Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

విమోచనంపై ఎందుకింత విముఖత!?|EDITORIAL

చరిత్రను విస్మరించిన జాతి లేదా దేశం ముందడుగేయడం కష్టం. తెలంగాణ విమోచనమా? విలీనమా? విద్రోహమా? అన్న అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ విమోచన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవంగా, ఎవరికివారు ఇష్టం వచ్చిన రీతిగా నిర్వహిస్తున్నారు. పార్టీల స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా అసలు చరిత్ర మరుగున పడుతోంది. మన భవిష్యత్ తరాలకు వాస్తవ చరిత్ర అందకుండా, తెలియకుండా పోతోంది. ఇంకొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. ఒక చారిత్రక సంఘటనపై ఇన్ని రకాలుగా కార్యక్రమం నిర్వహించడం విధి విపరీత వైచిత్రి.

విమోచనోత్సవంతో లబ్ది పొందాలన్న భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీనిపై బలంగా నిలబడ్డారు. అధికారికంగా విమోచనోత్సవం జరపాలని కోరుతున్నారు. అయినా అధికార కాంగ్రెస్‌ ఇందుకు సుముఖంగా లేదు. కేవలం ప్రజాపాలనతో విమోచన దినోత్సవాన్ని గట్టెక్కించాలని చూస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కేవలం సమైక్యతా దినోత్సవం పేరిట ముగించారు. ఇప్పుడు ప్రజాపాలనతో సాగిస్తున్నారు. కేవలం నాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ పెట్టిన పార్టీ, ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలు నానా గడ్డీ కరుస్తున్నాయనడానికి విమోచన దినోత్సవాన్ని ఉదాహరణగా చెప్పుకోచ్చు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేర్వేరుగా… వేర్వేరు పేర్లతో ఉత్సవాలను నిర్వహించడం కూడా విచిత్రమే!

నిజాం రాజరికం నుంచి విముక్తమైన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు జరుపుకోవడం నేటివరకు అధికారికంగా జరగలేదు. కేవలం మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిపేవారు. అనూహ్యంగా కేంద్రం విమోచనోత్సవాలు జరపాలని మూడేళ్ల క్రితం నిర్ణయించడంతో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ యేడు యథావిధిగానే బీజేపీ తనవంతుగా కార్యక్రమం చేపట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈయేడు అతిథిగా వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం పేరిట జెండా వందనం నిర్వహిస్తోంది. కేంద్రం మాత్రం సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విమోచనోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీంతో హైదరాబాద్‌ లో జరిగే ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఎగురేస్తారని అన్నారు. రాంజీ గోండు త్యాగానికి ప్రతిఫలం, తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ గుర్తు చేస్తోంది. ఒకే చెట్టుకు అత్యంత కిరాతకంగా వెయ్యి మంది తెలంగాణ ప్రజలను ఒకేసారి ఉరితీసిన నిర్మల్‌ వెయ్యి ఉరుల మర్రి ఘాతుకంలో అమరవీరులైన మన పూర్వీకులకు నివాళులు అర్పించనుంది. నిజాం రజాకార్లపై, బ్రిటిష్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేసిన మన రాంజీగోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొందాం, తెలంగాణ చరిత్రను తరువాతి తరానికి అందిద్దాం. అన్న నినాదంతో బీజేపీ ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ యేడు కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచనోత్సవాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు.

నిజానికి తెలంగాణ విముక్తి కోసం ఎందరో పోరాడారు. ఎందరో మహిళలు తమ మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. రజాకార్ల దాష్టీకానికి ఎందరో బలయ్యారు. సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్‌ ఖాన్‌, షోయబుల్లాఖాన్‌, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావ్‌ పవార్‌, నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. అలాగే ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా చరిత్రను అందుబాటులోకి తీసుకుని రావాలి. పాఠ్యాంశాలుగా ముద్రించాలి.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోవడానికి పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనమే కారణం. ఘనమైన తెలంగాణ చరిత్రను మరుగున పడేసే ప్రయత్నాలు సరికాదు. ఏటా విమోచనోత్సవంపై జోరుగా వాద ప్రతివాదనలు, విమర్శలు సాగుతుండేవి. అయినా తెలంగాణలో కూడా విమోచనో త్సవాలకు మోక్షం దక్కలేదు. ఈ ఉత్సవాలు జరపాలంటేనే ఎందుకనో తెలంగాణ పాలకులు విముఖత చూపుతూ వచ్చారు. తెలంగాణకు ముందు విమోచనోత్సవాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తప్పమరోటి జరిగేది కాదు. దేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్ర మైనప్పటికీ నాటి హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇంకా విముక్తి పొందలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించడం ద్వారా హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది.

బైరాన్‌పల్లి, పరకాల ఘటనలను ఎలా మరచి పోగలం. వందల మందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. గ్రామాలను లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. భారతదేశానికి స్వాతంత్యర్ర వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక పరకాల ప్రజలపై హత్యాకాండకు పాల్పడి మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన నాటి ఘటన నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాల్సి ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచాలి. అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News