Thursday, August 20, 2026
30.2 C
Hyderabad

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య నెలకొన్న విభేదాలు తాజాగా మరోసారి తెరపైకి వచ్చాయి. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఆమె ఒంటరిగానే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక కాంగ్రెస్‌లోని కొందరు మంత్రులు, ముఖ్య నేతల మద్దతు ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ నెల 13న మంత్రి కొండా సురేఖ రాసినట్లు ప్రచారంలోకి వచ్చిన ‘పాలించే ప్రభువు కాదు.. కలిసి పనిచేసే గుంపుమేస్త్రీ’ అనే వ్యాఖ్యలతోనే రేవంత్ ప్రభుత్వ పనితీరుపై పరోక్ష విమర్శలు మొదలయ్యాయనే చర్చ జరిగింది. ఆ తర్వాత కేవలం మూడు రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు కొండా సురేఖ గైర్హాజరు కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత వారం రోజులు కూడా గడవకముందే కొండా సుష్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది.

రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు స్పందిస్తే ఆయన అవినీతి చిట్టాను బయటపెడతానంటూ సుష్మిత హెచ్చరించడం సంచలనంగా మారింది. పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బీసీ మంత్రుల ఫొటోలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని కూడా ఆమె నిలదీశారు.

అంతేకాకుండా రూ.200 కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి ఎలా కట్టబెడతారని సుష్మిత ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రేవంత్ రెడ్డి వెంట ఉన్న ‘పొంగు’ ఎంతోకాలం నిలవదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. మరోవైపు మేడారం జాతర సమయంలో మంత్రి సీతక్క, పొంగులేటి వర్గాలతో కొండా సురేఖకు విభేదాలు మొదలయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ ఉంది.

గతంలోనూ సుష్మిత రేవంత్ వర్గంపై ఆరోపణలు చేసినప్పటికీ పెద్దగా స్పందించని కాంగ్రెస్ నాయకత్వం, తాజా పరిణామాలపై మాత్రం క్రమశిక్షణ చర్యలకు దిగింది. కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ వివరణ కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనలో సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే కొండా కుటుంబం నుంచి వరుసగా వస్తున్న విమర్శల వెనుక మరికొందరు కాంగ్రెస్ మంత్రులు, నాయకుల మద్దతు ఉందన్న ఊహాగానాలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. షబ్బీర్ అలీని ఎందుకు పక్కన పెట్టారు? కొండా మురళికి ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదు? సీతా దయాకర్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చారు? వంటి ప్రశ్నలు సుష్మిత లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ సాగుతోంది.

మొత్తంగా చూస్తే, ఈ వ్యవహారం కేవలం ‘టీ కప్పులో తుఫాను’గానే ముగుస్తుందా? లేక ‘అసలు కాంగ్రెస్–కొసరు కాంగ్రెస్’ మధ్య ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా.. ఉద్దేశపూర్వకమా? అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలే సమాధానం చెప్పాల్సి ఉంది.

Latest News

అవును..గ వాల్లు మల్లా మనువాడిండ్రు!?|ADUGU TRENDS

గ వాల్లు ఇప్పటికే ఆలుమొగలు. గవాల్లకు పిల్లలు గూడా ఉన్నరు. గా పిల్లలు సదువుకుంటాండ్రు. గివీల్లు సంసారం కూడా శేసుకుంటాండ్రు. అయినా గవాల్లు కొత్తగా మల్లా మనువాడిండ్రు. మూడుమల్లేసుకున్నరు. ఏడడుగులు నడిసిండ్రు. గట్ల...

బీజేపీ ముందున్న సవాళ్ళివే!?|EDITORIAL

బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం,...

ఆగస్టు 20, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.అష్టమి రాత్రి 09.33 వరకు ఉపరి నవమి నక్షత్రం విశాఖ ఉదయం 10.50 వరకు ఉపరి అనురాధ యోగం బ్రహ్మ ఉదయం 06.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 08.54 వరకు ఉపరి బవ రాహుకాలం...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News