Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

MINORITY|మైనార్టీ ‘మంత్రాం’గం! CONGRESS|కాంగ్రెస్ పన్నాగం

JUBILEE HILLS|జూబ్లీ గెలుపే కీలకం
MUSLIMS|ముస్లీంల ఓట్లకై గాలం
రేపు మంత్రిగా AZAHARUDDIN|అజహర్ ప్రమాణం?
AIMIM|ఎంఐఎం వ్యతిరేకం
అజహర్ కే అధిష్టానం
అజ్జూకే సై అన్న సీఎం|CM|REVANTH REDDY

హైదరాబాద్, అక్టోబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీమిండియా పూర్వ కెప్టెన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజహరుద్దీన్ కి కలిసొచ్చింది. జూబ్లీలో మైనార్టీ ఓట్లే కీలకం కావడం అజహర్ ని కీలకం చేసింది. గతంలో జూబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహర్, పార్టీ మాట మీద ఈసారి నవీన్ కోసం పోటీ నుంచి తప్పుకోవడం ఆయన సిన్సియార్టీకి కారణమైంది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే ఆయనను మంత్రి పదవి వరించనుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ చేయని ఎంఐఎం వ్యతిరేకించినా, సీఎం రేవంత్ రెడ్డి సై అనగా, కాంగ్రెస్ అధిష్టానం అజహరుద్దీన్ నే ఎంచుకుంది. దీంతో అజ్జూ భాయ్ రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దివంగతులవడంతో అనివార్యమైన జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కూడా రెండు ప్రధాన పార్టీలకు అనివార్యంగా మారింది. జూబ్లీని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు, గెలవడం అధికార కాంగ్రెస్ కు ప్రాధామ్యంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు రాష్ట్రంలోని తమ కేడర్ మొత్తాన్ని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మోహరించాయి. కాంగ్రెస్ డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున బాధ్యతలు అప్పగించిగా, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరినీ బీఆర్ఎస్ జూబ్లీలో దింపింది. ఇదే సమయంలో కులాలు, మతాల వారీగా ఓట్లు కీలకం కావడంతో ఆయా ఓట్లు లక్ష్యంగా ఆ రెండు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ముస్లీంలకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని, రెండేండ్లు పూర్తి కావస్తున్నా, మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శించింది. ఇదే అదనుగా కాంగ్రెస్ తమదైన శైలిలో మైనార్టీకి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.

జూబ్లీ హిల్స్ లో మతాలు, కులాల వారీగా ఓటర్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. ఎస్సీల ఓట్లు 28,350 కాగా, ఎస్సీల్లో మాదిగ ఓట్లు 15,693, మాల ఓట్లు 12657 ఉన్నాయి. లంబాడీల ఓట్లు 11364, క్రైస్తవుల ఓట్లు 19,396 ఉన్నాయి.

కీలకంగా మారిన ముస్లింల ఓట్లు
మొత్తం ఓట్లల్లో 25శాతానికి మించిన ఓట్లు ముస్లీంల ఓట్లే ఉన్నాయి. ఈ ఓటర్లను ఆకర్షించడం అన్ని పార్టీలకు ముఖ్యమైంది. బీజేపీకి ఎలాగూ పడని ముస్లింల ఓట్లు గతంలో బీఆర్ఎస్ కు పడ్డాయి. కానీ ఈసారి ఎన్నికల్లో నవీన్ గతంలో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థి పోటీలో లేరు. మద్దతు కాంగ్రెస్ కు ప్రకటించినప్పటికీ, ఆ ఓట్లు ఎటు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ ముస్లింలకు ఏం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ముస్లింల ఓట్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పడింది.

గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లిచ్చినప్పటికీ పెద్దగా ఎవరూ గెలవలేకపోయారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో జూబ్లీ నుంచే పోటీ చేసిన అజహరుద్దీన్ 16వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ముస్లిం లెజిస్టేచర్లలో కనీసం ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. దీంతో రెండేండ్లు కావస్తున్నా ఎవరికీ అవకాశం రాలేదు.

పార్టీ ఆదేశం.. ఉప ఎన్నికకు దూరం
అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేయాలని భావించారు. కానీ ఆ స్థానం నవీన్ యాదవ్ కు దక్కింది. దీంతో అజహర్ ను ఎమ్మెల్సీని చేయాలని కోదండరామ్ 10తో కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అది పెండింగులో ఉంది. అయినప్పటికీ అజహర్ ను మంత్రిని చేయాలని సీఎం సహా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

అజ్జూ భాయక్ కే అవకాశం
ప్రస్తుత మంత్రివర్గంలో 15మంది మంత్రులుండగా, మరో ముగ్గురికి అవకాశం ఉంది. ప్రస్తుతం అజహరుద్దీన్ కు మాత్రమే మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని అజహర్ ని మంత్రిని చేసి, వచ్చే 6 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో అజహర్ ని గెలిపించాలని పార్టీ భావిస్తోంది.
కాగా, మొదటి సారి 12మంది మంత్రులు ప్రమాణం చేయగా, ఇటీవల ముగ్గురికి అవకాశం దక్కింది. మరో ముగ్గురికి ఉన్న అవకాశాల్లో ఇప్పుడు అజహర్ మంత్రి అవుతున్నారు. మరో రెండు ఖాళీలను నింపడానికి సామాజికి, ప్రాంతీయ సమీకరణలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రస్థానమిలా
టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ ఆడిన అజహర్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిఓడిపోయారు. అజహరుద్దీన్‌ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ఇప్పుడు ఏకంగా మంత్రి అవుతున్నారు. కాగా, 28ననే అజహర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ గా ఉండాల్సిందిగా సీఎం అజహర్ ను కోరినట్లు తెలిసింది.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News