Wednesday, August 5, 2026
26.2 C
Hyderabad

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం, భాగస్వామ్యం అత్యవసరం!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

అభివృద్ధి లక్ష్యం ఎంత గొప్పదైనా, అది ప్రజావసరాలు తీర్చలేకపోతే, వారి జీవనాధారాలను దెబ్బతీస్తే ఆ అభివృద్ధి అర్థహీనమే. అమరావతి రాజధాని నిర్మాణం, ఔటర్ రింగు రోడ్ వంటి ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న భూసేకరణల నేపథ్యంలో రైతుల ఆందోళనలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే 32 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం, మరిన్ని దశల్లో మరింత భూసేకరణకు సిద్ధమవుతుండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చివేస్తోంది.

అమరావతి కోసం మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు, కౌలు చెల్లింపులు సకాలంలో అందకపోవడం ప్రధాన సమస్య. రాజధాని కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన రైతులు ఇప్పటికీ పూర్తి ప్రయోజనాలు పొందకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో మరిన్ని భూములను ఇవ్వాలని ప్రభుత్వం రైతుల మెడపై కత్తి పెట్టడం సహజంగానే రైతులకు వ్యతిరేకతకు దారితీస్తున్నాయి.

ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఔటర్ రింగు రోడ్ ప్రాజెక్ట్ విస్తృతి రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది. 250 మీటర్ల వెడల్పుతో, 189 కిలోమీటర్ల పొడవునా, ఈ రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు. గుంటూరు, ఎన్‌టిఆర్, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో విస్తరించే ఈ ప్రాజెక్ట్ వల్ల వేల ఎకరాల సారవంతమైన భూములను రైతులు కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలాంటి రహదారులు సాధారణంగా 60–70 మీటర్ల వెడల్పుతో నిర్మించబడుతున్న సందర్భంలో, అమరావతిలో 250 మీటర్ల విస్తృతి అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ ప్రాంతాల్లోని భూములు మూడు పంటలు పండించే అత్యంత సారవంతమైన కృష్ణా పరివాహక ప్రాంతాలకు చెందినవి. ఈ భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.1 కోటి నుండి రూ.2 కోట్లు వరకు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ, రైతులకు అందిస్తున్న పరిహారం ఈ విలువలకు ఏ మాత్రం దరిదాపుల్లో లేవు. భూమికి భూమి ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలు కూడా సరిగా అమలు కాలేదు.

భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం మరో ప్రధాన సమస్య. వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సచివాలయాల వద్ద సాధారణ సమాచారం మాత్రమే ప్రదర్శించడం వల్ల రైతుల్లో గందరగోళం నెలకొంది. ఏ రైతు భూమి ఎంత మేరకు సేకరించబడుతుందన్న స్పష్టత లేకపోవడం అనిశ్చితిని పెంచుతోంది.

2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించడం, సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడం, ప్రజల సమ్మతి పొందడం తప్పనిసరి. అయితే ఈ చట్టబద్ధమైన ప్రక్రియ అనేక ప్రాంతాల్లో అమలు కాలేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా కూడా భావించవచ్చు.

పర్యావరణ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత మార్గం కృష్ణా నది బఫర్ జోన్‌కు సమీపంగా ఉండటం వల్ల వరదల ప్రమాదం పొంచి ఉందని రైతులు కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ ప్రాంతాలు వరదలకు గురైన అనుభవం ఉన్న నేపథ్యంలో, ఇలాంటి ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరింత నష్టానికి దారితీయవచ్చన్న భయం సహజమే.

ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు “ఇంకెన్ని సార్లు త్యాగం చేయాలి?” అని ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబం పలు దశల్లో భూములు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, వారి జీవన విధానానికి, సామాజిక స్థితికి కూడా పెద్ద దెబ్బ.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాలి. కొత్త భూసేకరణకు ముందు పూర్తి పారదర్శకతతో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రాజెక్ట్ విస్తృతిని పునఃసమీక్షించి, అవసరమైతే 250 మీటర్లను 70 మీటర్లకు తగ్గించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా సరైన పరిహారం చెల్లించాలి.

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం, భాగస్వామ్యం అత్యవసరం. వారి గుండెల్లో భయం కాకుండా, భవిష్యత్తుపై విశ్వాసం నింపడం ప్రభుత్వ బాధ్యత.

Latest News

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News