Monday, July 13, 2026
29.3 C
Hyderabad

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం ప్రజల జీవన విధానం, ప్రమాణాల్లో వచ్చిన మార్పునకు సంకేతం. అయితే, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, దిగుమతులపై ఆధారపడే వ్యవస్థ అవడం, దేశంలో గ్యాస్‌ భద్రతపై అప్పుడప్పుడూ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ లో యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా అంతరాయం కలగవచ్చనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాస్ వినియోగ స్థితి, నిల్వలు, భవిష్యత్ అవసరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషించుకోవడం అవసరం.

భారతదేశంలో ఎల్పీజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2004-05లో దేశంలో ఎల్పీజీ వినియోగం కేవలం 10.2 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, 2024-25 నాటికి ఇది 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే రెండు దశాబ్దాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. 2017లో 21.6 మి.మె.ట.గా ఉన్న వినియోగం 2025లో 31.3 మి.మె.ట.కి చేరి దాదాపు 44 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం దేశంలో 32.9 కోట్ల గృహ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ అందుబాటు 102.8 శాతానికి చేరినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ సదుపాయం దాదాపు చేరిందని చెప్పవచ్చు. ప్రతి నెల సగటు. దేశంలో 2.6 మి. మె. ట. ల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. కుటుంబాల వారీగా చూస్తే సాధారణ వినియోగదారులు ఏడాదికి సగటున 6–7 సిలిండర్లు వినియోగిస్తుండగా, పేద కుటుంబాలకు అందించే పథకాల కింద సగటు వినియోగం 4.5 సిలిండర్లుగా ఉంది.

ఎల్పీజీ వినియోగం దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా వేగంగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే ఎల్పీజీలో 60%-65% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చే సరఫరా కీలకం. ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగాగానే గాక, రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతి దేశంగా భారత్ నిలిచింది.

మధ్యప్రాచ్యంలో యుద్ధాలు లేదా ఉద్రిక్తతలకు సరఫరా మార్గాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ మార్గం ద్వారా వచ్చే సరఫరా నిలిచిపోతే దేశంలో తాత్కాలిక కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గడంతో వ్యాపారాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాణిజ్య రంగానికి సరఫరా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో గ్యాస్ నిల్వల పరిస్థితి కూడా అంతగా దీర్ఘకాలిక భద్రతను, భరోసాను ఇవ్వలేవనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వ సామర్థ్యం 16 రోజుల వినియోగానికి సరిపడే స్థాయిలో మాత్రమేనని పరిశ్రమ నివేదికలు చెబుతున్నాయి. అంటే దిగుమతులు నిలిచిపోయినా, సరఫరా ఆగిపోయినా, దేశం ఎక్కువకాలం నిల్వలపై ఆధారపడే పరిస్థితి లేదు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆదేశించడం, ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచడం, పరిశ్రమలకు వెళ్లే గ్యాస్‌ను కొంత మేర గృహ వినియోగానికి మళ్లించడం వంటి చర్యలు చేపట్టింది.

అయితే, దీర్ఘకాలికంగా చూస్తే మరికొన్ని చర్యలు అమలు చేయాల్సిన అగత్యం కనిపిస్తోంది. మొదటగా, ఎల్పీజీ దిగుమతులపై అధికంగా ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి. అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యామ్నాయ దిగుమతులకు పూనుకోవాలి. రెండవది, దేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక నెలకు పెరగాలి. మూడవది, గ్యాస్ వినియోగంలో సమర్థతను పెంచే చర్యలు అవసరం. స్మార్ట్ బుకింగ్ విధానాలు, నిల్వల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

నాలుగవది, ప్రత్యామ్నాయ శక్తి వనరులపై దృష్టి పెట్టాలి. బయోగ్యాస్, విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా గ్యాస్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు. గ్యాస్ వినియోగం అభివృద్ధికి సూచికగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తోంది. పెరుగుతున్న వినియోగానికి తగిన అన్ని ప్రత్యామ్నాయ శక్తి వనరులు లేకపోతే భవిష్యత్తులో మరింత సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే దేశ ఇంధన భద్రతకు భద్రత ఉంటుంది.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News