Monday, March 16, 2026
29.3 C
Hyderabad

విమోచనంపై ఎందుకింత విముఖత!?|EDITORIAL

చరిత్రను విస్మరించిన జాతి లేదా దేశం ముందడుగేయడం కష్టం. తెలంగాణ విమోచనమా? విలీనమా? విద్రోహమా? అన్న అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ విమోచన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవంగా, ఎవరికివారు ఇష్టం వచ్చిన రీతిగా నిర్వహిస్తున్నారు. పార్టీల స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా అసలు చరిత్ర మరుగున పడుతోంది. మన భవిష్యత్ తరాలకు వాస్తవ చరిత్ర అందకుండా, తెలియకుండా పోతోంది. ఇంకొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. ఒక చారిత్రక సంఘటనపై ఇన్ని రకాలుగా కార్యక్రమం నిర్వహించడం విధి విపరీత వైచిత్రి.

విమోచనోత్సవంతో లబ్ది పొందాలన్న భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీనిపై బలంగా నిలబడ్డారు. అధికారికంగా విమోచనోత్సవం జరపాలని కోరుతున్నారు. అయినా అధికార కాంగ్రెస్‌ ఇందుకు సుముఖంగా లేదు. కేవలం ప్రజాపాలనతో విమోచన దినోత్సవాన్ని గట్టెక్కించాలని చూస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కేవలం సమైక్యతా దినోత్సవం పేరిట ముగించారు. ఇప్పుడు ప్రజాపాలనతో సాగిస్తున్నారు. కేవలం నాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ పెట్టిన పార్టీ, ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలు నానా గడ్డీ కరుస్తున్నాయనడానికి విమోచన దినోత్సవాన్ని ఉదాహరణగా చెప్పుకోచ్చు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేర్వేరుగా… వేర్వేరు పేర్లతో ఉత్సవాలను నిర్వహించడం కూడా విచిత్రమే!

నిజాం రాజరికం నుంచి విముక్తమైన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు జరుపుకోవడం నేటివరకు అధికారికంగా జరగలేదు. కేవలం మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిపేవారు. అనూహ్యంగా కేంద్రం విమోచనోత్సవాలు జరపాలని మూడేళ్ల క్రితం నిర్ణయించడంతో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ యేడు యథావిధిగానే బీజేపీ తనవంతుగా కార్యక్రమం చేపట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈయేడు అతిథిగా వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం పేరిట జెండా వందనం నిర్వహిస్తోంది. కేంద్రం మాత్రం సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విమోచనోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీంతో హైదరాబాద్‌ లో జరిగే ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఎగురేస్తారని అన్నారు. రాంజీ గోండు త్యాగానికి ప్రతిఫలం, తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ గుర్తు చేస్తోంది. ఒకే చెట్టుకు అత్యంత కిరాతకంగా వెయ్యి మంది తెలంగాణ ప్రజలను ఒకేసారి ఉరితీసిన నిర్మల్‌ వెయ్యి ఉరుల మర్రి ఘాతుకంలో అమరవీరులైన మన పూర్వీకులకు నివాళులు అర్పించనుంది. నిజాం రజాకార్లపై, బ్రిటిష్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేసిన మన రాంజీగోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొందాం, తెలంగాణ చరిత్రను తరువాతి తరానికి అందిద్దాం. అన్న నినాదంతో బీజేపీ ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ యేడు కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచనోత్సవాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు.

నిజానికి తెలంగాణ విముక్తి కోసం ఎందరో పోరాడారు. ఎందరో మహిళలు తమ మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. రజాకార్ల దాష్టీకానికి ఎందరో బలయ్యారు. సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్‌ ఖాన్‌, షోయబుల్లాఖాన్‌, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావ్‌ పవార్‌, నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. అలాగే ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా చరిత్రను అందుబాటులోకి తీసుకుని రావాలి. పాఠ్యాంశాలుగా ముద్రించాలి.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోవడానికి పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనమే కారణం. ఘనమైన తెలంగాణ చరిత్రను మరుగున పడేసే ప్రయత్నాలు సరికాదు. ఏటా విమోచనోత్సవంపై జోరుగా వాద ప్రతివాదనలు, విమర్శలు సాగుతుండేవి. అయినా తెలంగాణలో కూడా విమోచనో త్సవాలకు మోక్షం దక్కలేదు. ఈ ఉత్సవాలు జరపాలంటేనే ఎందుకనో తెలంగాణ పాలకులు విముఖత చూపుతూ వచ్చారు. తెలంగాణకు ముందు విమోచనోత్సవాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తప్పమరోటి జరిగేది కాదు. దేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్ర మైనప్పటికీ నాటి హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇంకా విముక్తి పొందలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించడం ద్వారా హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది.

బైరాన్‌పల్లి, పరకాల ఘటనలను ఎలా మరచి పోగలం. వందల మందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. గ్రామాలను లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. భారతదేశానికి స్వాతంత్యర్ర వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక పరకాల ప్రజలపై హత్యాకాండకు పాల్పడి మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన నాటి ఘటన నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాల్సి ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచాలి. అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News