Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

భూ భారతితో రైతుల మధ్య గోడవలు అవుతాయి – MLC కల్వకుంట్ల కవిత

తెలంగాణ శాసన మండలిలో శుక్రవారం జరిగిన భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ధరణి తరువాత రాష్ట్రంలో భూ మోసాలు తగ్గాయి, అలాగే తెలంగాణ రైతులకు భూమికి రక్షణ కవచం లా మారింది అని కవిత అన్నారు. ‘‘ధరణితో, గతంలో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూముల విషయంలో ప్రజలను మోసం చేశాయి, కానీ కేసీఆర్ ప్రభుత్వం ధరణి ద్వారా రైతుల భూమిని రక్షించింది’’ అని పేర్కొన్నారు.

అంతేకాక, కాంగ్రెస్ పార్టీ ధరణిని నిర్ధేశించి, వాటి గురించి అనేక తప్పు ఆరోపణలు చేసిన విషయాన్ని కవిత తప్పుపట్టారు. ‘‘ధరణిలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం చెప్తే అది దారుణం. మాతృభూమి కోసం సైనికుడు ప్రాణమిస్తే, సాగు భూమి కోసం రైతు ప్రాణం వదులుతాడు’’ అని ఆమె అన్నారు.

కవిత చెప్పిన దాని ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉందని, అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి కావడంతో, 17.8 లక్షల ఎకరాల భూమి మాత్రమే వివాదాల్లో ఉందని వివరించారు. గతంలో కౌలుదారులు కోర్టులలో 20-25 సంవత్సరాల పాటు నిరీక్షించే పరిస్థితులు ఉండేవి, కానీ ధరణి వచ్చిన తర్వాత రైతులకు భూ యాజమాన్యం కాపాడటం, భూమికి రక్షణ కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని చెప్పారు.

ధరణి వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయని కవిత తెలిపారు. ‘‘35749 మంది ఉద్యోగులు 100 రోజుల్లో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేశారు, ఆ తరువాత భూ వివరాలను ధరణిలో ఎక్కించారు’’ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో, ప్రభుత్వ భూములు కూడా కాపాడబడ్డాయని పేర్కొన్నారు. ‘‘ధరణి వల్ల గుంటలను కూడా కాపాడటం, భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రజలకు చేరువవడం జరిగింది’’ అన్నారు.

అయితే, కవిత భూభారతి చట్టం గురించి కూడా మాట్లాడారు. ‘‘భూ భారతి అనేది ఒక పిచ్చి చర్యగా కనిపిస్తోంది. ఇది ఒక వ్యవస్థ రద్దు చేయడాన్ని సూచిస్తుంది’’ అని పేర్కొన్నారు. భూ భారతి చట్టంలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ జోడించడం వల్ల రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు కవిత అభిప్రాయపడ్డారు. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవడం మంచిది అని ఆమె సూచించారు.

ధరణి తీసుకురావడంతో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ‘‘భూభద్రత’’ మరియు ‘‘రైతు బంధు’’ వంటి సంక్షేమ పథకాలు అందుకున్నాయని కవిత గుర్తుచేశారు. ‘‘ధరణి కారణంగా పంట రుణాలు, బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు, రైతులకు అనేక విధాలుగా మేలు చేశాయి’’ అని ఆమె చెప్పారు.

కవిత చివరగా, ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు భయపెట్టి శిక్షలతో భూ భారతి చట్టాన్ని అమలు చేయడం సరికాదు. భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నయం చేయడమే ముఖ్యం’’ అని అన్నారు.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News