అమెరికా, భారత్లలో ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్న అమెరికా తెలుగు సంఘం(ఆటా) కొత్తగా ఒక మెగా స్టార్టప్ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టింది. ఆటా వేడుకలు–2025లో భాగంగా ఐఐటీ హైదరాబాద్, భారత ప్రభుత్వ మైటీ స్టార్టప్ హబ్ (ఎం.ఎస్.హెచ్)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అమెరికా, భారత్కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థలు, యూఎస్ వ్యాపార యజమానులు, టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రొఫెసర్లు పాల్గొననున్నారు. స్టార్టప్లు డిసెంబర్ 6లోపు పిచ్ డెక్ను startups@ataworld.org కు పంపాలి. షార్ట్లిస్ట్ చేసిన పది స్టార్టప్లు డిసెంబర్ 13న ఐఐటీ హైదరాబాద్లో ప్రజెంటేషన్ ఇస్తాయి. మొదటి మూడు విజేతలకు నగదు బహుమతులు, అమెరికాలో జరిగే తదుపరి పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పది కంపెనీలకూ ఫండింగ్, మెంటర్షిప్ అందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి, ఇన్నోవేషన్ డీన్ ప్రొఫెసర్ మల్లా రెడ్డి సమన్వయం చేస్తుండగా, సీఈఓ డా. పన్నీర్సెల్వం, మదనగోపాల్ కీలకోపన్యాసం అందించనున్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్-ఎలక్ట్ సతీష్ రెడ్డి, స్టార్టప్ చైర్ లాక్స్ చేపూరి బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

