Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

జీవ వైవిధ్యంతోనే జీవన సాఫల్యం!|EDITORIALS

ప్రకృతి మానవ జాతికి లభించిన గొప్ప వరం. ఈ సకల చరాచర ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రకృతే. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ, అదే ప్రకృతికి మనమేం ఇస్తున్నాం? విధ్వంసం, వినాశనం చేయడం తప్ప! ఆవిధ్వంసమే ఇప్పుడు మొత్తం కేవలం ప్రకృతికే కాదు స్రుష్టి వినాశనానికే దారి తీస్తున్నది. మొక్కే కదా అని పీకేస్తే, చెట్టే కదా అని తొలగిస్తే, చెత్తే కదా అని వేసేస్తే, పొగే కదా అని వదిలేస్తే, అంతా చేయట్లేదా? నేనొక్కరినే కాదు కదా! అని నిర్లక్ష్యం వహిస్తే, ఏర్పడుతున్న విలయం అంతా అంతా ఇంతా కాదు. తనను తాను ఉద్ధరించుకుంటేనే ఉద్యమమైనా, విప్లవమైనా, చివరకు మార్పైనా, మరేదైనా.|EDITORIALS

ప్రకృతిని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనుగడతోనే మన మనుగడ ఇమిడి ఉంది. భారతీయ సనాతన ధర్మం, సంస్క్రుతి, సంప్రదాయాలు మొత్తం ప్రకృతిని పూజించడం, ఆరాధించడంతోనే ముడిపడి ఉన్నాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోనే గాక, మన జీవన విధానంలోనూ పరంపరగా వస్తూ ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని లను పంచభూతాలు అన్నాం. జీవధాతువే పంచభూతాల్లో సజీవంగా ఉంది. అందుకే మనం మన భూమిని మనకు జన్మనిచ్చే తల్లితో సమానంగా చూస్తాం. భూమాత, భూతల్లి అంటున్నాం. నీటినిచ్చే నదులన్నింటికీ తల్లికి సమానమైన స్త్రీలింగంతో కూడిన పేర్లే పెట్టుకున్నాం. చివరకు ఉగాది, బతుకమ్మలాంటి దాదాపు అన్ని పండుగలు కూడా ప్రకృతి సంబంధమైనవే. ప్రకృతితో మానవాళిది, జీవకోటిది విడదీయలేని పెనవేసుకున్న పేగు బంధం. ప్రకృతిని పూజించుకోవడం, అవసరమైన మేరకు అనుభవించడం, రక్షించుకోవడం, జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించడమనే ప్రక్రియ మన జీవన విధానం చేసుకోవాలి. చెట్టును, పుట్టను పూజించడం వెనక ఉన్న మర్మం కూడా ఇదే.|EDITORIALS

నిజానికి మానవుడు భూమ్మీద పడినప్పటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. మిగతా జీవరాశిలో విధ్వంసం కంటే జీవ వైవిధ్యమే ఉంటుంది. ప్రకృతి బహుషా మనిషి చేసినంత వినాశనం మరే జీవి చేయడం లేదనే అతిశయోక్తి కానే కాదు. ఈనాటి సునామీ లాంటి ప్రళయాల నుంచి, అతివ్రుష్టి, అనావ్రుష్టి, కరువు కాటకాలు, ప్రాణాంతక, అంటువ్యాధులు ప్రబలడం వరకు అంతా ప్రకృతితో ముడిపడినవే. అంతెందుకు మనం పీల్చేగాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం కావడానికి మానవుడే అంటే మనమే కారణం. మానవ తప్పిదాల కారణంగా లేదా విధ్వంసం కారణంగా జీవజాతుల మనుగడ కూడా ప్రశ్నార్థకం అయింది. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవరాశుల్లో, వనరుల్లో, భూమి మీద సకల స్రుష్టిలోనే సమతౌల్యం దెబ్బతిని జీవవైవిధ్యం సర్వనాశనమై నశించిపోతోంది. జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపు కోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక థీమ్ తో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. కానీ, అది తత్ దినంలా మారి పోయింది.|EDITORIALS

భారతీయ సంస్కృతిలో భాగంగానే చెట్టు, చేమ, పశుపక్ష్యాదులను పూజించటం జరుగుతోంది. జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుషులకు చేదోడుగా ఉంటాయి. మనుషులతో మమేకమై జీవిస్తున్నాయి. ఇతర జంతుజాతులు కూడా ఒకదానిని ఒకటి ఆహారంగా తీసుకునే లక్షణం కారణంగా ఆయా జీవరాశుల వైవిధ్యం కూడా సమతౌల్యం అవుతున్నది. జీవ జాతుల జీవన క్రియల్లో విడుదల అయ్యే వ్యర్థాలు కూడా భూసారానికి ఉపయోగపడే విశిష్టత ప్రకృతిలోనే ఉండటం విశేషం. ఫలాలు, ఔషధ మొక్కలు, ఆహారాన్నిచ్చే మొక్కలు, వనరులు ఎంత అద్భుతమైనదీ స్రుష్టి. మానవ ఆహారం మొత్తం ప్రకృతి మనకు ఇస్తుంది. జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువ ఆవు. ఆవు పాలు, పేడ, మూత్రం, నెయ్యి ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవును పూజించే సంస్కారం బహుషా ఇందుకే ఏర్పడిందేమో.|EDITORIALS

పెరుగుతున్న భూతాపం, భూవ్మిూద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. అందుకే ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ సమతౌల్యాన్ని పాటించాలి. మనం కేవలం కొంత కాలం జీవించిపోవడానికి మాత్రమే ఈ భూమ్మీద జన్మించాం. మనకంటే ముందు తరాలు, మన తర్వాత తరాలు కూడా ఉంటాయి. మన ముందు తరాలు ప్రకృతిని కాపాడి మనకిచ్చారు కాబట్టే ఇవ్వాళ మనం బతికి బట్టకడుతున్నాం. అలాగే ఇంతకంటే మెరుగైన ప్రకృతిని అంటే జీవించే అవకాశాలను మనం మన తర్వాత తరాలకు ఇవ్వాలి. నిజానికి మనం ఇవ్వాళ మన పిల్లలకు సంపాదించి ఇస్తున్న ఆస్తుల కంటే కూడా పవిత్రమైన మెరుగైన ప్రకృతిని రక్షించి అందించడమే అన్నింటికంటే ముఖ్యం. జంతువులేవీ మనుషుల్లా ఆస్తులను కూడబెట్టడం లేదు. ఆలోచనలో, మాటలో తప్ప మనం జంతువులకంటే భిన్నమేమీ కాము. కానీ స్వార్థంతో, నిర్లక్ష్యంతో నీడనిచ్చే చెట్టునే నరక్కుంటున్నట్లుగా మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఈ స్రుష్టిని సర్వనాశనం చేసుకుంటున్నాం. అలాగే మన భివిష్యత్తును కూడా.|EDITORIALS

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News