Thursday, August 6, 2026
29 C
Hyderabad

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్!
తప్పెవరిది? శిక్షలెవరికి?
మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి?
దళారుల ప్రమేయం నిజం కాదా?
మార్కెటింగ్ శాఖదే బాధ్యతా?
కేంద్రం ఎందుకు స్పందించదు?
వరంగల్ జేడీఎం సప్పెన్షన్!
7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు
సీసీఐ పత్తి అవినీతిపై ‘అడుగుగ్రౌండ్ రిపోర్ట్

దేశమంతటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా పత్తి కొనుగోలు చేస్తోంది. ప్రతిసారీ సీసీఐ కొనుగోళ్ళ కంటే కూడా కొనుగోల్ మాల్ మీదే వివాదాలు ఎక్కువగా ముసురుకుంటున్నాయి. గతేడాది జరిగిన అవినీతిపై తాజాగా మార్కెటింగ్ శాఖ అధికారులకు నోటీసులివ్వడం ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం వాదాస్పదమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది. అవినీతిలో అనేక మంది పాలు పంచుకున్నా, ఒక్క మార్కెటింగ్ శాఖ మీదే చర్యలెందుకు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కేంద్ర సంస్థల వైఫల్యాలపై కేంద్రం ఎందుకు స్పందించదు? ఏటేటా దగా పడుతున్న రైతులు సంధిస్తున్న ప్రశ్నలెన్నో?

(అడుగు ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో జరిగిన అవినీతిలో బాధ్యులెవరు? సీసీఐ అధికారుల పాత్ర ఎంత? మార్కెటింగ్ శాఖ అధికారుల బాధ్యతెంత? మొత్తం అవినీతిలో ఒక్క మార్కెటింగ్ శాఖ అధికారులను మాత్రమే భాద్యులను చేయడం సబబేనా? అసలు అవినీతి ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు?

గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాల వ్యవహారంలో 84 మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేయగా, తాజాగా మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని సస్పెన్షన్ చేయడం వివాదాస్పదంగానేగాక, చర్చనీయాంశంగా మారింది.

ఇదీ వెసలుబాటు
పట్టాదారు పాసు పుస్తకాలు లేని కౌలు రైతులు, పోడుభూములు చేసే రైతులకు సరైన పత్రాలు లేని కారణంగా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వెసలుబాటు కల్పించింది. ఈ వెసలుబాటు ఆసరాగా దళారులతో కలిసి, మిల్లర్లు, అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కొందరి పేర్లతో నేరుగా దళారులు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచేశారు.

దందా సాగిందిలా?
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులంతా భాగవస్వాములే. ముందుగా వ్యవసాయ అధికారులు పత్తి రైతులను గుర్తిస్తూ, వారు సాగు చేసిన భూములు, పండిన పత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ధ్రువీకరణ పత్రాల్లో రాసిన ఒక ఎకరా పంటకు బదులు ఒకటి పక్కన సున్నా పెట్టి పది, అంతకు మించి 19 ఎకరాలు పత్తి పండినట్లుగా మిగతా అధికారులు, మిల్లర్లు కలిసి నమోదు చేశారు. ఆ మేరకు మిల్లర్ల పత్తినే తిరిగి మిల్లర్లకు పెడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముని తలా ఇంత పంచుకున్నారు.

మిల్లులే వేదికగా పత్తి కొనుగోలు
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలును వ్యవసాయ మార్కెట్లల్లో కాకుండా పత్తి మిల్లులే వేదికగా చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బాధ్యత తీసుకున్నా.. సీసీఐ కొనుగోలులో తప్పులు జరగడానికి ఒక్క మార్కెట్ అధికారులే కారణమా? పత్తి మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదా? పత్తి కొనుగోళ్లు పరిశీలించే సీసీఐ అధికారులకు బాధ్యత లేదా? అవినీతిలో రైతు సరుకుల విక్రయ దారులు, దళారుల ప్రమేయం లేదా? తప్పంతా మార్కెటింగ్ శాఖదేనా?

పత్తిపాపం తలా పిడికెడు
సీసీఐ కొనుగోలులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు.. పత్తి మిల్లర్లు, సీసీఐ అధికారులు, దళారులు, మార్కెట్ సిబ్బంది అవినీతి విషయంలో అందరి బాధ్యత ఉంది. కానీ తప్పులు అందరు చేస్తే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం అని సీసీఐ కొనుగోలు మాల్ తో పరిచయం ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు.

పత్తి పాపాన్ని పంచుకున్నారు
సీసీఐ కొనుగోలులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేది నిజం. పత్తి మిల్లర్లు, సీసీఐ, మార్కెట్ అధికారులు అందరూ ఏకమై పత్తి కొనుగోలులో పెద్ద మొత్తం దోపిడీ చేశారు. కానీ, మార్కెటింగ్ శాఖ పెద్దలు మాత్రం జేడియం తో పాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెన్షన్ చేసింది. ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సైతం డబ్బులు అందాయి. చివరికి రైతు సంఘ నాయకులకు.. మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి మరీ, సీసీఐ పత్తి కొనుగోలు అవినీతి బయటికి పొక్కకుండా నోర్లు మూయించారు.

బాధ్యులపై కేసులేవి?
సీసీఐలో జరిగిన అవినీతి విషయంలో కేవలం మార్కెటింగ్ శాఖ ఉద్యోగులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా అవినీతిలో భాగం పంచుకున్న పత్తి మిల్లర్లు సీసీఐ అధికారులు, రైతు సరుకుల విక్రయదారులు, దళారులు, మార్కెటింగ్ సిబ్బంది, దడ్వాయిలు అందరిపై కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని జైల్లో వేసి శిక్షించాలి.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News