Friday, May 29, 2026
33.2 C
Hyderabad

సౌ‘భాగ్య’నగరంగా హైదరాబాద్ నిలిచేదెలా!?|EDITORIAL

హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాద్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్ట్ వేర్, ఫార్మా, విద్య, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో కూడా భాగ్యనగరంగా ప్రఖ్యాతి గాంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాద్ కు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్ర మట్టం నుండి 541 మీ. -1776 అడుగుల- ఎత్తులో ఉంది. నగర వైశాల్యం 260 చ.కి.మీ. అంటే 00 చ.మైళ్ళు. జన సాంద్రత చ.కి.మీ. కి 10,477గా ఉంది. రాష్ట్ర జనాభాలో 4వ వంతు జనాభా ఇక్కడే ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా, ప్రస్తుతం కోటి దాటిన జనాభా, 2031 నాటికి అది 1 కోటి 84 లక్షలకు పెరుగుతుందనే అంచనా.

హెచ్ఎండిఎ 2031 కి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను అదిగమించి 2050పై దృష్టి సారించింది, ఇది వికేంద్రీకృత పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. హెచ్ఎండిఎ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిగి ఉంది. కొత్త మాస్టర్ ప్లాన్ కింద, హైదరాబాద్‌లో రూ.17,212 కోట్ల వ్యయంతో 7,034 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్‌లో R1, R2 వంటి వివిధ జోన్‌లు ఉన్నాయి,

ఈ మాస్టర్ ప్లాన్ లు ఎలా ఉన్నప్పటికీ, అమలవడానికి మరికొంత సమయం కూడా పట్టవచ్చు. కానీ, ప్రస్తుతం చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్‌ రోడ్లు వరదలను తలపిస్తున్నాయి. మురుగునీటి కాలువలు జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద రద్దీ నరకానికి నకలుగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందీగా మారుతోంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది. తక్షణ సమస్యలపై కూడా ద్రుష్టి సారిచాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్‌ విస్తరిస్తున్నా అందుకు తగ్గట్లుగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు వింటి కనీస మౌలిక వసతులు అందుబాటులో లేవు. రోడ్ల మీద పడిన వర్షపు నీరు నిరాటంకంగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వేలకోట్ల ఆదాయం వస్తున్నా నగరం అభివృద్ది విషయంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదు. హుస్సేన్‌ సాగర్‌ను కొబ్బరినీళ్లలా తయారు చేస్తానని ప్రగల్భాలు పలికిన వాళ్ళు పత్తా లేకుండా పోయారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. హైదరాబాద్‌ సమగ్రాభివృద్దికి ప్రణాళికలు అమలు కావాలి. ప్రధానంగా మురుగునీరు, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ట్రాఫిక్‌ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపై వెలసిన ఆలయాలు, దర్గాలు, ఇతర కట్టడాల తొలగేంచేయాలి. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. హైడ్రా పనితీరు బాగుంది. ప్రజలను కూడా ఇందులో బాధ్యులను, భాగస్వాములను చేయాలి. శివారు ప్రాంతాలు విస్తరించి, నగరంలో కలిసి పోవడంతో, సిటీ ప్లానింగ్, పట్టణీకరణ భవిష్యత్ ఆధారంగా చేయాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ.ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం జరగాలి. ఎయిర్‌ పోర్ట్‌ వరకూ, పాత నగరానికి మెట్రో విస్తరణ సాకారం కావాలి. మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్‌ వంటివన్నీ కూడా ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేవే.

ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగు రోడ్డు వరకు విస్తరిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున, జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాల పరిరక్షించడం, అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో ప్రధాన భూమికను పోషించనుంది. విపత్తుల నిర్వహణలోనూ అది కీలకం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్‌, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి కలిగించాలి. ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించాలి. వరద నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేయాలి. నిర్దిష్టమైన బృహత్‌ లక్ష్యాలతో సాగితేనే హైదరాబాద్‌ మంచి నగరంగా రాణించగలదు. పైగా హైదరాబాద్ కి ప్రపంచంలోనే అత్యంత సెఫ్టీ నగరంగా పేరుంది. అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉన్న ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అందుకుతగ్గ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి. అప్పుడే తన పూర్వ పేరుకు తగ్గట్లుగా భాగ్యనరం అవుతుంది. అందరికీ సౌభాగాన్ని అందిస్తుంది.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News