Friday, March 13, 2026
24.2 C
Hyderabad

MINORITY|మైనార్టీ ‘మంత్రాం’గం! CONGRESS|కాంగ్రెస్ పన్నాగం

JUBILEE HILLS|జూబ్లీ గెలుపే కీలకం
MUSLIMS|ముస్లీంల ఓట్లకై గాలం
రేపు మంత్రిగా AZAHARUDDIN|అజహర్ ప్రమాణం?
AIMIM|ఎంఐఎం వ్యతిరేకం
అజహర్ కే అధిష్టానం
అజ్జూకే సై అన్న సీఎం|CM|REVANTH REDDY

హైదరాబాద్, అక్టోబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీమిండియా పూర్వ కెప్టెన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజహరుద్దీన్ కి కలిసొచ్చింది. జూబ్లీలో మైనార్టీ ఓట్లే కీలకం కావడం అజహర్ ని కీలకం చేసింది. గతంలో జూబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహర్, పార్టీ మాట మీద ఈసారి నవీన్ కోసం పోటీ నుంచి తప్పుకోవడం ఆయన సిన్సియార్టీకి కారణమైంది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే ఆయనను మంత్రి పదవి వరించనుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ చేయని ఎంఐఎం వ్యతిరేకించినా, సీఎం రేవంత్ రెడ్డి సై అనగా, కాంగ్రెస్ అధిష్టానం అజహరుద్దీన్ నే ఎంచుకుంది. దీంతో అజ్జూ భాయ్ రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దివంగతులవడంతో అనివార్యమైన జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కూడా రెండు ప్రధాన పార్టీలకు అనివార్యంగా మారింది. జూబ్లీని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు, గెలవడం అధికార కాంగ్రెస్ కు ప్రాధామ్యంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు రాష్ట్రంలోని తమ కేడర్ మొత్తాన్ని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మోహరించాయి. కాంగ్రెస్ డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున బాధ్యతలు అప్పగించిగా, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరినీ బీఆర్ఎస్ జూబ్లీలో దింపింది. ఇదే సమయంలో కులాలు, మతాల వారీగా ఓట్లు కీలకం కావడంతో ఆయా ఓట్లు లక్ష్యంగా ఆ రెండు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ముస్లీంలకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని, రెండేండ్లు పూర్తి కావస్తున్నా, మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శించింది. ఇదే అదనుగా కాంగ్రెస్ తమదైన శైలిలో మైనార్టీకి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.

జూబ్లీ హిల్స్ లో మతాలు, కులాల వారీగా ఓటర్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. ఎస్సీల ఓట్లు 28,350 కాగా, ఎస్సీల్లో మాదిగ ఓట్లు 15,693, మాల ఓట్లు 12657 ఉన్నాయి. లంబాడీల ఓట్లు 11364, క్రైస్తవుల ఓట్లు 19,396 ఉన్నాయి.

కీలకంగా మారిన ముస్లింల ఓట్లు
మొత్తం ఓట్లల్లో 25శాతానికి మించిన ఓట్లు ముస్లీంల ఓట్లే ఉన్నాయి. ఈ ఓటర్లను ఆకర్షించడం అన్ని పార్టీలకు ముఖ్యమైంది. బీజేపీకి ఎలాగూ పడని ముస్లింల ఓట్లు గతంలో బీఆర్ఎస్ కు పడ్డాయి. కానీ ఈసారి ఎన్నికల్లో నవీన్ గతంలో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థి పోటీలో లేరు. మద్దతు కాంగ్రెస్ కు ప్రకటించినప్పటికీ, ఆ ఓట్లు ఎటు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ ముస్లింలకు ఏం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ముస్లింల ఓట్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పడింది.

గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లిచ్చినప్పటికీ పెద్దగా ఎవరూ గెలవలేకపోయారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో జూబ్లీ నుంచే పోటీ చేసిన అజహరుద్దీన్ 16వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ముస్లిం లెజిస్టేచర్లలో కనీసం ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. దీంతో రెండేండ్లు కావస్తున్నా ఎవరికీ అవకాశం రాలేదు.

పార్టీ ఆదేశం.. ఉప ఎన్నికకు దూరం
అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేయాలని భావించారు. కానీ ఆ స్థానం నవీన్ యాదవ్ కు దక్కింది. దీంతో అజహర్ ను ఎమ్మెల్సీని చేయాలని కోదండరామ్ 10తో కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అది పెండింగులో ఉంది. అయినప్పటికీ అజహర్ ను మంత్రిని చేయాలని సీఎం సహా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

అజ్జూ భాయక్ కే అవకాశం
ప్రస్తుత మంత్రివర్గంలో 15మంది మంత్రులుండగా, మరో ముగ్గురికి అవకాశం ఉంది. ప్రస్తుతం అజహరుద్దీన్ కు మాత్రమే మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని అజహర్ ని మంత్రిని చేసి, వచ్చే 6 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో అజహర్ ని గెలిపించాలని పార్టీ భావిస్తోంది.
కాగా, మొదటి సారి 12మంది మంత్రులు ప్రమాణం చేయగా, ఇటీవల ముగ్గురికి అవకాశం దక్కింది. మరో ముగ్గురికి ఉన్న అవకాశాల్లో ఇప్పుడు అజహర్ మంత్రి అవుతున్నారు. మరో రెండు ఖాళీలను నింపడానికి సామాజికి, ప్రాంతీయ సమీకరణలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రస్థానమిలా
టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ ఆడిన అజహర్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిఓడిపోయారు. అజహరుద్దీన్‌ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ఇప్పుడు ఏకంగా మంత్రి అవుతున్నారు. కాగా, 28ననే అజహర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ గా ఉండాల్సిందిగా సీఎం అజహర్ ను కోరినట్లు తెలిసింది.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News