Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

పులులతోనే సకల మానవ జీవ వైవిధ్యం!|EDITORIAL

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, పర్యావరణం ఇవి మానవ మనుగడుకు అత్యావశ్యం. కానీ, వీటినే మానవుడు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. మానవుడు పుట్టిన నాటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. ఆ రకంగా చూస్తే మనిషే ప్రకృతికి, పర్యావరణానికి మొదటి శత్రువుగా మారాడు. ఇష్టానుసారంగా అడవులను నరికివేస్తూ, అడవుల్లోని జంతుజాలాన్ని వేటాడుతూ, వాటి ఉనికికే ప్రమాదకారిగా మారాడు. ఈ కారణంగా ఇప్పటికే అనేక జంతు జాతులు నశించాయి. మనం బతికితే చాలు, మిగతా ఏమయితే మనకేమిటన్న ధోరణి ప్రబలింది. ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహిత మానవ ప్రవర్తన వల్ల అడవులు మాత్రమే కాదు. అటవీ జంతు జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదపుటంచుల్లో మనం జీవిస్తున్నాం. పర్యావరణ హితమైన పులుల జాతి కూడా మానవ హింసాత్మక ప్రవుత్తికి బలైపోతోంది. దీన్ని గమనించిన 2010 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూలై 29న ’అంతర్జాతీయ పులుల దినోత్సవా’న్ని పాటించడం ఆనవాయితీగా పెట్టింది. అయితే అది ‘పులుల దినం’గా ఆ రోజుకే పరిమితమై పోవడమే విచారకరం.

పులులను కాపాడుకోవడం, వాటి ఆవాసాలను సంరక్షించుకోవడం, అక్రమ వేటలను మానుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రాధాన్యాన్ని వివరించడం, టైగర్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడం, టైగర్‌ రిజర్వులను నియంత్రించడం లాంటి అంశాల్లో సామాన్య జనాలకు అవగాహన కల్పించడానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలి. పిల్లుల జాతిలో అతి పెద్ద జంతువుగా పులికి పేరుంది. 2025 అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ‘మానవులు, పులులు సామరస్యంగా సహజీవనం చేయడం’ అనే ఇతివృత్తంగా పులుల సంరక్షణ బాధ్యతలను వివరించడం జరుగుతుంది.

కాగా, పులుల వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదు అవుతున్నది. వందేళ్ళ క్రితం లక్ష వరకు ఉన్న పులులు నేడు కేవలం 5,574 మాత్రమే ఉండడం విచారకరం. పులుల్లో చాలా అరుదైన జాతి రాయల్‌ బెంగాల్‌ -టైగర్‌. దీన్ని పెద్ద పులి అంటారు. ఇది మన దేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. బెంగాల్‌ టైగర్‌ గాండ్రింపు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఇవి రోజుకు దాదాపు 21 కిలోల మాంసాన్ని తింటాయి. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లల్ని పెడుతుంది. పులులు పుట్టిన 18 నెలల నుంచే వేటాడటం మొదలు పెడతాయి.

ఇటీవల ఆదిలాబాద్‌ కవ్వాల్‌ రక్షణకు జివో 49ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. కానీ గిరిజనుల జీవనానికి ఇది అడ్డంకిగా మారిందన్న ఆందోళనతో అది అమలుకు నోచుకోలేదు. నిజానికి జీవవైవిధ్యం కాపాడటంలో పులులదే కీలక పాత్ర. అడవిలో ఒక ప్రాంతంలో గడ్డి, మొక్కలను తినే జీవజాతులను వేటాడే పులి భయానికి కొంత కాలం మేసి, అక్కడి నుంచి అవి మరో చోటకి పోతాయి. పులులు తిరిగి వేటాడుతూ, ఆ చోటకు వెళతాయి. అవి మరో చోటకి… ఇలా వెళ్ళడం వల్ల మొదటి జంతు జీవాలు ఖాళీ చేసిన ప్రాంతం తిరిగి పూర్వ స్థితిని సంతరించుకుంటుంది. ఆ విధంగా అడవి సంరక్షించబడటమేగాక, జీవ వైవిధ్యం కాపాడపడుతుంది. రానురాను అడవులు ధ్వంసం అవుతుండటం, వేటాడటం వల్ల పులుల సంఖ్య తగ్గిపోతోంది. సాధారణంగా ఒక పులి సంచరించే ప్రాంతం చుట్టు-పక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్‌ పిరమిడ్లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి ఉండాలి. ఒక్కో పులి మనుగడకి 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

ప్రపంచంలోని పులుల సంఖ్యలో సగానికి పైగా మన దేశంలోనే ఉన్నాయి. 1972లోనే పులిని జాతీయ జంతువుగా ప్రకటించి, తర్వాతి ఏడాది నుంచే ప్రాజెక్ట్‌ -టైగర్‌ ను ప్రారంభించింది. టైగర్‌ ట్రాకర్స్‌ వ్యవస్థను పటిష్ట పరిచింది. పులు వేటని నిషేధించింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. దేశంలో 48 పులి అభయారణ్యాలను ఏర్పాటు- చేశారు. ఇండియన్‌ రైల్వే, టైగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ పేరుతో టూరిస్ట్‌ రైలు సేవలను కూడా ప్రారంభించింది. ఇందులో బాంధవగడ నేషనల్‌ పార్క్‌, కన్హా నేషనల్‌ పార్కులో సఫారీకి తీసుకెళ్తారు.

అయితే అడవులు అంతరించడం. అడవుల్లో నీటి కుంటలు లేకపోవడం వల్ల అవి ఊళ్లలోకి వస్తున్నాయి. నగరాల విస్తరణ, గ్లోబలైజేషన్‌ ప్రభావంతో రానురానూ అడవులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. అనేక టైగర్‌ జాతులు అంతరించి పోయాయి. పులుల సంఖ్య పెరగడం వల్ల పర్యావరణం పెరిగి, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. పులులు అంతరిపోవడానికి వేట, వాతావరణ మార్పులతోపాటు, పులి చర్మం, గోళ్లకు డిమాండ్‌ ఎక్కువ. చైనీస్‌ సంప్రదాయ వైద్యంలో పులుల గోళ్లు, పళ్లు, మీసాలను ఉపయోగిస్తారు. వాటి కోసం ఎక్కువ ధర చెల్లిస్తారు. అందుకే పులుల వేట, స్మగ్లింగ్‌ కూడా ఎక్కువైంది. దీంతో పులులు మాత్రమే కాక, ఇతర జీవులు కూడా అంతరిస్తున్నాయి. మానవ మనుగడ కోసం పులుల్ని, ఇతర జీవరాశులని సంరక్షించుకోడంతోపాటు అడవులు పెంచడం ఒక్కటే మార్గం.
…..

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News