, దేశభక్తి వంటి భోవోద్వేగాలుంటాయి. కాదనలేం. ఆ నిర్ణయాలు క్రీడాకరులవి లేదా జట్టు మేనేజ్ మెంట్ వి లేదా భారత్ వి ఎవరివైనా, కానీ ఆటల్లో కరచాలనం చేయకపోవడం ఒక నిరసనగా చూడొచ్చు. కానీ కరచాలనం కూడా చేయకుండా మనం ఆడుతున్నామా? భౌతిక యుద్ధం చేస్తున్నామా? ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లోనూ వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ముందు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా? లేదా? మరి ఆ మర్యాద క్రీడల్లో ఉండకూడదా? అదే పాకిస్తాన్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి చేతుల మీదుగా కప్ ను తీసుకోవడానికి నిరాకరించడం మరోవిధమైన నిరసనే. అయితే, మనతో ఓడిన వాడి చేతుల మీదుగా గెలిచిన కప్ అందుకుంటే? ఎలా ఉండేది? మరింత గర్వంగా గెలుపునుకు ప్రతీకగా ఉండేదేమో!? అసలు క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగేలా మనం ఎందుకు ప్రవర్తించాలి? క్రీడల ద్వారా దాయాదితో శత్రుత్వాన్ని మరింతగా ఎందుకు పెంచుకోవాలి? అంతేగాక, క్రీడలపై రాజకీయాల ప్రభావం అంత మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దాయాదుల మధ్య క్రికెట్ పోటీలో భావోద్వేగాలు ఆటకు మించినవిగా కనిపించడం క్రికెట్ కే కాదు, రెండు దేశాల మధ్య రేపటి సంబంధాలకు కూడా ఇబ్బంది కలిగించేవే. అలాగని పాకిస్తాన్ నో, దాని ఆగడాలనో సమర్థించ లేం. అది పడగ విప్పినప్పుడల్లా తిప్పి కొట్టాల్సిందే. ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం?

ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి. క్రీడాకారులంతా జట్టుగా అన్ని విభాగాల్లోనూ రాణించారు. తడబడ్డా కూడా కుదురుకున్నారు. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, మిడిలార్డర్ లో తిలక్ వర్మ, సంజు శాంసన్ లు, బౌలింగ్ లో మిడిల్ ఓవర్లలో స్పిన్ త్రయం కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ లు ప్రత్యర్థులను కట్టడి చేసిన తీరు ముచ్చటేసింది. ఫైనల్ లో తిలక్ ఆటను తిలకించడానికి రెండు కళ్ళు సరిపోలేదు. క్రికెటర్లు ఆటలో ప్రజల మనసుల్ని గెలిచారు.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News