Tuesday, July 14, 2026
26.4 C
Hyderabad

సౌ‘భాగ్య’నగరంగా హైదరాబాద్ నిలిచేదెలా!?|EDITORIAL

హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాద్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్ట్ వేర్, ఫార్మా, విద్య, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో కూడా భాగ్యనగరంగా ప్రఖ్యాతి గాంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాద్ కు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్ర మట్టం నుండి 541 మీ. -1776 అడుగుల- ఎత్తులో ఉంది. నగర వైశాల్యం 260 చ.కి.మీ. అంటే 00 చ.మైళ్ళు. జన సాంద్రత చ.కి.మీ. కి 10,477గా ఉంది. రాష్ట్ర జనాభాలో 4వ వంతు జనాభా ఇక్కడే ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా, ప్రస్తుతం కోటి దాటిన జనాభా, 2031 నాటికి అది 1 కోటి 84 లక్షలకు పెరుగుతుందనే అంచనా.

హెచ్ఎండిఎ 2031 కి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను అదిగమించి 2050పై దృష్టి సారించింది, ఇది వికేంద్రీకృత పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. హెచ్ఎండిఎ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిగి ఉంది. కొత్త మాస్టర్ ప్లాన్ కింద, హైదరాబాద్‌లో రూ.17,212 కోట్ల వ్యయంతో 7,034 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్‌లో R1, R2 వంటి వివిధ జోన్‌లు ఉన్నాయి,

ఈ మాస్టర్ ప్లాన్ లు ఎలా ఉన్నప్పటికీ, అమలవడానికి మరికొంత సమయం కూడా పట్టవచ్చు. కానీ, ప్రస్తుతం చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్‌ రోడ్లు వరదలను తలపిస్తున్నాయి. మురుగునీటి కాలువలు జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద రద్దీ నరకానికి నకలుగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందీగా మారుతోంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది. తక్షణ సమస్యలపై కూడా ద్రుష్టి సారిచాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్‌ విస్తరిస్తున్నా అందుకు తగ్గట్లుగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు వింటి కనీస మౌలిక వసతులు అందుబాటులో లేవు. రోడ్ల మీద పడిన వర్షపు నీరు నిరాటంకంగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వేలకోట్ల ఆదాయం వస్తున్నా నగరం అభివృద్ది విషయంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదు. హుస్సేన్‌ సాగర్‌ను కొబ్బరినీళ్లలా తయారు చేస్తానని ప్రగల్భాలు పలికిన వాళ్ళు పత్తా లేకుండా పోయారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. హైదరాబాద్‌ సమగ్రాభివృద్దికి ప్రణాళికలు అమలు కావాలి. ప్రధానంగా మురుగునీరు, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ట్రాఫిక్‌ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపై వెలసిన ఆలయాలు, దర్గాలు, ఇతర కట్టడాల తొలగేంచేయాలి. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. హైడ్రా పనితీరు బాగుంది. ప్రజలను కూడా ఇందులో బాధ్యులను, భాగస్వాములను చేయాలి. శివారు ప్రాంతాలు విస్తరించి, నగరంలో కలిసి పోవడంతో, సిటీ ప్లానింగ్, పట్టణీకరణ భవిష్యత్ ఆధారంగా చేయాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ.ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం జరగాలి. ఎయిర్‌ పోర్ట్‌ వరకూ, పాత నగరానికి మెట్రో విస్తరణ సాకారం కావాలి. మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్‌ వంటివన్నీ కూడా ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేవే.

ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగు రోడ్డు వరకు విస్తరిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున, జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాల పరిరక్షించడం, అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో ప్రధాన భూమికను పోషించనుంది. విపత్తుల నిర్వహణలోనూ అది కీలకం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్‌, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి కలిగించాలి. ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించాలి. వరద నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేయాలి. నిర్దిష్టమైన బృహత్‌ లక్ష్యాలతో సాగితేనే హైదరాబాద్‌ మంచి నగరంగా రాణించగలదు. పైగా హైదరాబాద్ కి ప్రపంచంలోనే అత్యంత సెఫ్టీ నగరంగా పేరుంది. అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉన్న ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అందుకుతగ్గ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి. అప్పుడే తన పూర్వ పేరుకు తగ్గట్లుగా భాగ్యనరం అవుతుంది. అందరికీ సౌభాగాన్ని అందిస్తుంది.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News