Monday, August 10, 2026
27.5 C
Hyderabad

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు
ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం
సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత
సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD

న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన చలో సంసద్ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. అయితే, ఆ ఆందోళనల వెనక ఏదైనా కుట్ర దాగుందా? ఆ ఆందోళనల వెనుక ఉంది సీజీపీయేనా? మరెవ్వరైనానా? ఈ ఆందోళనకు ముందు ఏదైనా సీక్రెట్ యాప్ ద్వారా స్టూడెంట్స్ మొబిలైజేషన్ జరిగిందా? ఆ యాప్ లో ప్రాణాలకు తెగించాలని, ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా సిద్ధం కావాలనే సందేశాలు వెళ్ళాయా? వాటిని పంపిందెవరు? ఈ మొత్తం ఆందోళనల వెనుకు దాగి ఉన్నదేంటి? ఏమైనా కుట్ర కోణం ఉందా? ఇది ప్రభుత్వ అస్థిరతకు, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందా? అన్న కోణాల్లో ఢిల్లీ పోలీసులు, జాతీయ అత్యున్నత నిఘా విభాగాలు విచారిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆందోళన వెనుక ఏమైనా కుట్ర కోణాలున్నాయా? అని కూపీ లాగుతున్నారు.

నీట్ పేపర్ లీకేజీ తర్వాత సీజేపీ ఆవిర్భావం, ఆ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం, ఆ తర్వాత ఆ ఉద్యమాలకు రాజకీయ పార్టీల మద్దతు వంటి అంశాలు సహజంగానే జరిగిపోయాయి. అయితే, సోమవారం ఛలో సంసద్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ప్రభుత్వం, పోలీసులు, నిఘా విభాగాలకు అంతుచిక్కని రీతిలో జరిగింది. అనూహ్యంగా విద్యార్థులు పోటెత్తడం కూడా ప్రభుత్వానికి విస్మయం కలిగిస్తోంది. దానికి తోడు కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ఆసరా చేసుకోవడం, ప్రధాని ఇంటి ముందే మెరుపు ధర్నాకు దిగడం, రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటం, దేశ యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, ఇది భవిష్యత్తులో ప్రభుత్వంపై వ్యరేకతకు దారితీస్తుందా? అనే దాకా వెళ్ళింది. దీంతో ఈ విషయం వెనుక ఉన్నదేంటి? ఏమైనా కుట్ర జరుగుతోందా? అన్న అనుమానాలు సహజంగా ప్రభుత్వ పెద్దలకు కలిగినట్లుగా తెలుస్తోంది.

అయితే, సోమవారం నాటి చలో సంసద్ ఆందోళన సందర్భంగా, నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో రాజధానిలో హై టెన్షన్ నెలకొంది. మరోవైపు విపక్ష పార్టీలు ప్రధాని మోదీ నివాసం ఎదుట నిరసనకు దిగారు. ఇదే సమయంలో మరోసారి జంతర్ మంతర్ కు విద్యార్థులు చేరుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సర్వత్రా టెన్షన్.. టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటోంది.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయిని తెలిసింది. సీజేపీ నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపేసినప్పటికీ, పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయిట!? నిరసనకారులు పరస్పరం సందేశాలు పంపించుకున్నట్లు కొన్ని చాట్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినా, పరస్పరం సంప్రదింపులు కొనసాగించేందుకు బ్లూటూత్ ఆధారిత ‘సీక్రెట్ యాప్’ వినియోగించినట్లుగా తేటతెల్లమైంది. అంతేకాకుండా కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ప్రస్తుతం ఈ సందేశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చాట్‌ల వెనుక ఉన్న రహస్యం, వాటిని పంపిన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించే పక్రియ కొనసాగుతోంది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన చాట్‌లలో.. నిరసన ప్రాంతానికి చేరుకున్న తర్వాత మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవచ్చని ముందే హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా పోలీసులు నెట్‌వర్క్ జామర్లు ఉపయోగించారని, ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘నిరసన ప్రాంతానికి వెళ్లాక ఫోన్ నెట్‌వర్క్ ఉండకపోవచ్చు. అందుకే ముందుగానే అందరూ ఒకే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని కనెక్ట్ అవ్వాల’ని సూచించినట్లు పోలీసులు గుర్తించారు. బ్లూటూత్ సిగ్నల్ ఆధారంగా పనిచేసే కొన్ని యాప్‌ల లింకులను కూడా అదే గ్రూపులో షేర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ యాప్‌లపై సైబర్ నిపుణులు సాంకేతిక విశ్లేషణ చేస్తున్నారు. చాట్‌ల్లో తీవ్ర రాజకీయ హెచ్చరికలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక సందేశంలో ‘రేపే మోదీ ప్రభుత్వానికి చివరి రోజు’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ‘ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాల’ని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారు గుర్తుంచుకోండి.. మీ త్యాగాన్ని భావితరాలు గుర్తుంచుకుంటాయి.’ అని ఉండగా.. మరో సందేశంలో ‘ఎవరైనా చనిపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంద’ని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనా? లేక నిరసనలను హింసాత్మకంగా మార్చేందుకు ముందస్తు వ్యూహంలో భాగమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చాట్ సందేశాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, మొబైల్ ఫోన్ వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ప్రతి డిజిటల్ సందేశాన్ని సాంకేతికంగా ధృవీకరించిన తర్వాతే సాక్ష్యంగా పరిగణిస్తామని, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News