Friday, July 17, 2026
26.4 C
Hyderabad

మాటలు సరే, చేతలేవి?|EDITORIAL

తెలంగాణ రాజకీయాలు ప్రజల అవసరాలు, రాష్ట్ర లక్ష్యాలకన్నా, అధికార లాలసకే పాకులాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వలాభం కోసం పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయ వ్యవస్థ, అదే ప్రజలను తమ రాజకీయ క్రీడలో పావులుగా మార్చే నీచ స్థాయికి దిగజారిందన్న భావన బలపడుతోంది.

బీఆర్‌ఎస్‌ పాలన ముగిసి రెండేళ్లు దాటుతున్నా, అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణలేమీ తేల్చకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం నుంచి కూకట్ పల్లి భూకబ్జాల వరకు, అక్రమ లావాదేవీలు వంటి తీవ్రమైన అంశాలు ప్రజల చర్చలో ఉన్నప్పటికీ, వాటిపై స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, అవినీతి రుజువై, న్యాయం గెలిచిందన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. పదేపదే బీజేపీ ఆరోపిస్తున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహనేమైనా ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నది విస్తృతంగా వినిపిస్తున్న మరో అంశం. ‘బంగారు తెలంగాణ’ నినాదం, చివరకు ‘బాకీల తెలంగాణ’గా మారిపోయింది. అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు, అవి ఖర్చైన తీరుకు ఏలికలెవరూ బాధ్యత వహించడంలేదు. ఒక ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శంచడానికే పరిమితమవుతే, ప్రజలకు ఒరిగేదేంటి? కేవలం నిరాశ తప్ప.

ఇక బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దుమ్మెత్తిపోస్తోంది. సరే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర పురోగతికి చేస్తోందేంటి? నిర్దిష్టంగా రాష్ట్రాభివృద్ధికి చేసిందేంటన్నది ఆ పార్టీ పనితీరుకు కొలమానం కానుంది. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి పోరాటమే లేదు.

ఇక బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసిఆర్‌ కుమార్తె కవిత, ఆపార్టీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి కూకట్‌పల్లి భూకబ్జాల వరకు ఆమె ఎత్తి చూపుతున్న అంశాలు బీఆర్‌ఎస్‌ పాలనలోని అవినీతి, బంధుప్రీతి, లోపాలను తిరిగి చర్చల్లోకి తెస్తున్నాయి. అయితే కవిత, తాను ‘కడిగిన ముత్యాన్న’ని నిరూపించుకునే ప్రయత్నం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. లిక్కర్‌ స్కామ్‌ కేసు కవిత రాజకీయ భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిలింది. కన్నవారిల్లు కాదన్న ఈ సమయంలో రాజకీయ మార్గమే ఏకైక దారిగా ఆమె ఎంచుకున్నట్లుంది. కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపరుస్తుండగా, కాంగ్రెస్‌కు అనుకోని లాభంగా కలిసివస్తోంది.
ఇదే తరుణంలో వారసత్వ రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకే కుటుంబం, ఒకే కుల ప్రాబల్యంతో పాలన సాగితే, ఆ పార్టీకి, ఆ కులానికే నష్టం కలిగిస్తుందనడానికి బీఆర్‌ఎస్‌ ఉదాహరణగా నిలిచింది.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా, పాలనలో స్పష్టత, పారదర్శకత, ప్రజల నమ్మకం పెంచే చర్యలు చేపట్టాలి. అప్పులపై శ్వేతపత్రం, అవినీతి ఆరోపణలను కాలపరిమితితో తేల్చే విచారణలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం వంటివి ప్రజలు ఆశిస్తున్న కనీస చర్యలు.
రాజకీయాలు కేవలం అధికారం, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకు బలి చేయడాన్ని చరిత్ర క్షమించదు. ప్రజలు కూడా వదలరు. ఈ తరహా రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ప్రజలే చైతన్యవంతులవ్వాలి. ప్రశ్నించాలి. బాధ్యత కోరాలి. అవసరమైతే అలాంటి రాజకీయ పార్టీలను, నాయకులను తిరస్కరించాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ప్రజలే.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News