Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

మత్తుమాఫియాపై ముప్పేట దాడి!|EDITORIAL

మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. నిఘా పెరిగింది. అక్కడక్కడా అడపాదడపా గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముఠాలను పట్టుకుంటున్నారు. కానీ, ఆ మాఫియా గుట్టు రట్టవుతున్నా, మట్టు పెట్టడమే సాధ్యమవడంలేదు. ఎక్కడో ఒకచోట పట్టుబడితే, అంతకుమించి మరోచోట రవాణా కొనసాగుతోంది. ఇది కేవలం చట్టానికి మాత్రమే కాదు, సమాజానికే సవాల్ గా మారిన సంక్షోభం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఏపీలోని మదనపల్లెలో బాలికపై జరిగిన దారుణం, నెల్లూరులో ప్రజాకళాకారుడు పెంచలయ్య హత్య, తెలంగాణలోని నిజామాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై జరిగిన దాడి, ఆమె మరణం వంటి సంఘటనల వెనుక మత్తు మాఫియా దౌర్జన్యమే ప్రస్ఫుటమవుతోంది. మత్తు మనిషిలోని విచక్షణను హరించి, నేరానికి దారి తీస్తోందని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల పరిమాణం విపరీతంగా పెరిగింది. వేల కోట్ల విలువైన, లక్షల కిలోల మత్తు పదార్థాలు పట్టుపడుతున్నాయి. దీన్ని బట్టి మత్తు పదార్థాల వినియోగం ఏ స్థాయిలో విస్తరించిందో ఊహించవచ్చు. స్కూల్ ఏజీ పిల్లల నుంచి యువత వరకూ మత్తు బారిన పడుతున్నారన్న నివేదికలు భవిష్యత్తు సమాజంపై భయాందోళనలు కలిగిస్తున్నాయి. మత్తుకు బానిసైన యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు.

నిజానికి మత్తు, మాదకద్రవ్యాల సమస్యను కేవలం పోలీసు చర్యలతోనే ఎదుర్కోలేం. ఇంకా కఠిన చట్టాలు అవసరం. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర రవాణా మార్గాలపై నిఘా పెరగాలి. రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వంటి సంస్థలు సమగ్ర కార్యాచరణతో దూకుడు పెంచాలి.

ఈ దుష్ప్రభావానికి సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఈజీగా డబ్బు సంపాదన, నిరుద్యోగం, ఆకలి, అవసరాలు కూడా కారణాలు. వేగంగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలనే ఆశతో కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తరించాలి. యువతకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కేవలం శిక్షలతో సమస్యను అణచివేయడం సాధ్యం కాదు. ఇవ్వాళ జైలుకెల్లిన వాళ్లు రేపు విడుదలై తిరిగి అదే పనిలో నిమగ్నమవుతున్నారు.

ఇక మత్తుకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలి. ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సకాలంలో వైద్య సహాయం అందించాలి. మత్తు వినియోగం మొదట సరదాగా మొదలై, తరువాత శారీరక, మానసిక వ్యవస్థలను క్రమంగా దెబ్బతీస్తుంది. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పతనం జరుగుతోంది. కాబట్టి పునరావాస విధానాలు సమర్థంగా అమలవ్వాలి.

రాజకీయ వ్యవస్థ కూడా తన బాధ్యతను గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మత్తు ముఠాలకు రాజకీయ అండదండలు లభించడం నిజమైతే అత్యంత ప్రమాదకరం. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి మాదకద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉన్నవారిని వెలివేయాలి. ఈ విషయంలో రాజకీయం మించి సామాజిక ప్రయోజనం ప్రధానంగా నిలవాలి.

విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు అత్యవసరం. స్కూలు స్థాయిలోనే పిల్లలకు మత్తు ప్రమాదాలపై బోధించాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీల్లో నిఘా పెరగాలి. మీడియా సంచలనాత్మక వార్తలకే పరిమితం కాకుండా అవగాహన సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలి.

మాదకద్రవ్యాలపై సమాజం మొత్తం కలిసిరావాలి. సరఫరాను అరికట్టడమే కాదు, డిమాండ్‌ లేకుండా చేయాలి. ఉపాధి, అవగాహన, కఠిన చట్ట అమలు, పునరావాసం వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News