Friday, July 31, 2026
25.7 C
Hyderabad

జీవ వైవిధ్యంతోనే జీవన సాఫల్యం!|EDITORIALS

ప్రకృతి మానవ జాతికి లభించిన గొప్ప వరం. ఈ సకల చరాచర ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రకృతే. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ, అదే ప్రకృతికి మనమేం ఇస్తున్నాం? విధ్వంసం, వినాశనం చేయడం తప్ప! ఆవిధ్వంసమే ఇప్పుడు మొత్తం కేవలం ప్రకృతికే కాదు స్రుష్టి వినాశనానికే దారి తీస్తున్నది. మొక్కే కదా అని పీకేస్తే, చెట్టే కదా అని తొలగిస్తే, చెత్తే కదా అని వేసేస్తే, పొగే కదా అని వదిలేస్తే, అంతా చేయట్లేదా? నేనొక్కరినే కాదు కదా! అని నిర్లక్ష్యం వహిస్తే, ఏర్పడుతున్న విలయం అంతా అంతా ఇంతా కాదు. తనను తాను ఉద్ధరించుకుంటేనే ఉద్యమమైనా, విప్లవమైనా, చివరకు మార్పైనా, మరేదైనా.|EDITORIALS

ప్రకృతిని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనుగడతోనే మన మనుగడ ఇమిడి ఉంది. భారతీయ సనాతన ధర్మం, సంస్క్రుతి, సంప్రదాయాలు మొత్తం ప్రకృతిని పూజించడం, ఆరాధించడంతోనే ముడిపడి ఉన్నాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోనే గాక, మన జీవన విధానంలోనూ పరంపరగా వస్తూ ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని లను పంచభూతాలు అన్నాం. జీవధాతువే పంచభూతాల్లో సజీవంగా ఉంది. అందుకే మనం మన భూమిని మనకు జన్మనిచ్చే తల్లితో సమానంగా చూస్తాం. భూమాత, భూతల్లి అంటున్నాం. నీటినిచ్చే నదులన్నింటికీ తల్లికి సమానమైన స్త్రీలింగంతో కూడిన పేర్లే పెట్టుకున్నాం. చివరకు ఉగాది, బతుకమ్మలాంటి దాదాపు అన్ని పండుగలు కూడా ప్రకృతి సంబంధమైనవే. ప్రకృతితో మానవాళిది, జీవకోటిది విడదీయలేని పెనవేసుకున్న పేగు బంధం. ప్రకృతిని పూజించుకోవడం, అవసరమైన మేరకు అనుభవించడం, రక్షించుకోవడం, జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించడమనే ప్రక్రియ మన జీవన విధానం చేసుకోవాలి. చెట్టును, పుట్టను పూజించడం వెనక ఉన్న మర్మం కూడా ఇదే.|EDITORIALS

నిజానికి మానవుడు భూమ్మీద పడినప్పటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. మిగతా జీవరాశిలో విధ్వంసం కంటే జీవ వైవిధ్యమే ఉంటుంది. ప్రకృతి బహుషా మనిషి చేసినంత వినాశనం మరే జీవి చేయడం లేదనే అతిశయోక్తి కానే కాదు. ఈనాటి సునామీ లాంటి ప్రళయాల నుంచి, అతివ్రుష్టి, అనావ్రుష్టి, కరువు కాటకాలు, ప్రాణాంతక, అంటువ్యాధులు ప్రబలడం వరకు అంతా ప్రకృతితో ముడిపడినవే. అంతెందుకు మనం పీల్చేగాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం కావడానికి మానవుడే అంటే మనమే కారణం. మానవ తప్పిదాల కారణంగా లేదా విధ్వంసం కారణంగా జీవజాతుల మనుగడ కూడా ప్రశ్నార్థకం అయింది. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవరాశుల్లో, వనరుల్లో, భూమి మీద సకల స్రుష్టిలోనే సమతౌల్యం దెబ్బతిని జీవవైవిధ్యం సర్వనాశనమై నశించిపోతోంది. జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపు కోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక థీమ్ తో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. కానీ, అది తత్ దినంలా మారి పోయింది.|EDITORIALS

భారతీయ సంస్కృతిలో భాగంగానే చెట్టు, చేమ, పశుపక్ష్యాదులను పూజించటం జరుగుతోంది. జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుషులకు చేదోడుగా ఉంటాయి. మనుషులతో మమేకమై జీవిస్తున్నాయి. ఇతర జంతుజాతులు కూడా ఒకదానిని ఒకటి ఆహారంగా తీసుకునే లక్షణం కారణంగా ఆయా జీవరాశుల వైవిధ్యం కూడా సమతౌల్యం అవుతున్నది. జీవ జాతుల జీవన క్రియల్లో విడుదల అయ్యే వ్యర్థాలు కూడా భూసారానికి ఉపయోగపడే విశిష్టత ప్రకృతిలోనే ఉండటం విశేషం. ఫలాలు, ఔషధ మొక్కలు, ఆహారాన్నిచ్చే మొక్కలు, వనరులు ఎంత అద్భుతమైనదీ స్రుష్టి. మానవ ఆహారం మొత్తం ప్రకృతి మనకు ఇస్తుంది. జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువ ఆవు. ఆవు పాలు, పేడ, మూత్రం, నెయ్యి ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవును పూజించే సంస్కారం బహుషా ఇందుకే ఏర్పడిందేమో.|EDITORIALS

పెరుగుతున్న భూతాపం, భూవ్మిూద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. అందుకే ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ సమతౌల్యాన్ని పాటించాలి. మనం కేవలం కొంత కాలం జీవించిపోవడానికి మాత్రమే ఈ భూమ్మీద జన్మించాం. మనకంటే ముందు తరాలు, మన తర్వాత తరాలు కూడా ఉంటాయి. మన ముందు తరాలు ప్రకృతిని కాపాడి మనకిచ్చారు కాబట్టే ఇవ్వాళ మనం బతికి బట్టకడుతున్నాం. అలాగే ఇంతకంటే మెరుగైన ప్రకృతిని అంటే జీవించే అవకాశాలను మనం మన తర్వాత తరాలకు ఇవ్వాలి. నిజానికి మనం ఇవ్వాళ మన పిల్లలకు సంపాదించి ఇస్తున్న ఆస్తుల కంటే కూడా పవిత్రమైన మెరుగైన ప్రకృతిని రక్షించి అందించడమే అన్నింటికంటే ముఖ్యం. జంతువులేవీ మనుషుల్లా ఆస్తులను కూడబెట్టడం లేదు. ఆలోచనలో, మాటలో తప్ప మనం జంతువులకంటే భిన్నమేమీ కాము. కానీ స్వార్థంతో, నిర్లక్ష్యంతో నీడనిచ్చే చెట్టునే నరక్కుంటున్నట్లుగా మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఈ స్రుష్టిని సర్వనాశనం చేసుకుంటున్నాం. అలాగే మన భివిష్యత్తును కూడా.|EDITORIALS

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News