Saturday, September 12, 2026
26.6 C
Hyderabad

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడే మేల్కొంటేనే రబీ రైతు ఆశలను, ప్రజల ఆహార భద్రతను కాపాడగలం.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

వానాకాలం ముగింపు దశకు చేరుతున్నా వరుణుడు కరుణించడంలేదు. వానలు ముఖం చాటేయడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌ సాగు ఇప్పటికే ఒడిదుడుకులకు గురైంది. ఇక సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గుముఖం పడితే రబీ సాగుపై దాని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్రాలు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

వర్షాభావం అంటే కేవలం ప్రస్తుత పంటలకు నష్టం కాదు. నేలలో తేమ తగ్గడం, చెరువులు నిండకపోవడం, రిజర్వాయర్లలోకి నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటాయి. అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు ఇది పెద్ద ప్రతికూలత. గోధుమ, శనగ, ఆవాలు వంటి పంటలకు విత్తనాలు మొలకెత్తేందుకు నేలలో తగిన తేమ అవసరం. మొదటి తడికే నీరు అందకపోతే రైతు పెట్టుబడి పెట్టడానికి కూడా వెనుకాడాల్సిన పరిస్థితి వస్తుంది.

తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో సాధారణంగా 1.32 కోట్ల ఎకరాల్లో సాగు నమోదవుతుండగా, ఈసారి 1.21 కోట్ల ఎకరాల్లోనే సాగు జరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో 92 శాతానికే పరిమితమైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 66 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 52.81 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే 20 శాతం తగ్గుదల. మరోవైపు పత్తి 47 లక్షల ఎకరాల అంచనాకు మించి 48 లక్షల ఎకరాల్లో సాగవడం, అపరాలు 6.49 లక్షల ఎకరాల నుంచి 7.86 లక్షల ఎకరాలకు పెరగడం రైతులు నీటి కొరతకు అనుగుణంగా పంటల ఎంపికలో కొంత మార్పులు చేస్తున్నారనే సంకేతం.

రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 598.9 మిల్లీ మీటర్లు కాగా, 478.2 మిల్లీమీటర్లే నమోదవడం, 20 శాతం లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా, 18 జిల్లాల్లో లోటు కొనసాగుతోంది. జనగామ, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో 40 శాతం వరకు లోటు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

వర్షాల కొరతకు తోడు భూగర్భ జలాల పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు చివరినాటికి 5.78 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ఈసారి 7.87 మీటర్లకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే సగటున రెండు మీటర్లకు పైగా నీటిమట్టం దిగజారింది. సూర్యాపేట, వికారాబాద్‌లో ఐదు మీటర్ల మేర, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌లో నాలుగు మీటర్ల వరకు, వరంగల్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మూడు మీటర్ల వరకు నీటిమట్టం తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

రైతులు పంటలను కాపాడుకునేందుకు చెరువుల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుతున్నారు. కొత్త బోర్లు వేస్తున్నారు. అయినా చుక్క నీరు పడకపోతే పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. వరుణుడు మరో వారం, పది రోజులు కరుణించకపోతే ఇప్పటికే వేసిన పంటల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇది కేవలం రైతు సమస్యగా చూడటం పొరపాటు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధాన్యాల సరఫరాపై ప్రభావం పడుతుంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల ఉత్పత్తి తగ్గితే ధరలు పెరిగి సామాన్యుడి వంటింటిపై భారం పడుతుంది. అంటే పొలంలో మొదలైన వర్షాభావం చివరకు పట్టణాల్లోని కుటుంబ బడ్జెట్‌ను తాకుతుంది.

అందుకే ప్రభుత్వం వర్షాల కోసం ఎదురుచూస్తూ కాలం గడపకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోని నీటిని శాస్త్రీయంగా వినియోగించాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. పంట నష్టాన్ని అంచనా వేసి బీమా, పరిహారం, ప్రత్యామ్నాయ విత్తనాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రత్యేక ప్రణాళిక అవసరం.

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడే మేల్కొంటేనే రబీ రైతు ఆశలను, ప్రజల ఆహార భద్రతను కాపాడగలం.

Latest News

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

సెప్టెంబర్ 10, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 09.59 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం మఖ పగలు 02.41 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ద రాత్రి 08.58 వరకు ఉపరి సాధ్య కరణం శకుని ఉదయం 09.59 వరకు ఉపరి చతుష్పాద రాహుకాలం...

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News