Friday, July 17, 2026
26.4 C
Hyderabad

ఓట్ చోర్ ఎవరు? పార్టీలా!? ప్రజలా!?|EDITORIAL

‘ఓట్ చోరీ’తో ఇండియా కూటమికి సంబంధం లేదని ఆ కూటమిలో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలనం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ బహిరంగసభ నిర్వహించిన తెల్లారే ఆయన స్పందించిడం గమనార్హం. ‘ప్రతి పార్టీకి తన సొంత ఎజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఓట్ చోరీ, సర్ లను తమ ప్రధాన పోరాటంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏం చేయలో మనం వాళ్ళకు చెప్పలేం కదా?’ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లుందని కూడా వ్యాఖ్యానించారు. ఒమర్ వ్యాఖ్యలను బట్టి, ఓట్ చోరీ జరుగుతోందా? జరిగితే ఎవరా ఓట్ చోర్ లు? పార్టీలా? ప్రజలా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలుఆశలకు, ఆశయాలకు సంకేతాంగా నిలుస్తుంది. అయితే, భారత రాజకీయాల్లో తరచూ వినిపించే మాట.‘ఓట్ల దొంగతనం’, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘అధికార పార్టీయే ఓట్ల దొంగ’. ఈ ఆరోపణలు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపైనా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఓట్ల దొంగ ఎవరు?
‘ఓట్ చోరీ’ అంటే కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కాదు. డబ్బు, మద్యం, కులం, మతం, అధికార దుర్వినియోగం, మీడియా ప్రభావం, అలవికాని హామీలన్నీ ఓటు స్వేచ్ఛను దెబ్బతీసే పద్ధతులే. ఓట్ చోరీ సాంకేతిక సమస్య మాత్రమే కాక, నైతిక వైఫల్యం కూడా.

దేశంలో కాంగ్రెస్ దీర్ఘకాలంగా అధికారంలో ఉంది. అది వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేయడం, అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం వంటి విమర్శలు కాంగ్రెస్‌పై బలంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు, కుటుంబ పాలన, స్థానిక నాయకుల అక్రమాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి పరోక్ష “ఓట్ చోర్” పద్ధతులే.

బీజేపీపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు, జాతీయత పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మీడియా మీద ప్రభావం, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను తగ్గించడం వంటి అంశాలు బీజేపీని విమర్శలకు గురిచేశాయి. ప్రతిపక్ష పార్టీలను, నేతలను విచారణ సంస్థల ద్వారా భయపెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యలు. ఇవన్నీ ప్రత్యక్ష ఓట్ చోరీ కాకపోయినా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాలని ప్రభావితం చేసే పద్ధతులే.

ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జాబితాలేకే వస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, సమాజ్‌వాది, బీఎస్పీ వంటి పార్టీలు కూడా డబ్బు, కులం, మతం, ప్రాంతీయ, ప్రలోభాల భావోద్వేగాలపై రాజకీయాలను నెరుపుతున్నవే. “మనోడే గెలవాలి” అనే భావన ప్రజాస్వామ్యాన్ని కుటుంబ లేదా కుల రాజకీయం వైపు నడిపింది. ఇక్కడ ఓటు ప్రజల స్వేచ్ఛా అభిప్రాయానికి కాకుండా సామాజిక రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.

ప్రత్యక్ష, పరోక్ష ‘ఓట్ చోరీ’లో రాజకీయ పార్టీలతో పాటు ఓటరు పాత్రను విస్మరించలేం. డబ్బు తీసుకుని ఓటేయడం, కులం లేదా మతం పేరుతో ఓటేయడం, భవిష్యత్ అభివృద్ధి కంటే తక్షణ స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రలోభాలకు లోనవడం ద్వారా ఓటరే తన ఓటును తానే అమ్ముకుంటున్నాడు.
మీడియా కూడా ఈ పాపంలో భాగమే. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ ఉండటం, ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీని నిరంతరం దూషించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కనిపించని ఓట్ చోరీ. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, అసత్యాలు ప్రచారమై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఓట్ చోరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థీక్రుతంగా విస్తరించిన విషం. పార్టీలను, ప్రజలను కూడా దోషులుగా పరగణించాల్సందే. ఇది మన రాజకీయ సంస్కృతిలో ఉన్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు, ప్రతి పౌరుడిది కూడా. ఓటరు చైతన్యం, స్వతంత్ర సంస్థల బలోపేతం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ, బాధ్యతాయుత మీడియా కలిసి పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News