Thursday, September 3, 2026
27.3 C
Hyderabad

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం
ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట
అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్
ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు
నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ
ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు
సురేఖ వ్యవహారాన్ని అంతర్గతంగా చూడొద్దని వినతి

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఢిల్లీని తాకాయి. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. పార్టీ అగ్రనేతలతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఆమెకు పడిగాపులు తప్పలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సురేఖ భేటీ ముక్తసరిగా, మూడు ముక్కల్లోనే ముగిసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆమె ఏఐసీసీ కార్యాలయంలోనే చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సురేఖ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో వ్యక్తమైన అసంతృప్తి, తన వాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు. అయితే అధిష్ఠానం ఆమెను సీరియస్ గా తీసుకోలేదు. పార్టీ పెద్దల నుంచి తగినంత సమయం లభించకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది.

ఖర్గేతో జరిగిన సమావేశంలో సురేఖ తనకు ఎదురవుతున్న రాజకీయ పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఖర్గే పెద్దగా ఆసక్తి చూపకపోగా, పీసీసీ స్థాయిలోనే చూసుకోండని చెప్పినట్లు తెలిసింది.

ఇదే సమయంలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు సురేఖ ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో ఏఐసీసీ కార్యాలయంలోనే ఆమె రోజంతా వేచి చూశారు. చివరకు నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు సురేఖను దాదాపు పార్టీ నుంచి పక్కన పెట్టినట్లేనని, మంత్రి పదవికి ఉద్వాసన తప్పదన్న సంకేతాలేనని పార్టీలోని వారే తేల్చేస్తున్నారు. ఆమె అనుచరులు సైతం కొండా సురేఖపై వేటు తప్పదని, అలా జరిగితే, ఆమె బీజేపీవైపునకు మొగ్గవచ్చన్న సంకేతాలిస్తున్నారు. అలా జరిగితే, తాము మాత్రం కాంగ్రెస్ తోనే ఉంటామని కూడా కొందరు చెబుతున్నారు.

ఇదిలావుంటే, సురేఖ డిల్లీలో కొద్దిసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులోనూ ఏ మాత్రం తగ్గకపోవడం పలువురిని ఆశ్చర్య పరచింది. ‘క్రమశిక్షణ చర్యలు, షోకాజ్ నోటీసులు.. సీఎం నుంచే మొదలు పెడదాం. ఎమ్మెల్యే టికెట్లను ఎలా ప్రకటిస్తారు? పదేళ్ళు నేనే సీఎం అని ఎలా అంటారు? భట్టి భార్య వసూళ్ళు? పొంగులేటి దౌర్జన్యాల మాటేమిటి? పీసీసీని 50 కోట్లకు కొన్నారన్న కోమటిరెడ్డి మాటేమిటి? నా బిడ్డ ఆవేదనలోతప్పే లేదు. ప్రశ్నిస్తే షో కాజా? నన్ను ముట్టుకుంటే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం. రాజీనామా చేయాలని నన్నెవరూ కోరలేదు. నిజాలు బయట పెడతారనే నా ఓఎస్డీ అరెస్టు. బీసీలంటే అలుసా? బీసీని కాబట్టే నాపై ఇన్ని కుట్రలు’ చేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖలో పశ్చాత్తాపమే కనిపించకపోవడం, అధిష్ఠానం ఆసక్తి కనబరచకపోవడాన్ని బట్టి కొండా సురేఖ కాంగ్రెస్ తో ప్రయాణం దాదాపు పూర్తయినట్లుగానే భావించాల్సి వస్తున్నది.
ఇదిలావుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో వరుసగా భేటీ కావడం. మల్లికార్జున ఖర్గేతో, అనంతరం కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమై తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా సురేఖ వ్యవహారాన్ని వ్యక్తిగత లేదా అంతర్గత వివాదంగా చూడకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణించాలని రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సురేఖపై అధిష్ఠానం తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు.

Latest News

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం...

ఉగ్రమూలాలపై పాక్ కు భారత్ మరో హెచ్చరిక!?|EDITORIAL

పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకుంటే మాటలకంటే చర్యలు ముఖ్యం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పారదర్శకంగా, నిరంతరంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక సాధనంగా చూసిన విధానాలకు స్వస్తి చెప్పి, పొరుగుదేశాలతో విశ్వాసాన్ని...

సెప్టెంబర్ 03, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 01.39 వరకు ఉపరి సప్తమి నక్షత్రం కృత్తిక రాత్రి 12.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యాఘాత రాత్రి 07.56 వరకు ఉపరి హర్షణ కరణం భద్ర పగలు 02.43 వరకు ఉపరి బవ రాహుకాలం...

హైకమాండ్‌ ముందు కొండా సురేఖ బాంబ్‌..|KONDA SUREKHA|CONGRESS

రేవంత్‌పై చర్యలకు డిమాండ్‌..|CM|REVANTH REDDY ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్‌ రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్‌!|KOMATIREDDY RAJAGOPAL REDDY|WARNING ఢిల్లీలోని ఇందిరా భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు,...

సిడెం సేపట్లనే బరువు తగ్గొచ్చా!?|ADUGU TRENDS

ఒగప్పుడంటే ఎండా, వానా, సలి, శేను, శెలకా, బరువు పనులు, కట్టం బతుకులు..ఇగిప్పుడంటే ఏసీలు, ప్యాన్ల కింద కుర్సీలల్ల జీతాలైపాయె. కట్టం తక్కువాయె ఒత్తిడి ఎక్కువాయె. గందుకే శానా మంది బరువులు పెరిగి,...

సర్కార్, పోలీసులు, సీజేపీకి అసలైన పరీక్ష!?|EDITORIAL

సీజేపీ గత ఆందోళనల సందర్భంగా అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న ఆరోపణలను కూడా తేలికగా తీసుకోలేం. అయితే ఖలిస్తాన్ అనుకూల శక్తులు లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరసనలో చేరతారన్న వాదనలను నిర్ధారిత ఆధారాలు లేకుండా...

సెప్టెంబర్ 02, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 05.40 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం భరణి రాత్రి 02.12 వరకు ఉపరి కృత్తిక యోగం ధ్రువ రాత్రి 10.41 వరకు ఉపరి వ్యాఘాత కరణం గరజి సాయంత్రం 04.44 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

సెప్టెంబర్ 01, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 07.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అశ్విని రాత్రి 03.17 వరకు ఉపరి భరణి యోగం వృద్ధి రాత్రి 01.14 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ ఉదయం 07.12 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News