ASTROLOGY|జ్యోతిష్కుడు వేణుస్వామి|VENU SWAMY సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 21 (అడుగు న్యూస్):
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలుగా భక్తులు విశ్వసించే సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో మేడారం జాతరపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భక్తులు పెద్ద సంఖ్యలో కూడే ప్రాంతాల్లో 2026లో పెను సంచలనాలు జరిగే అవకాశముందని శాస్త్ర ఆధారంగా వ్యాఖ్యానించారు. అది మేడారం జాతరలోనైనా, పుష్కరాల్లోనైనా, దేవాలయాల్లోనైనా కావొచ్చని చెప్పారు. గతంలో రైలు, విమాన ప్రమాదాలపై తాను చేసిన అంచనాలు నిజమయ్యాయని పేర్కొంటూ, ఈ ఏడాది ప్రకృతి, అగ్ని, వాహన ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, జాతరలో భాగంగా జనవరి 27న పగిడిద్దరాజు, జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క దేవత కుంకుమ భరిణె రూపంలో గద్దెపై ప్రతిష్ఠించబడనుంది. జనవరి 30న బెల్లం సమర్పణ, 31న వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. దాదాపు కోటికి పైగా భక్తులు ఈ మహాజాతరలో పాల్గొననున్నట్లు అంచనా.

