Friday, July 17, 2026
24.5 C
Hyderabad

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్!
తప్పెవరిది? శిక్షలెవరికి?
మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి?
దళారుల ప్రమేయం నిజం కాదా?
మార్కెటింగ్ శాఖదే బాధ్యతా?
కేంద్రం ఎందుకు స్పందించదు?
వరంగల్ జేడీఎం సప్పెన్షన్!
7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు
సీసీఐ పత్తి అవినీతిపై ‘అడుగుగ్రౌండ్ రిపోర్ట్

దేశమంతటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా పత్తి కొనుగోలు చేస్తోంది. ప్రతిసారీ సీసీఐ కొనుగోళ్ళ కంటే కూడా కొనుగోల్ మాల్ మీదే వివాదాలు ఎక్కువగా ముసురుకుంటున్నాయి. గతేడాది జరిగిన అవినీతిపై తాజాగా మార్కెటింగ్ శాఖ అధికారులకు నోటీసులివ్వడం ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం వాదాస్పదమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది. అవినీతిలో అనేక మంది పాలు పంచుకున్నా, ఒక్క మార్కెటింగ్ శాఖ మీదే చర్యలెందుకు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కేంద్ర సంస్థల వైఫల్యాలపై కేంద్రం ఎందుకు స్పందించదు? ఏటేటా దగా పడుతున్న రైతులు సంధిస్తున్న ప్రశ్నలెన్నో?

(అడుగు ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో జరిగిన అవినీతిలో బాధ్యులెవరు? సీసీఐ అధికారుల పాత్ర ఎంత? మార్కెటింగ్ శాఖ అధికారుల బాధ్యతెంత? మొత్తం అవినీతిలో ఒక్క మార్కెటింగ్ శాఖ అధికారులను మాత్రమే భాద్యులను చేయడం సబబేనా? అసలు అవినీతి ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు?

గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాల వ్యవహారంలో 84 మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేయగా, తాజాగా మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని సస్పెన్షన్ చేయడం వివాదాస్పదంగానేగాక, చర్చనీయాంశంగా మారింది.

ఇదీ వెసలుబాటు
పట్టాదారు పాసు పుస్తకాలు లేని కౌలు రైతులు, పోడుభూములు చేసే రైతులకు సరైన పత్రాలు లేని కారణంగా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వెసలుబాటు కల్పించింది. ఈ వెసలుబాటు ఆసరాగా దళారులతో కలిసి, మిల్లర్లు, అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కొందరి పేర్లతో నేరుగా దళారులు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచేశారు.

దందా సాగిందిలా?
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులంతా భాగవస్వాములే. ముందుగా వ్యవసాయ అధికారులు పత్తి రైతులను గుర్తిస్తూ, వారు సాగు చేసిన భూములు, పండిన పత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ధ్రువీకరణ పత్రాల్లో రాసిన ఒక ఎకరా పంటకు బదులు ఒకటి పక్కన సున్నా పెట్టి పది, అంతకు మించి 19 ఎకరాలు పత్తి పండినట్లుగా మిగతా అధికారులు, మిల్లర్లు కలిసి నమోదు చేశారు. ఆ మేరకు మిల్లర్ల పత్తినే తిరిగి మిల్లర్లకు పెడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముని తలా ఇంత పంచుకున్నారు.

మిల్లులే వేదికగా పత్తి కొనుగోలు
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలును వ్యవసాయ మార్కెట్లల్లో కాకుండా పత్తి మిల్లులే వేదికగా చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బాధ్యత తీసుకున్నా.. సీసీఐ కొనుగోలులో తప్పులు జరగడానికి ఒక్క మార్కెట్ అధికారులే కారణమా? పత్తి మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదా? పత్తి కొనుగోళ్లు పరిశీలించే సీసీఐ అధికారులకు బాధ్యత లేదా? అవినీతిలో రైతు సరుకుల విక్రయ దారులు, దళారుల ప్రమేయం లేదా? తప్పంతా మార్కెటింగ్ శాఖదేనా?

పత్తిపాపం తలా పిడికెడు
సీసీఐ కొనుగోలులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు.. పత్తి మిల్లర్లు, సీసీఐ అధికారులు, దళారులు, మార్కెట్ సిబ్బంది అవినీతి విషయంలో అందరి బాధ్యత ఉంది. కానీ తప్పులు అందరు చేస్తే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం అని సీసీఐ కొనుగోలు మాల్ తో పరిచయం ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు.

పత్తి పాపాన్ని పంచుకున్నారు
సీసీఐ కొనుగోలులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేది నిజం. పత్తి మిల్లర్లు, సీసీఐ, మార్కెట్ అధికారులు అందరూ ఏకమై పత్తి కొనుగోలులో పెద్ద మొత్తం దోపిడీ చేశారు. కానీ, మార్కెటింగ్ శాఖ పెద్దలు మాత్రం జేడియం తో పాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెన్షన్ చేసింది. ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సైతం డబ్బులు అందాయి. చివరికి రైతు సంఘ నాయకులకు.. మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి మరీ, సీసీఐ పత్తి కొనుగోలు అవినీతి బయటికి పొక్కకుండా నోర్లు మూయించారు.

బాధ్యులపై కేసులేవి?
సీసీఐలో జరిగిన అవినీతి విషయంలో కేవలం మార్కెటింగ్ శాఖ ఉద్యోగులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా అవినీతిలో భాగం పంచుకున్న పత్తి మిల్లర్లు సీసీఐ అధికారులు, రైతు సరుకుల విక్రయదారులు, దళారులు, మార్కెటింగ్ సిబ్బంది, దడ్వాయిలు అందరిపై కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని జైల్లో వేసి శిక్షించాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News